దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా – రాస్తారోకో

చిట్యాల, నేటిధాత్రి: దళితుడిని కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు నేటి వరకు చేయకపోవడం తో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో చిట్యాల చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ధర్నా, రాస్తారోకో నిర్వహించడం జరిగిందని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య అన్నారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతి నగర్ గ్రామానికి చెందిన పర్లపెల్లి మహేందర్ మాదిగను బిసి యాదవ్ కులానికి చెందిన బొంకూరి రాజయ్య మరియు కుమారుడు కుమార్ తండ్రి కొడుకులు ఇద్దరు కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని నవంబరు 14నాడు పిర్యాదు చేసిన నేటి వరకు ఎఫ్ఐర్ నమోదు చేయుటకు జాప్యం చేయడం వల్ల కేసును తప్పు దారి పట్టించి బాధితులకు అన్యాయం జరుగే అవకాశం ఉందని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ శాంతి నగర్ లో జరిగిన సంఘటనపై సరియైన సాక్షాలు ఉన్న ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయకుండా తప్పు దారి పట్టించి దళితుడికి అన్యాయం చేయాలని చూడటం బాధాకరమన్నారు. ఇట్టి సంఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గారికి అదనపు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు గారికి పిర్యాదు చేసిన, ఎస్సీ ఎస్టీ కమీషనర్ హెల్ప్ లైన్ లో పిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు దళితులంటే ఎందుకు అంత చిన్న చూపు? దళితులు ఎన్నికల్లో మీకు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు.? సరియైన సాక్షాలు ఉన్న సంబంధించిన పోలీసు అధికారులు ఎఫ్ఐర్ నమోదు ఎందుకు చేయడం లేదని అన్నారు. అందుకే దళిత బహుజనులకు రాజ్యాధికారం ఎంతో అవసరమని అన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్సై కృష్ణ ప్రసాద్ గారు నేను వచ్చిన తర్వాత సంఘటన జరుగుతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేస్తానని అనడం సరి కాదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితుడిని కొట్టిన బొంకూరి రాజయ్య భూమి పట్టా దారుడు, భూమికి అతనికి ఎలాంటి సంబంధం లేదని అతనికి సహకరించి అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేస్తామని చెప్పి చేయకుండా దళితుడైన మహేందర్ కు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, లేనిపక్షంలో భాదితునితో పాటు దళిత సంఘాలము ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా భారీ ఎత్తున జిల్లా, రాష్ట్రశశ వ్యాప్తంగా చేపడుతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు.

కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలి దళితుడైన పర్లపెల్లి మహేందర్ కు న్యాయం చేయాలి. పిర్యాదు దారుడు పర్లపెల్లి మహేందర్ పై, సాక్షులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంబంధించిన అధికారులకు తెలియజేయుచున్నాము. మా డిమాండ్లు పరిష్కరించే వరకు ప్రతి రోజు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలియజేయుచున్నాము.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు పర్లపెల్లి కుమార్ కట్కూరి రాజేందర్ జన్నే నరేష్ శనిగరపు శ్రీనివాస్ పర్లపెల్లి శ్రీ కాంత్ మొలుగూరి రాకేష్ పిర్యాదు దారుడు పర్లపెల్లి మహేందర్ కుటుంబ సభ్యులు పర్లపెల్లి సమ్మయ్య సమ్మక్క బంగారి రాణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version