గవర్నర్ పై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్

గవర్నర్ తన పరిధిని ధాటి వ్యవహరిస్తున్నారు

సీఎం కేసీఆర్ కు మహిళల పట్ల గౌరవం ఎక్కువ

శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, నేటిధాత్రి :

 

గతంలో ఎంతో మంది గవర్నర్లు రాష్ట్రంలో పనిచేశారు వారితో రాని ఇబ్బంది ప్రస్తుత గవర్నర్ తమిళ సై తో ఎందుకు వస్తుంది. ఆమెకు గవర్నర్ పదవీ ఎలా అర్హత ఉంది అంటూ రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఫెయిర్

అయ్యారు.హైదరాబాద్ డిఎస్ఎస్ భవన్ లో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు దూరం ఎక్కడ పెరగలేదని అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ ఎప్పుడు రావాలి అన్నది ఆయన ఇష్టంమేదే ఆధారపడి ఉంటుందన్నారు.రాష్ట్రంలో భారీ వర్షాలకు వరదలు వస్టే ఆడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని వరద ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లారు అక్కడ మీకేం పని అని గవర్నర్ పై సెటైర్స్ వేశారు.రాష్ట్రంలో 

 కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ వివరిస్తున్నట్లు కనిపిస్తోందని,గవర్నర్ గా ఉంటారో పార్టీ నేతగా వ్యవహరిస్తారో తేల్చుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు.గతంలో బీజేపీ అధ్యక్షురాలుగా పోటీ చేసి ఓడిపోయిన తమిళ సై ఇంకా అధ్యక్షారాలుగానే వ్యవహరిస్తోందని ఆరోపించారు.తెలంగాణ చరిత్ర తెలియని గవర్నర్ భాజపా నాయకుల మాటలతో తెలంగాణ విమోచన దినోత్సవం అని మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో లేని సమస్యలను ఉన్నట్టు చూపడం సమంజసం కాదని ,గవర్నర్ తన వైఖరి ఇప్పటికైనా మార్చుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య,గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు,ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్,డిసిసి చైర్మన్ రమావత్ వాల్యనాయక్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version