carlu dee, కార్లు ఢీ

కార్లు ఢీ

– ఒకరు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జనగామ బైపాస్‌ రోడ్డుపై (ఇందిరమ్మ కాలనీ వద్ద) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మతిచెందారు. జనగామ సీఐ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్రమబద్దీకరిస్తూ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌ ఏఓ రాజేందర్‌, స్టేషన్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌లతో చర్చించారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను 15రోజులలో పరిష్కరించడానికి కషి చేస్తామని అన్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్‌లో ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, తద్వారా సంబంధిత రైల్వేశాఖ మంత్రి దష్టికి తీసుకొనివెళ్లి వాటి పరిష్కారానికి కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిర్మల, చాంద్‌పాషా, భగవాన్‌, గడప శివ, జీవన్‌, జాఫర్‌, అలీం, రైల్వే నాయకులు మోతిలాల్‌, బిఎంఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

lekinpu kendralanu parishilinchina collector, లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నర్సంపేట డివిజన్‌లోని అన్ని మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత పరిశీలించారు. లెక్కింపు కేంద్రాలలో లెక్కింపు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. తొలుతగా ఎంపిటిసి, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టి సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

జనరల్‌ ఎన్నికల అబ్జర్వర్‌ పరిశీలన ….

జనరల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్‌ బి.శ్రీనివాస్‌ జడ్పీటిసి ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంలో లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. లెక్కింపు జరిగే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

greaterlo dongala gang, గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌

గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌

గ్రేటర్‌ నగరంలో దొంగల గ్యాంగ్‌ భయపెడుతోంది. 8మంది సభ్యులున్న ఈ గ్యాంగ్‌ తాళం వేసి ఉన్న, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం కాజీపేట చైతన్యపురి ప్రాంతంలో అర్థరాత్రి ఓ ఇంటి కిటికి ఊచలు కట్‌ చేస్తుండగా అప్రమత్తమైన ఇంటి యజమానులు గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న ఈలోపే దొంగల గ్యాంగ్‌ పారిపోయింది. అయితే చైతన్యపురి ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పుటేజీ సంపాదించారు. ఈ పుటేజీ ఆధారంగా దొంగల వివరాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. సీసీ టివి పుటేజి ఆధారంగా కూపి లాగుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌

కాజీపేట పట్టణంలో దొంగల ముఠా తిరుగుతున్నట్లు ప్రజలు కాలనీలల్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలల్లో దొంగల ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుండటంతో ప్రజలు బయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కాజీపేట చైతన్యపురి కాలనీలో ఈ దొంగల ముఠా ఓ ఇంటలో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా యజమాని అప్రమత్తమై వారిని ఎవరు అని ప్రశ్నించేలోపే వారు అక్కడి నుండి పరారయినట్లు పోలీసులు తెలిపారు. 100 డయల్‌ చేయడంతో కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ తన సిబ్బందితో వెళ్లి గాలించగా అప్పటికే దొంగలు పరారు అయ్చారని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’ ప్రతినిధితో సీఐ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కాజీపేట పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే 100 డయల్‌ చేసి సమాచారమివ్వాలని అన్నారు. చైతన్యపురిలో దొంగతనానికి ప్రయత్నించిన దొంగలముఠా కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

dieo officelo padakagada…siggu…siggu, డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు

డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో కొందరు రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిగా మార్చుకొని ఉంటున్న విషయాన్ని ‘నేటిధాత్రి’ ప్రభుత్వకార్యాలయమా..? పడకగదా..? అనే శీర్శికతో పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిలా మార్చుకొని ఉంటుండడాన్ని ప్రజలు, ఉద్యోగ సంఘాల నేతలు, విధ్యార్థి నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బాధ్యతగా, హుందాగా వ్వవహరించాల్సిన డిఐఈవో ఈ విదంగా కార్యాలయానికి చెడ్డ పేరు తేవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కార్యాలయానికి వెళ్లాలంటేనే సిగ్గుగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికి కార్యాలయంలో ఉంటున్నది ఎవరనేది అంతుచిక్కడంలేదని ఇంతలా దిగజారి కార్యాలయానికి తలవంపు తెస్తారని అనుకోలేదని ఉద్యోగులు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.

