నూతనంగా జిల్లాకు అపాయింట్మెంట్ అయినటువంటి వైద్యాధికారులందరికీ కంగ్రాట్యులేషన్స్ తెలపడం జరిగింది

ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూర్ నాగారం అంకిత్ అధ్యక్షత వహించడం జరిగింది.

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ సమావేశ మందిరంలో వైద్యాధికారులకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూర్ నాగారం అంకిత్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈనాటి సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ మాట్లాడుతూ నూతనంగా జిల్లాకు అపాయింట్మెంట్ అయినటువంటి వైద్యాధికారులందరికీ కంగ్రాట్యులేషన్స్ తెలపడం జరిగింది. అనంతరము వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్నతమైన సేవలు అందించాలని, సేవాభావంతో ఇక్కడి గిరిజన ప్రజలకు నిరంతరము సేవలందించి మన్ననలు పొందాలని తెలిపారు. సమయపాలన పాటించాలని, ప్రతి ఒక్క వైద్యాధికారి ములుగు వెలుగు ఆప్ నందు తమ యొక్క అటెండెన్స్ వేయాలని ఆదేశించారు. ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చు రోగుల పట్ల ప్రేమ చూపాలని, వారికి నాణ్యమైన వైద్యం అందించాలని,

 ఎప్పటికప్పుడు అత్యవసర మందులు నిల్వలు చూసుకుంటూ ఉండాలని, ఆస్పత్రుల్లో నిర్వహించు పరీక్షల కొరకు రీ ఏజెంట్స్ సమకూర్చుకోవాలని తెలిపారు. రెండవసారి చేపట్టనున్న ఈ హెల్త్ ప్రొఫైల్ కు ఉన్నతమైన సేవలు అందించాలని కోరారు. అనంతరము డెంగు, మలేరియా కేసులు జిల్లాలోని పరిస్థితి గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య గారిని అడిగి తెలుసుకున్నారు .ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత గారు వైద్యాధికారులను ఉద్దేశించి జిల్లాలో ప్రభుత్వ కానుపులను పెంచాలని, వాటిలో సి సెక్షన్ డెలివరీ కాకుండా, సాధారణ కానుపులను ప్రోత్సహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య జిల్లా యొక్క ముఖచిత్రమును నూతనంగా వచ్చిన వైద్యాధికారులకు తెలియజేయడం జరిగింది.

 ఈ యొక్క కార్యక్రమంలో నూతనంగా అపాయింట్మెంట్ అయినా వైద్యాధికారులు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డెమో తిరుపతయ్య, హెచ్ ఈ సంపత్, భాస్కర్, హెల్త్ సూపర్వైజర్ వెంకట్ మొదలగు వారు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version