టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కేటీఆర్,జగదీష్ రెడ్డి, రవిచంద్ర, బొంతు రాంమోహన్

రామంతాపూర్ కు చెందిన జగదీష్ ఇటీవల పుట్టపాకలో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే

 

జగదీష్ సతీమణి పద్మజకు 18లక్షలు అందజేసిన రవిచంద్ర, రాంమోహన్

జగదీష్ పెద్ద కుమారుడు సచిన్ కు అమెరికా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసిన రవిచంద్ర

చిన్న కుమారుడు తరుణ్ కు ఉద్యోగం ఇప్పిస్తానని కేటీఆర్ భరోసా

హైదరాబాద్: ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీష్ కుమార్ కుటుంబానికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ లు కొండంత అండగా నిలిచారు.మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన నారాయణ పురం మండలం పుట్టపాకలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలై తుదిశ్వాస విడిచారు.విషయం తెలిసిన వెంటనే రవిచంద్ర హైదరాబాద్ హస్తినాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి,కుటుంబాన్ని ఓదార్చిన విషయం తెలిసిందే.జగదీష్ అంత్యక్రియల ఖర్చులతో పాటు పెద్ద కుమారుడు సచిన్ అమెరికా నుంచి వచ్చి వెళ్లడానికి వద్దిరాజు విమాన టిక్కెట్లు సొంతంగా ఏర్పాటు చేశారు.అలాగే, సోమవారం రవిచంద్రతో పాటు రాంమోహన్ రామంతాపురంలోని నివాసానికి వెళ్లి జగదీష్ సతీమణి పద్మజ, కుమారులు సచిత్,తరుణ్ లను పరామర్శించి రూ.18 లక్షలు అందజేశారు.తరుణ్ కు త్వరలో ఉద్యోగం ఇప్పిస్తానన్న కేటీఆర్ భరోసా గురించి బొంతు రాంమోహన్ వారికి తెలిపారు.ఈ సందర్భంగా జగదీష్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,కాలనీ ప్రముఖులు కూడా ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version