గ్రానైట్ సమస్యలకు త్వరలో పరిష్కారం 

గ్రానైట్ సమస్యలకు త్వరలో పరిష్కారం 

మంత్రి పువ్వాడ అజయ్ 

ఖమ్మం, ఆగస్ట్, 6:

గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు తొందరలోనే పరిష్కార మార్గం లభిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక హరితా గార్డెన్స్ లో ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి అజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఒక దఫా మంత్రి కేటీఆర్ చొరవతో పలు గ్రానైట్ సమస్యలకు పరిష్కారం లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రానైట్ లీజుల విషయం లో సుమారు 200 మంది చిన్న పారిశ్రామిక వేత్త లు ఇబ్బందులు పడుతున్న విషయం.. సీ ఫామ్ అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయన్నారు. కరోనా వల్ల కలిగిన ఆర్థిక ఒడిదిడుకులు మూలంగా సబ్సిడీలు కొంత ఆసఆలస్యం అయ్యాయని వీటిని కూడా తొందరలోనే అందుకుంటామని చెప్పారు. 

నూతనంగా ఎన్నికైన గ్రానైట్ అసోసియేషన్ పాలక వర్గానికి మంత్రి అజయ్ శుభాకాంక్షలు తెలిపారు.

 రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమ తన కుటుంబమని… కుటుంబంలో ఎవరికీ కష్టం రాకుండా కాపాడుకుంటా న్ని అన్నారు. సి ఫామ్, సబ్సిడీ, లీజుల అంశాలు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ గారి నేతృత్వంలో సీఎం గారిని కలిసి వాటిని పరిష్కారించుకుంటామని అన్నారు.

 ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఏకైక ఉపాధి వనరుగా ఉన్న గ్రానైట్ పరిశ్రమను కాపాడుకోవడంలో ముందుంటానని అన్నారు. గ్రానైట్ హబ్ గా ఉన్న ఖమ్మంలో ఎస్ఈజెడ్ల తరహాలో అభివృద్ధి చేయాలని కోరారు.

 ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. 

ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న గ్రానైట్ పరిశ్రమకు ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటామన్నారు.  

 ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీతో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపుడి రామారావు ప్రమాణం చేయించారు. కొత్త కార్యవర్గానికి మంత్రి, ఇతర అతిధులు నియామక పత్రాలు అందజేసి, సన్మానించారు. 

సభలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సీపీఐ ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు, నాయకులు పారా నాగేశ్వరరావు, తమ్మినేని వెంకట్రావు, చక్రధర్ రెడ్డి, పాటిబండ్ల యుగంధర్, ఫణి కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ఉప్పల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీనివాస రెడ్డి, కోశాధికారి దొడ్డా రాకేష్, ఉపాధ్యక్షులు ఎస్. కె. ఖాసిం, కె. వీరభద్రరావు తదితరులు మాట్లాడారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version