తలవంపులు తెస్తున్నా డిఐఈవోపై చర్యలు శూన్యం

విలువలను, హూందాతనాన్ని, ఉద్యోగుల నైతికతను, బాధ్యతను, గౌరవాన్ని, వృత్తిధర్మాన్ని మంటగలుపుతూ డిఐఈవో కార్యాలయ పరువును బజారుకీడుస్తున్న డిఐఈవో ఒంటెద్దుపోకడతో ఉగ్యోగలమంతా తలదించుకున్నంత పని అయిందని, కార్యాలయానికి వెళ్లాలంటేనే చాలా సిగ్గుగా ఉందని కొందరు ఉద్యోగులు అంటున్నారు. ఓ వైపు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ, మరో వైపు నీతిమాలిన పనులు ఏకంగా కార్యాలయాన్నే అడ్డగా మార్చుకొని వ్యవహరిస్తున్నారా..? అనే కోణంలో ‘నేటిధాత్రి’లో కథనాలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిఐఈవోకు ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లనే ఆయన వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

మండిపడుతున్న విద్యార్థి, ఉపాద్యాయ సంఘాలు

ప్రభుత్వ కార్యాలయమా…? పడక గదా..? అనే కథనం బయటికి రావడంతో జిల్లా వ్యాప్తంగా డిఐఈవో కార్యాలయం గురించి, లీలలపై, అవినీతి, అక్రమాలపై ప్రతిఒక్కరు చర్చించుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగ, ఉపాద్యాయ, లెక్చరర్ల సంఘాల నేతలు డిఐఈవోపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొన్ని ఉపాద్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయంపై కలెక్టర్‌కు, ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌కు కలిసి వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

గ్రేటర్‌ వరంగల్‌ నగరంతో సహా వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా కొనసాగుతుంది. సమస్య ఏదైనా అందులో తలదూర్చి సెటిల్‌మెంట్‌ చేస్తామని చెప్పడం ఈ గ్యాంగ్‌ల ప్రత్యేకత. సమస్య ఏదిలేకున్న వీరే తమ సొంత తెలివితేటలతో సమస్యలను సృష్టించి ఆ సెటిల్‌మెంట్‌ వీరివల్లే అయ్యేవిధంగా చేసి పరిష్కారం చేస్తామని చెప్పి డబ్బులు దండుకోవడం వీరు అలవాటు చేసుకున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీరి బాధితులు అధికసంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది సమస్య పరిష్కారం కోసం పోయి ఉన్న ఆస్తిని పొగుట్టుకున్న ఉదందాలు సైతం ఉన్నాయని తెలిసింది.

గొడవ ఏదైనా సరే

గొడవ ఏదైనా సరే అందులో కలగజేసుకోవడం సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు అలవాటు చేసుకున్నాయి. పోలీస్‌స్టేషన్‌ సమస్యలు, భూవివాదాలు, కుటుంబ గొడవలు తదితర విషయాల్లో ఈ సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు. కలగజేసుకుని పరిష్కారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుని బాదితులను ఇబ్బందులకు గురిచేస్తుంటారట. సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు ప్రధానంగా భూవివాదాల్లో కలగజేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాయట. భూమిలో సగం తమకు అప్పగిస్తే లేదంటే మార్కెట్‌ రేటు ప్రకారం తమకు కమీషన్‌ చెల్లిస్తే సమస్య పరిష్కారం చేస్తామని నమ్మబలికి అందినకాడికి అందుకుపోవడం ఈ గ్యాంగ్‌లు చేస్తుంటాయట. కొన్ని సందర్భాల్లో భూవివాదాల్లో ఇరువర్గాలు వీక్‌ అని తెలిస్తే భూమిని తమ పేర చేసుకుని సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు అసలు హక్కుదారులకు చుక్కలు చూపిస్తారట.

