ఏఐటీయూసీ పోరాట ఫలితమే ఏరియర్స్

సింగరేణిలో రాజకీయ జోక్యంతో నష్టం

సింగరేణి ఎన్నికలను ఆపే కుట్ర చేస్తున్న టీబీజీకేఎస్

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కార్మికులకు ఒకేసారి ఏరియర్స్ చెల్లించాలని కోరుతూ ఆగస్టు 14న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ పోరాటాల వల్లనే ఏరియర్స్ సాధించుకున్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. కోల్ ఇండియాలో ఒకేసారి ఏరియర్స్ చెల్లించాలని కోల్ ఇండియా ప్రకటన చేసిన కానీ సింగరేణిలో కనీసానికి ఏరియర్స్ తేదీ కూడా ప్రకటించకుండా సింగరేణి యాజమాన్యం స్పందించకపోవడంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని జిఎం కార్యాలయాల ముందు నిరాహార దీక్షలు చేయడం జరిగిందని దాంతో ప్రభుత్వం యాజమాన్యం దిగివచ్చి ఈనెల 21న ఏరియర్స్ చెల్లించడానికి ఒప్పుకుందని తెలిపారు. అట్లాగే ఏరియర్స్ సాధించడానికి టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ట్రేడ్ యూనియన్ గా సాధించింది ఏమీలేదని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఈనెల 11న ఆర్ ఎల్ సి లో జరిగిన ఒప్పందం ప్రకారం అక్టోబర్ 22న ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు నిర్వహించడం వల్లనే సింగరేణి ఆర్థిక రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. జనరల్ ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం, టీబీజీకేఎస్ సంఘం లోపాయిక ఒప్పందంతో ఎన్నికలు జరగకుండా కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా వెంటనే సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాతాంగి రామచందర్, కృష్ణమూర్తి, మల్లికార్జున్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version