ఘనంగ మహనీయుల జయంతి వేడుకలు

గోదావరి ఖని,నేటిధాత్రి: గోదావరిఖని లక్ష్మీనగర్ లోని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో ఆదివాసుల హక్కుల కోసం అలాగే నిజాం నిరంకుశ పాలనను ప్రశ్నించిన గోండు బెబ్బులీ కొమరం భీము మరియు నిజాయితి కి మారు పేరు అయిన మాజి ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ జయంతి పార్టీ కార్యాలయంలో ఘనంగ నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జె వీ రాజు మాట్లాడుతూ ఎస్.ఆర్.శంకరన్ సేవలను కొనియాడుతూ ప్రభుత్వ ఫలాలు ,సేవలు ప్రతి ప్రజకు అందేలా మరియు ఎలాంటి ఆర్బాటలకు పోకుండా నిడారంబరతతో ప్రజల సమస్యల్ని తన సమస్యగా భావించి ప్రజలకి ఎప్పుడు ఏమి కావాలో అప్పటికప్పుడు రూపకల్పన చేసి ప్రజల్లో ఒక మంచి అధికారిగా పేరుపొందిన వారి జయంతి ఘనంగా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం అని అన్నారు.
అలాగే గోండు వీరుడైన కొమరం భీమ్ గారు అలనాటి నిజాం నిరంకుశపాలను వ్యతిరేకిస్తూ ఆదివాసుల హక్కుల కోసం తను చేసిన ఉద్యమాలను కొనియాడుతూ వారిని కీర్తిస్తూ వారికి నివాళులర్పిస్తూ వారి జయంతిని కూడా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించామని వేముల అశోక్ తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగమ తిరుపతి వేముల అశోక్ మహిళా నాయకురాలు గంట భబిత సోని, పోగుల శేకర్ అఫ్రాజ్ కార్పొరేషన్ ఇంచార్జ్ ముఖేష్. సదన్ కుమార్ యాదవ్ వీరందరు కూడా పాల్గొని మహనీయుల జయంతి సందర్భంగా వారి ని ఆదర్శంగా తీసుకోవాలి అని పిలువును ఇచ్చి వారి సేవలను కొనియాడారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version