పరిచయాల పేరుతో బురిడీ

సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల మరో ప్రత్యేకత ఏంటంటే పరిచయాలతో బురిడీ కొట్టించడం తమకు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఇతర గ్యాంగ్‌లు చాలా దగ్గర అని చెపుతూ సమస్యను తామే పరిష్కరిస్తామని చెప్పడం వీరికి వెన్నతో పెట్టిన విద్యేనట. నిజానికి ఇలాంటి గ్యాంగ్‌లకు కొంతమంది పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు అండగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరైన సమస్యలతో వీరి వద్దకు వస్తే ఫలానా గ్యాంగ్‌ దీన్ని సెటిల్‌ చేస్తుందని అక్కడకు వెళ్లండని సూచిస్తున్నట్లు తెలిసింది. సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు ఏది సెటిల్‌ చేసిన అది నిజమేనని కొంతమంది పోలీస్‌ అధికారులు నిర్థారిస్తూ ఆ సెటిల్‌మెంట్‌కు అదికార ముద్ర వేస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని కొన్ని పోలీస్‌స్టేషన్‌లలో సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారిందంటే చాలు సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోనే తచ్చాడుతూ ఉంటారట.

సంవత్సరాలపాటు సాగదీత

ఇరువర్గాలను తమ చేతిలో ఉంచుకుని సమస్యను పరిష్కారం ఏయకుండా సంవత్సరాలపాటు సాగదీయడం సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు బాగా అలవర్చుకున్నాయట. గ్యాంగ్‌ల సాగదీతకు జడుసుకున్న కొంతమంది ఇరువర్గాలు ఏకమై తమ సమస్యను తామే పరిష్కారం చేసుకున్న సందర్బాలు ఉన్నాయట. గ్యాంగ్‌ల సాగదీత పరిష్కారాల మూలంగా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయట. సమస్యను పరిష్కారం చేయాలంటే ఉదయం అల్పాహారంతో మొదలుకుని మందు, విందు వరకు అన్ని బాధితులే చూసుకోవాలట. ఈ ఖర్చు పెట్టలేక కొంతమంది బాదితులు అప్పులపాలైన సందర్బాలు ఉన్నాయి.

సెటిల్‌మెంట్లే ఉపాధి

ఇస్త్రీ పోల్డ్‌ నలగని చొక్క, చుట్టు మంది మార్బలం ఏర్పాటు చేసుకుని కాసింత బిల్డప్‌ కలగలుపుకుని సెటిల్‌మెంట్‌ గాండ్లు దర్శనమిస్తారట. సెటిల్‌మెంట్లనే ఉపాధిగా చేసుకుని బతుకుతున్న వీరు కేవలం వీటిపైన ఆధారపడి బాధితులను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు వెనకేసిన వారు ఉన్నారట. భూసమస్యల్లో తలదూర్చిన సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లైతే సమస్యను పరిష్కారం చేయకుండా ఎంతో కొంత నగదు ముట్టజెప్పి బాధితుల వద్ద నుంచి కారుచౌకగా భూములు దండుకున్నవారు ఉన్నారట. మొత్తానికి సెటిల్‌మెంట్‌ ఉపాధి చేసుకుని బాధితుల బలహీనతలు ఆసరా చేసుకుని జీవితాలను ఆగం చేసిన వారు ఉన్నారట.

jailashaka incharge igga b.saidaiah, జైళ్లశాఖ ఇంఛార్జి ఐజీగా బి.సైదయ్య

జైళ్లశాఖ ఇంఛార్జి ఐజీగా బి.సైదయ్య

తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ ఐజీ ఆకుల నర్సింహ మే 30న పదవి విరమణ పొందడంతో ఇంచార్జి ఐజీగా బి.సైదయ్యను నియమిస్తూ జైళ్లశాఖ డీజీ ఎం.వినయ్‌కుమార్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సైదయ్య ప్రస్తుతం హైదరాబాద్‌ రేంజ్‌ జైళ్ల శాఖ డిఐజిగా విధులు నిర్వహిస్తున్నారు. 2018లో రాష్ట్రపతి అవార్డు ఎంపిక అయిన ఇతనికి జైళ్ల శాఖలో మంచి గుర్తింపు ఉంది.

raitheraju ninadanne nijam chestunna modi, రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ

రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ

రైతే రాజు అనే నినాదాన్ని నరేంద్ర మోడీ నిజం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. నరేంద్ర మోడీ రెండోవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా రైతులకు భరోసా కల్పిస్తూ ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పధకం ద్వారా 5ఎకరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రతి రైతుకి కుడా వర్తించేలా నిర్ణయం తీసుకున్న సందర్బంగా బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు పుల్యాల రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయం వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతు నరేంద్ర మోడీ 5సంవత్సరాల స్వచ్చమైన పాలన అందించి మరోమారు ప్రజలమోదం పొంది భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి నిర్ణయంగా రైతులకు భరోసా కల్పిస్తూ గతంలోని ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకంలోని 5ఎకరాల స్లాబును తీసివేసి ప్రతి ఒక్క రైతుకు కుడా ఈ పథకం వర్తించేలా చేస్తూ రైతులకు బరోసా కల్పించారన్నారు. అదేవిధంగా 60సంవత్సరాలు నిండిన ప్రతి రైతు నెలకు 3వేల రూపాయిల పెన్షన్‌ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం కేవలం నరేంద్ర మోడీకే సాధ్యమైయిందని తెలిపారు. భారతదేశ చరిత్రలో రైతుల సంక్షేమం ఈ ప్రభుత్వం చేయని విధంగా దేశంలో 60శాతం ఉన్న రైతులకు భరోసా కల్పిస్తూ నరేంద్ర మోడీ ఇలాంటి పధకం ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గండ్రతి యాదగిరి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారేపల్లి రామచంద్రరెడ్డి, బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రధానకార్యదర్శులు కొలను సంతోష్‌రెడ్డి, సంగని జగదీశ్వర్‌, బీజేపీ వరంగల్‌ అర్బన్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు మండల సురేష్‌, పాశికంటి రాజేంద్రప్రసాద్‌, గంకిది శ్రీనివాస్‌రెడ్డి, గురజాల వీరన్న, కందగట్ల సత్యనారాయణ, సారంగపాణి, జన్ను ఆరోగ్యం, నానునాయక్‌, దామెర సదానందం, కేసోజు వెంకట్‌, కల్లూరి పవన్‌, గూడెం రవితేజ, రాజేష్‌ఖన్నా, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

pranadathaga maruthunna rajkumar, ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌

ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌

అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న, రక్తదానం చేయండి ఒక జీవితానికి ప్రాణదాతలు కండి అంటూ ఎందరో మహానుభావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందుకు అనుకుంగానే 20సార్లు రక్తదానం చేసి ప్రాణదాతలు నిలుస్తున్నాడు దుగ్గొండి మహిళా సమాఖ్యలో ఎపిఎంగా విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’తో రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం వరంగల్‌ డిఆర్‌డిఎ ఆధ్యర్యంలో వరంగల్‌ రోవర్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో 20సార్లు రక్తదానం చేసినట్లు పెద్దల స్ఫూర్తితో, ప్రజాసేవే ధ్యేయంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. విదేశాల్లో, దేశవ్యాప్తంగా పలు అభివద్ధి, యువజన కార్యక్రమాలలో పాల్గొంటున్న సందర్భంగా ప్రభుత్వం డాక్టరేట్‌ అందించిందని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు డీఆర్డీఏ పిడి సంపత్‌రావు, ఏపిడి పరమేష్‌, డ్వామా ఏపిడి పారిజాతంలు అభినందించి సంబంధిత ధవీకరణ పత్రాన్ని అందించాలని, మరిన్ని రక్తదాన శిబిరాల్లో పాల్గొననున్నట్లు ఏపీఎం రాజ్‌కుమార్‌ తెలిపారు.

telangana rashtra avatharana dinostava vedukalu, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హసన్‌పర్తి మండలంలోని వివిధ గ్రామాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డుసభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారుతెలంగాణగా అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపిటిసి, వార్డుసభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

vithanthuvula manobavalanu gouravinchali, వితంతువుల మనోభావాలను గౌరవించాలి

వితంతువుల మనోభావాలను గౌరవించాలి

వితంతువుల మనోభావాలను సమాజంలోని ప్రతి ఒక్కరు గౌరవించాలని జయగిరి గ్రామ సర్పంచ్‌ బొల్లవేణి రాణి అన్నారు. ఆదివారం మండలంలోని జయగిరి గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ది కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రాణి హాజరై మాట్లాడారు. గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని అన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్య నేడు అధికంగా ఉందని, దాని నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఈనెల 23వ తేదీన వితంతువుల దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఏలీమి రమేష్‌, పంచాయతీ కార్యదర్శి సురేష్‌, వార్డుసభ్యులు వెంకటేష్‌, రాజు, బాలవికాస ప్రతినిధులు బాబూరావు, రాజ్‌కుమార్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు పిట్టల రాజు, కుమారస్వామి, కమిటీ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.

