ఎమ్మెస్ ఎంఆర్పిఎస్ రాస్తారోకో

రిజర్వేషన్ల దోపిడీదారులకు కొమ్ముకాస్తున్న బీజేపి.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకురాకపోతే కేంద్రం మీద యుద్దమే.

మాదిగలను నమ్మించి మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ఆటలు సాగవు .

మాదిగల ఓట్లు బి ఆర్ ఎస్ నాయకులు అడుగద్దు.

స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి

మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద
మంగళవారం నుండి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పెట్టాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి నియోజకవర్గ చౌరస్తాలో – ఎంఎస్పి జనగామ జిల్లా ఇన్చార్జి మడిపల్లి శ్యామ్ మాదిగ ఎం ఎస్ స్పి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా పోలీసుల అరెస్టు

ఈ ధర్నాలో పాల్గొన్న ఎంఎస్పి జనగామ జిల్లా ఇన్చార్జ్ మడిపల్లి శ్యామ్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్ ద్వారా చట్టబద్దత కల్పించే పక్రియను జాప్యం చేయడం ద్వారా రిజర్వేషన్లను గత డెబ్బై ఐదు ఏండ్లుగా ఏక పక్షంగా దోచుకుంటున్న దోపిడీదారులకు బిజెపి కొమ్ముకాస్తుందని ద్వజమెత్తారు.
ముప్ఫై ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన బిజేపీ ప్రస్తుతం సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారంలో ఉండి కుడా ఎందుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని,
రెండు నెలల క్రితం ప్రధానమంత్రి వరంగల్ లో స్వయంగా హామీ ఇచ్చిన నేటికీ కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని అన్నారు.
ప్రధానమంత్రి ఇచ్చిన మాటకే విలువలేకపోతే ఈ దేశాన్ని పాలించే నైతిక అర్హత బీజేపీకి లేదని అన్నారు.
అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్న అమిత్ షా ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడకుండా వెళ్లిపోవడం మాదిగల హృదయాను తీవ్రంగా గాయపరిచిందని అన్నారు.
ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేయడం జరిగితే బిజేపీ మీద మాదిగలు రాజకీయ తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.

సి డబ్ల్యూ సి లో ఎస్సీ వర్గీకరణ మీద తీర్మానం చేయకుండా కాంగ్రెస్ మరొకసారి మాదిగల పట్ల వ్యతిరేకతను చాటుకుందని అన్నారు.
కేవలం మాదిగల ఓట్ల కోసం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చేర్చరే తప్ప కాంగ్రెస్ నిజమైన చిత్తశుద్ది లేదని అన్నారు.
మాదిగల ఓట్ల కోసం చేసే కపట రాజకీయాలు ఇకపై సాగవు అని అన్నారు.
పార్లమెంట్లో మహిళ, బిసి రిజర్వేషన్ బిల్లుల మీద మాట్లాడాలని ఎంపీల చేత మాట్లాడిస్తున్న కేసీఆర్ ఎస్సీ వర్గీకరణను విస్మరించి మాదిగలకు ద్రోహం చేశాడని అన్నారు.

మాదిగలకు ద్రోహం చేసిన బిఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం తమ ఇళ్ళలకు రావద్దని హెచ్చరించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం 20 న డిల్లీలో మహాధర్నా జరుగుతుందని రేపటి నుండి 22 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఘనపూర్ మండల ఇంచార్జ్ గాదె శ్రీధర్ మాదిగ, జిల్లా ఇంచార్జ్ మడిపల్లి శ్యామ్ మాదిగ,జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పైసా రాజశేఖర్ మాదిగ, ఉప అధ్యక్షులు గుర్రం అశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల మహేష్ మాదిగ,లింగాల ఘనపూర్ మండల ఇంచార్జ్ రవీందర్ మాదిగ, జెరిపోతుల సుధాకర్ మాదిగ,నలిమెల నాగరాజు మాదిగ, చాడ ఏలీయా మాదిగ,గోవిందు ఇసాక్ మాదిగ,గుర్రం నవీన్ మాదిగ, గాదె రాంచందర్ మాదిగ, కె కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version