ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం గర్వకారణం

ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కోడిమేత సరస్వతి

సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కామర గట్టయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ( బాతాల రాజు) భవన్ లో ప్రపంచ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అనంతరం కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది అనంతరం ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కుడిమేత సరస్వతి. సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కామర గట్టయ్య. మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో నివసిస్తున్న ఆదివాసి తెగలపై ఐక్యరాజ్యసమితి దశాబ్ద కాలం పాటు సమగ్రంగా అధ్యయనం చేసి ఆదివాసుల సమస్యలు ఏ దేశంలో చూసినా ఒకే విధంగా ఉన్నాయి అని ఇతర సామాజిక వర్గాలతో పోల్చి చూస్తే ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు జీవన విధానం భిన్నంగా ఉందని ఆదివాసులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాది రంగాలలో వెనుకబడి ఉన్నారని వీరు అభివృద్ధి చెందాలంటే ఆదివాసులకు అంటూ ఒక గుర్తింపు వేదిక అనేది ముందు తరాలకు అవసరమని భావించిన ఐక్యరాజ్యసమితి ఒక దృఢ సంకల్పంతో మొదలుపెట్టిన కార్యక్రమమే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం అని వారు అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రతిఏటా ఆగస్టు 9న జరుపుకోవాలని పిలుపునిచ్చిందని అన్నారు అదేవిధంగా 1994 నుండి 2014 వరకు రెండు దశాబ్దాల కాలాన్ని ఆదివాసి అభివృద్ధికి కృషి చేయాలని ప్రకటించిందని అన్నారు, ఈ కాలంలో అన్ని దేశాలు పరస్పర సహకారంతో మానవ హక్కులు పర్యావరణం విద్య ఆరోగ్యం సంస్కృతి సంప్రదాయాలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయ రంగాలలో ప్రగతి సాధించటనికి కృషి చేయాలని పాలక ప్రభుత్వాలకు సూచించడం జరిగిందని అన్నారు, కానీ ఇప్పటికి మూడు దశాబ్దాలు గడుస్తున్నా కనీసం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వాలు అధికారికంగా జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, కనీసం ఆదివాసి ఉద్యోగులకు వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులకు,మరియు విద్యార్థులకు సెలవు దినమైన ప్రకటించకపోవడం ఆదివాసులను అణిచివేయడానికి నిదర్శనమని వారు మండిపడ్డారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి అది ఈశాన్య రాష్ట్రంలో కానీ మధ్య భారతంలో గాని ఆదివాసి హక్కులను కాలరాస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తుందని వారు రగిలిపోయారు. ఈశాన్య రాష్ట్రాలలో ఆరో షెడ్యూల్ షెడ్యూల్డ్ ఉన్నప్పటికీ వారి హక్కులను నిర్వీర్యం చేసే విధంగా తెగల మధ్యల మతాల పేరుతోటి గొడవ పెట్టించి, అక్కడికి వలసలు వచ్చి స్థిర పడినటువంటి కులాలను ఎగదోసి దాడిని కొనసాగిస్తుందని తద్వార ఆ ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజ సంపద సహజ వనరులను మైనింగ్ చేసుకునే విధంగా స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా దోచిపెట్టడానికి పూనుకుందని వారన్నారు, ఉదాహరణకు మణిపూర్ రాష్ట్రంలో కుక్కినాగలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు మారణ హోమమే నిలువెత్తు నిదర్శనం అని వారు అన్నారు. ఇలాంటి ఘటనలకు పూరికొల్పుతున్న వారే విచిత్రంగా దేశం కోసం హిందూధర్మం కోసం అంటూ, జైశ్రీరామ్ అంటూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూన్న వారే ఆడ తల్లులను బహిరంగంగా బట్టలూడదీసి ఊరేగిస్తూ, వారి శరీరాలపై దాడి చేయడం సిగ్గుచేటని వారన్నారు, దీనంతటి కారణం ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలే అని ప్రజలు గమనిస్తున్నారని, ఆ రకమైన చైతన్యం ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి అందిస్తుందని వారన్నారు అదేవిధంగా అటవీ చట్టాలను సవరిస్తూ జాతీయ నూతన అటవీ పరిరక్షణ చట్టాలంటూ తీసుకు రావడం ఆదివాసి హక్కులను కాలరాయడానికి తప్ప, పెట్టుబడిదారులకు బహుళ జాతి కంపెనీల నుంచి రక్షించడానికి కాదని వారన్నారు, వెయ్యి హెక్టార్ల వరకు ఎలాంటి నిబంధనలు లేకుండా మైనింగ్లకైనా లేదా వేరేఅవసరాల కైనా పర్మిషన్ ఇవ్వచ్చు అని అవకాశం కల్పించడం అంటే ఇది ఎలా పరిరక్షణ చట్టం అయితదని వారు విమర్శించారు. కాబట్టి దీనిని వెంటనే ఉపసంహరించాలని ఆమె అన్నారు, అదేవిధంగా ఇది అటవీ హక్కుల గుర్తింపు చట్టానికి తూట్లు పొడుస్తుందని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలు కొంతమేరకు ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో చట్టాన్ని అమలు చేయలేదని ఆ చట్టంలో కల్పించిన అనేక హక్కులను గుర్తించడం లేదని ఆదివాసి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆటవిహక్కుల చట్టాన్ని అమలు చేయాలన్నారు. అదేవిధంగా ఐదవ షెడ్యూల్ ఏరియాలో జీవో నెంబర్ 3 గానీ, 1/70 గాని, పీసా చట్టంగానే అమలు కావడం లేదని పకడ్బందీగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో గిరిజన అభివృద్ధి సంస్థలు (ఐటీడీఏ)లు లేక ఆదివాసులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని వారన్నారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న మాడను ఎత్తివేసారన్నారు, కనీస ఈ జిల్లాలో డీటీడీవో ఆఫీసు కూడా లేకపోవడం అత్యంత బాధాకరమని వారన్నారు, వెంటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డిటిడిఓ ఆఫీసును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా ఎస్టీ జాబితాలో నాయకపోడు తెగకు ప్రత్యేక గుర్తింపు లేదని, ఉప తెగగ వుండడం వలన కులం సర్టిఫికెట్ ఇవ్వడానికి తాసిల్దారులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారన్నారు, కాబట్టి నాయక పూర్తిగా కు ఎస్టీ జాబితాలో ప్రత్యేక గెజిట్ నెంబరు పొందు పర్చాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలకు పూనుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్ మాలభేరి రాష్ట్ర అధ్యక్షుడు ఇక కిరణ్ యుఐఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ నెంబర్ దుబాసి పార్వతి ప్రజా సంఘాల నాయకులు వావిళ్ళ రమేష్ బోధ రమ పోలేంటి ఐలయ్య ఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version