vronu nirbandinchina gramastulu, విఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు

విఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు

జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామస్తులు విఆర్వోను నిర్భంధించారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంలో విఫలమయ్యాడని నిరసిస్తూ గ్రామ విఆర్వో ఆదినారాయణను గ్రామపంచాయతీ భవనంలో గ్రామస్తులు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ గ్రామస్తులతో మాట్లాడి అందరికీ పట్టా పాస్‌పుస్తకాలు ఇస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి విఆర్వోను వదిలిపెట్టారు.

rajastanlo policelapia dadi avastavam, రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం

రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం

వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : వరంగల్‌ జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన దొంగల ముఠాను పట్టుకునేందుకు వరంగల్‌ జిల్లా సీసీఎస్‌ పోలీసులు రాజస్థాన్‌కు వెళ్లడం జరిగిందని సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. దొంగల ముఠా కోసం గాలిస్తుండగా దొంగల ఆచూకి రాజస్థాన్‌లోని బిల్వాడా జిల్లా హెర్నియా గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారని తెలిపారు. అడ్డుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొందని, అయినా పట్టువదలకుండా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. ధైర్యసాహసాలతో ఎదురించి దొంగలను పట్టుకున్న పోలీసులను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. సామాజిక మాధ్యమాలలో పోలీసులను తీవ్రంగా గాయపరిచినట్లు, పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు.

mla gari muddula alludu, ఎమ్మెల్యే గారి ముద్దుల అల్లుడు

ఎమ్మెల్యే గారి ముద్దుల అల్లుడు

– వరంగల్‌ పశ్చిమలో ఆడింది ఆట…పాడింది పాట

– మామ కంటే ఎక్కువ అధికారాన్ని ఉపయోగించేది అల్లుడే

– ఒక్కసారి సర్పంచ్‌గా గెలిచి జనానికి చుక్కలు చూపించాడట…

– భూకబ్జాలు,పైసల వసూళ్ళలో ఇతగాడిదే ప్రధాన పాత్ర..?

– ఇద్దరు రియల్టర్ల మధ్య దూరి పంచాయితీ పరిష్కారం చేసే ప్రయత్నం

– అరవైలక్షలకు ఐదు ఇస్తాడని భాదితుడికి బెదిరింపులు

– పోలీసులు తాను చెప్పిందే వినాలని హుకుం, సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన

(సోమవారం సంచికలో…)

prabuthva karyalama…padaka gada…?,ప్రభుత్వ కార్యాలయమా…పడక గదా…?

ప్రభుత్వ కార్యాలయమా…పడక గదా…?

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌జిల్లా ప్రదాన కార్యాలయంలో పగలంతా సిబ్బంది తమ విధులు ముగించుకొని వెళ్లగానే, కార్యాలయంలోకి రాత్రివేళలో ఓ ఇద్దరు వస్తున్నారని వారు అక్కడే మకాం పెడుతున్నారని, ఆ ఇద్దరు ఎవరై ఉంటారు? వారు రాత్రి అవగానే ఎందుకు వస్తున్నారు..కార్యాలయంలో ఉన్న ఆ రెండు పరుపులు ఎవరివి అయ ఉంటాయ..ఆ రెండు పరుపులు వారిద్దరు పడుకోవడానికే తెచ్చుకొని ఆఫీస్‌లో పెట్టుకున్నారా? ఆఫీస్‌ను తమ వ్యక్తిగత అవసరాల కోసం ఏమైనా వాడుకుంటున్నారా? ఇంటర్మీడియట్‌ వ్వవస్థకు సంబందించిన చాలా ముఖ్యమైన సమాచారం ఉండే కార్యాలయంలో ఈ విదంగా పడుకోటమేంటనే సందేహాలు, ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి.

