ennikala nirvahanapia avagahana kaligi undali, ఎన్నికల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి

ఎన్నికల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి

స్థానిక ఎన్నికల నిర్వహణ పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మండల ఎన్నికల అధికారిణి, దుగ్గొండి ఎంపిడివో గుంటి పల్లవి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో 187 మంది పిఓ, ఏపిఓలకు ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. ఓటర్లు ఓటు వేసే విధానం పట్ల, ఓటు వేశాక బ్యాలెట్‌ పత్రం మడత చేసే విధానంతోపాటు పలు అంశాలను పూర్తిస్థాయిలో అధికారులతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాసరావు, ఈవోపీఆర్‌డి ఖాజామైనోద్దిన్‌లతోపాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *