కూసుకుంట్ల గెలుపునకు ఎంపీ వద్దిరాజు చౌటుప్పల్,తుప్రాన్ పేట,దండు మల్కాపురంలలో విస్త్రత ప్రచారం
చౌటుప్పల్ లో మున్నూరుకాపుల ఆత్మీయ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర
మున్నూరుకాపులతో భోజనం చేసిన ఎంపీ వద్దిరాజు
చౌటుప్పల్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి పోతుల యాదగిరి చేత రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నామినేషన్
కార్పోరేషన్ ఏర్పాటుకు కేసీఆర్ సుముఖం
మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోకాపేటలో 5 ఎకరాల భూమితో పాటు 5కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పోరేషన్ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.మున్నూరుకాపుల్లో ఉన్న ఐక్యత, విశ్వసనీయత, సంస్కారాన్ని గుర్తించి తనను రాజ్యసభకు పంపారన్నారు.మున్నూరుకాపులకు చెందిన తొమ్మిది మందిని ఎమ్మెల్యేలను,ఇద్దరిని ఎమ్మెల్సీలను చేశారని,నలుగురికి కార్పోరేషన్ ఛైర్మన్ పదవులిచ్చి సముచిత గౌరవించిన కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభాకర్ రెడ్డిని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని రవిచంద్ర చెప్పారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, వెన్ రెడ్డి రాజు,చల్లా హరిశంకర్,జెన్నాయికోడే జగన్మోహన్,గుండ్లపల్లి శేషగిరిరావు,చక్రం జంగయ్య,గంధం సతీష్,కేశెట్టి మహేష్,బండి సంజీవ్, వనమాల ప్రవీణ్,యాద క్రాంతి,సకినాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.