రాత్రివేళలో మకాం పెడుతున్నది ఎవరు

కార్యాలయంలోని సిబ్బంది పగలంతా పనులు ముగించుకొని వెళ్లిన తర్వాత రాత్రి అయితే చాలు ఓ ఇద్దరు కార్యాలయంలోనే పడుకుంటున్నారని చుట్టు ప్రక్కల వాళ్లు, అటు ఇటుగా వెళ్లేవాళ్లు చెబుతున్నారు. అందులో మకాం పెట్టింది ఎందుకోసం, అసలు అందులో రాత్రివేళలో పడుకుంటున్న ఆ ఇద్దరు పురుషులేనా? కాదా? ఇంకెవరైననా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాత్రి కార్యాలయంలో ఉద్యోగులుంటున్నారా, అధికారి ఉంటున్నాడా? ఎవరెవరు ఉంటున్నారు, ఎందుకుంటున్నారు, ఏ పని కోసం ఉంటున్నారు. ఏ ఉద్దేశ్యంతో ఉంటున్నారు ఇవన్ని కాలనీవాసులతో పాటు బాటసారులను వేదిస్తున్న ప్రశ్నలు.

డిఐఈవోకు పరుపులతో ఏం పని…?

కార్యాలయంలో ఉన్న ఆ రెండు పరుపులు ఎవరివి? ఎవరు కొన్నారు? ఎందుకు కొన్నారు? ఎందుకు కార్యాలయానికి తీసుకువచ్చారు? ఎందుకు కార్యాలయంలోనే ఉంచారు? ఆ రెండు పరుపులను వాడుతున్నదెవరు? ఇలా మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు కార్యాలయ సిబ్బందితో పాటు కార్యాలయానికి వచ్చిపోయే వారిని సైతం వేదిస్తున్న ప్రశ్నలు. ఒక వేళ డిఐఈవో మద్యాహ్నం విశ్రాంతి కొరకు తెచ్చుకున్నాడుకున్నా ఆయనకు ఒక్క పరుపు చాలు మరి రెండు పరుపులు ఎందుకు తెచ్చినట్లు? అర్ధం కాని పరిస్థితి. మద్యాహ్నం డిఐఈవో విశ్రాంతి తీసుకునే అవకాశమే ఉండదని తెలుస్తున్నది. అలాంటప్పుడు డిఐఈవోకు పరుపులతో ఏం పని? రాత్రివేళల్లో బస చేసేందుకు ఆ పరుపులు కార్యాలయంలో ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కార్యాలయ అధికారులు అధికారికంగా ఆ పరుపులు కార్యాలయంలో ఎందుకు ఉన్నాయో చెబుతే తప్పా ప్రజల అనుమానాలకు, ప్రశ్నలకు జవాబు దొరకని పరిస్థితి కనబడుతున్నది.

(సీసీ కెమెరాలు ఎందుకు బంద్‌ చేశారు…త్వరలో)

jayagirilo swachbharath, జయగిరిలో స్వచ్చభారత్‌

జయగిరిలో స్వచ్చభారత్‌

మండలంలోని జయగిరి గ్రామంలో బాలవికాస ఆదర్శ గ్రామ కమిటీల ఆద్వర్యంలో స్వచ్చ గ్రామం నిర్వహించామని బాలవికాస ప్రతినిధులు బాబురావు, రాజ్‌కుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దీంతో ఎలాంటి అంటువ్యాధులు దరి చెరవని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస కమిటీ అధ్యక్షుడు అయిల కొమురమ్మ, జ్యోతి, లలిత, అయిలయ్య, కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.

modaliana prapancha paryavarana dinostava ustavalu, మొదలైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలు

మొదలైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలు

ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రారంభం చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నుండి ఈనెల 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను ఉత్సవాలు వరంగల్‌ రూరల్‌ జిల్లా అటవీశాఖ, జన విజ్ఞాన వేదిక, వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, వన సేవా సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మొదటిరోజున హైదరాబాద్‌ బర్డింగ్‌ ఫాల్స్‌ సొసైటీ బాధ్యులు శ్రీరామ్‌రెడ్డి, గోపాలకష్ణ ఆధ్వర్యంలో పాకాల అభయారణ్యంలో సందర్శించి వివిధరకాల పక్షులను గుర్తించి అందులో నుండి ఇండియన్‌ పక్షిని ప్రత్యేక పక్షిగా గుర్తించామన్నారు. అలాగే 2వ తేదీన బర్డ్‌ ఫెస్టివల్‌, 3వ తేదీన నర్సంపేటలోని అటవీశాఖ కార్యాలయంలో ఉపన్యాస, పాటల పోటీలు, 4వ తేదీన ఆన్‌లైన్‌లో స్లోగన్స్‌, కార్టూన్లు, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున అటవీ నడక పాకాలలో ఉదయం 6గంటలకు, అలాగే అదేరోజు మొత్తం ప్రకతి శిబిరం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలను జనవిజ్ఞాన వేదిక, వనసేవా సొసైటీ, ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, అటవీశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమాలకు పర్యావరణ ప్రేమికులు హాజరై విజయవంతం చేయాలని అటవీశాఖ అధికారి పురుషోత్తం కోరారు. ఈ కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ బాధ్యులు శ్యాంసుందర్‌శర్మ, హైదరాబాద్‌ బర్డింగ్‌ ఫాల్స్‌ అధికారిణి అంజుల దేశాయ్‌, రేంజ్‌ అధికారి రమేష్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి ఇజాజ్‌ అహ్మద్‌, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, సుధాకర్‌లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

