అంతరాష్ట్ర సైబర్ నిందితుల ఆరెస్ట్

సోషల్ మీడియా వేదికగా సైబర్ మోసాలు

07 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ స్వాధీనం

డిఎస్పీ నాగేంద్ర చారి

వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర సైబర్ నిందితులు రాంరేష్ కుమార్, లోకేష్ కుమార్ లను
రాజస్థాన్ రాష్ట్రంలో పట్టుకున్నట్లు వేములవాడ డీఎస్పి నాగేంద్ర చారి పేర్కొన్నారు.
ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి జిల్లాకు చెందిన రాంరేష్ కుమార్ అనే వ్యక్తి బీఏ కంప్యూటర్స్ వరకు చదువుకొని, ఆన్లైన్ ద్వారా అమాయక ప్రజలను ఏ విధంగా మోసం చేసి డబ్బులు సంపాదించలో నేర్చుకున్నాడని పేర్కొన్నారు. .అలా మోసం చేసిన వచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకొని, తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో చాలా మందికి ఆన్లైన్ మోసల గురించి నేర్పించదన్నారు. వారు మోసం చేసి సంపాదించిన డబ్బులలో రాంరేష్ కు కొంత ఇచ్చేవారని పేర్కొన్నారు. కాగా అదే గ్రామానికి చెందిన లోకేశ్ కుమార్ మీనా అనే వ్యక్తికి ఆన్లైన్ (టెలిగ్రాం) లో మోసం చేసి డబ్బులు సంపాదించలో నేర్పించడం జరిగిందిని, లోకేశ్ కుమార్ మీనా టెలిగ్రాం ద్వారా బీట్ కాయిన్ లో డబ్బులు పెడితే అవి రెట్టింపు అవుతాయని చాలా మందికి పంపగా, అనుకున్న విధంగానే చాలా మంది నుండి డబ్బులు వచ్చేవి అన్నారు. ఈ క్రమంలో
వేములవాడ పట్టణం బాలానగర్ చెందిన మిశ్రా సచిన్ అనే వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి ఇంస్టాగ్రామ్, తెలిగ్రామ్ లో ద్వారా బీట్ కాయిన్ లో డబ్బులు పెడితే అవి రెట్టింపు అవుతాయని 6376012977 ,9391264084 ద్వారా మెసేజ్ పంపి, మిశ్రాని నమ్మించారన్నారు. మిశ్రా అట్టి విషయాన్ని నమ్మి 1,00,183 రూపాయలను భారత్ పే ద్వారా పంపడం జరిగిందని, దీంతో డబ్బులు రెట్టింపు కాకపోగా, అతని డబ్బులు తిరిగి రాలేవన్నారు. వెంటనే మిశ్రా సైబర్ నిందుతుల చేతిలో మోసపోయినని గ్రహించి, సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేసి, వేములవాడ పోలీస్ స్టేషన్ ధరఖాస్తు ఇవ్వగా, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో బాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆర్ఐ ఎస్ జునైద్ ఆధ్వర్యంలో టీమ్ ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతికత ఆధారంగా నిందుతులు రాజస్తాన్ రాష్టం, సవై మదోపుర్ జిల్లా రామిడి గ్రామాకి చెందిన వారిగా గుర్తించి, సైబర్ ఆర్ ఎస్ఐ జునైద్ ఆధ్వర్యంలో రాజస్తాన్ వెళ్ళి, సవై గ్రామంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అందులో ఒక వ్యక్తి మైనర్ అయినందున అక్కడే కోర్ట్ నందు హాజరు పర్చడం జరిగిందన్నారు. మరొక నిందితుడు అయిన రాంరెస్ కుమార్ వేములవాడ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి, విచారణ చేసి, వారి నుండి 7-మొబైల్ ఫోన్ లు, 2 సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీ ఎస్పీ సూచించారు. లోన్ అప్, లాటరి,పార్ట్ టైమ్ జాబ్, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పింక్ వాట్సాప్ పేరుతో సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకుండా అప్రమత్తంగా ఉందాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఎన్సీఆర్పీ పోర్టల్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1930కు తక్షణమే కాల్ చేసి ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారన్నారు.
ఈ సమావేశంలో వేములవాడ టౌన్ సిఐ కరుణాకర్, ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ గోపాల్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version