shwetharkamula ganapathini darshinchukunna corporator swapnasridhar, శ్వేతార్కమూల గణపతిని దర్శించుకున్న కార్పొరేటర్‌ స్వప్నశ్రీధర్‌

శ్వేతార్కమూల గణపతిని దర్శించుకున్న కార్పొరేటర్‌ స్వప్నశ్రీధర్‌

కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతిస్వామిని 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్నశ్రీధర్‌ శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో ఈనెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న 21వ వసంతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలలో చివరిరోజు శుక్రవారం 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్నశ్రీధర్‌ కుటుంబసభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు అనంతమల్లయ్యశర్మ స్వాగతం పలికి ప్రత్యేకపూజలు చేసి ఆశీర్వాదించారు. అనంతరం ఆలయ అర్చకులు రాధాకృష్ణశర్మ కార్పొరేటర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ శ్రీశ్వేతార్కమూల గణపతిస్వామి అందరి కోరికలు తీర్చే దేవుడని, ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు రావడం గొప్ప విషయమని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు క్షేమంగా ఉండాలని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version