arthikame neramaothunda…?, ఆర్థికమే ‘నేర’మౌతుందా…?

ఆర్థికమే ‘నేర’మౌతుందా…?

ఆర్థిక సమస్యలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. అవసరానికి తీసుకున్న డబ్బులు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తే అవే ఆర్థిక అవసరాలు నేరానికి పురిగొల్పుతున్నాయి. అధికవడ్డీలతో చుక్కలు చూస్తూ అవి కట్టలేక కొందరు నేరగాళ్లుగా మారితే, ఇచ్చిన డబ్బులను అధిక వడ్డీతో సహా రాబట్టేందుకు కొందరు ప్రైవేట్‌ ఫైనాన్సర్స్‌ నేరగాళ్లుగా మారుతున్నారు. ఇంకొందరైతే వ్యాపారాలు పెట్టే తమతో ఉన్న భాగస్వాములను నమ్మి లక్షల్లో పెట్టుబడి పెట్టి లెక్కలు తేలక భాగస్వామి చేతిలో మోసపోయి దిక్కుతోచని స్థితిలో పగతో రగిలిపోయేవారు ఉన్నారు. వీరందరిని చేరదీసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ‘చిచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమనే’ చందంగా సందట్లో సడేమియాల్లాగా కొంతమంది రాజకీయ నాయకులు దూరి పర్సంటేజిలతో పనులు కానిచ్చేస్తున్నారు. అప్పులు ఎగ్గొట్టేవారికి వీరు అండదండగా ఉంటున్నారు. అధిక వడ్డీల విషయంలో మాత్రం ప్రైవేట్‌ ఫైనాన్సర్స్‌ల తరపున వకాల్తా పుచ్చుకుని పేదప్రజల ఉసురుపోసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఆర్థికమే నేరంగా మారుతుంది. మనిషి ప్రాణాలుపోయే వరకు వస్తోంది. ‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తిస్తారు. వారికి ఏదో సహాయం చేస్తున్నట్లుగా..తీర్చలేని వడ్డీలకు అప్పులు ఇస్తారు. కొంతకాలం తర్వాత తమ అప్పు తీర్చాలంటూ వారి పీకలమీద కూర్చుంటారు. ఒకవేళ తీర్చలేకపోతే బాధిత మహిళలను, వారి కుటుంబంలోని మహిళలను తమ లైంగిక అవసరాలు తీర్చమని బలవంతం చేస్తారు. అలా కాని పక్షంలో ఇళ్లుపీకి పందిరేస్తామని బెదిరిస్తారు. తమకు పోలీసు, రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి…బాధితుల ఎదురుగానే వారితో ఫోన్లో మాట్లాడుతారు. దీంతో ఇష్టం లేకపోయినా రౌడీలు వస్తే ఎక్కడ తమ పరువుపోతుందనే భయంతో వ్యాపారులు చెప్పినట్లు చేస్తారు. దీనిని వీడియో తీసి బాధితుల కుటుంబంలోని యువతులను కూడా తమ దారికి తెచ్చుకుంటారు. ఇదీ వరంగల్‌ నగరంలోని వ్యవహారం. ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్‌. ఇప్పటివరకూ బయటకు పొక్కకపోయినా నగరంలో ఇలాంటి తతంగమే నడుస్తున్నదని చెప్పొచ్చు. రామన్నపేట, కాశిబుగ్గ, కరీమాబాద్‌, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, గిర్మాజీపేట ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నగరంలో ఇదే ఫార్ములాను అమలుచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు దీనిపై లోతుగా దష్టి సారిస్తే ఇలాంటి సంఘటనలు బయటకు రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి నివాసముంటున్నారు. వీరితోపాటు నగరానికి చెందిన అనేకమంది పేద, మధ్యతరగతి ప్రజలు, చిరువ్యాపారులు తరచూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారు. దీంతో వీరంతా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రుణాలు తీసుకుంటూ ఉంటారు. నగరానికి చెందిన వారితోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారులు ఇలాంటి వారందరికీ రోజువారీ, వారం, నెలవారీ వాయిదాల తీర్మానంపై అప్పులు ఇస్తుంటారు. ఇందుకోసం తీసుకునే వారి అవసరాన్ని బట్టి వడ్డీ రూ.10నుంచి రూ.15 వరకూ వసూలు చేస్తుంటారు. ఇది ఒకవిధంగా అప్పు తీసుకునే వారికి భారమే అయినప్పటికీ మరో ప్రత్నామ్నాయం లేకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తూ వారి ఊబిలో చిక్కుకుంటున్నారు.

