karyakarthalaku andaga vunta, కార్యకర్తలకు అండగా ఉంటా

కార్యకర్తలకు అండగా ఉంటా

పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. శుక్రవారం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకురాలు మాడిశెట్టి కవితకు ఆర్థిక సహాయం అందజేశారు. 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి ద్వారా కవితకు 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే ఆర్థికంగా ఆదుకోవడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారుల సంఘం కన్వీనర్‌ మరుపల్ల రవి, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నిమ్మల సదానందంయాదవ్‌, శెంకేశి కుమారస్వామి, బక్కి రమాదేవి, మరుపల్ల గీత తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version