నగరంలో వందకుపైగా ఫైనాన్షియర్లు

నగరంలో ఫైనాన్స్‌ ఇచ్చే వ్యాపారుల సంఖ్య వందకుపైగానే వుంటుంది. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్‌ వరంగల్‌కి చెందినవారేనని చెప్పొచ్చు. ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నగరంలో ఏదో ఒకచోట ఇళ్లు అద్దెకు తీసుకుని కార్యాలయంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా కలెక్షన్‌ చేసే వారిని నియమించుకుంటున్నారు. ఉదయాన్నే కార్యాలయానికి వచ్చి ముందురోజు కలెక్షన్లను తీసుకువచ్చే బాయ్స్‌ నుంచి కట్టించుకుంటారు. తర్వాత రికార్డులను సరిచేసుకుని తమ కలెక్షన్‌ బాయ్‌లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫైనాన్స్‌ తీసుకోవాలనుకుంటున్న వారి ఇళ్లకు వెళతారు. అవతలివారి అవసరాన్ని బట్టి వడ్డీలను నిర్ణయించి ఖాళీ ప్రామిసరి నోటు తీసుకుని అప్పులు ఇస్తుంటారు. సాయంత్రం కాగానే కార్యాలయానికి తాళం వేసి తిరిగి వెళతారు. ఇలా ఫైనాన్స్‌ చేస్తున్న వారు నగరంలో వందకుపైగా వుంటారని అంచనా.

వ్యాపారులకు కొంతమంది రాజకీయ నేతల దన్ను

ఫైనాన్స్‌ వ్యాపారులకు నగరంతోపాటు వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కొంతమంది ఖాకీలు, రాజకీయ నేతల అండదండలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాకీ కట్టలేని వారి పట్ల వ్యాపారులు తమదైన వ్యూహాన్ని అమలుచేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా తమ దారికి రాకపోతే వారి ఎదురుగానే తమకు పరిచయం ఉన్న పోలీసులు, రాజకీయ నాయకులకు ఫోన్‌చేసి అత్యంత చనువుగా మాట్లాడుతారు. దీంతో బాధితులు భయపడి వ్యాపారుల ఆగడాలను బయటకు చెప్పలేక లోలోనే కుమిలిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే రౌడీలను వారి ఇళ్లపైకి పంపించి నానా బీభత్సం సష్టించి భయాందోళనకు గురిచేస్తుంటారు. ఇంట్లోని సామాన్లను వీధిలో పడేస్తుంటారు.

మరికొందరైతే భౌతికదాడులకు దిగి బాధితులకు ఉన్న ఆస్తులను వ్యాపారులకు రాసి ఇచ్చేసినట్లు బలవంతంగా సంతకాలు చేయించుకుంటారు. దీనిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ఫిర్యాదులు లేనందున తామేమీ చేయలేమంటూ మిన్నకుండిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై పోలీసులు ఇప్పటికైనా దష్టిసారిస్తే నగరంలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావతం కాకుండా నియంత్రించేందుకు వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బాకీ తీర్చలేకపోతే అరాచకమే..

అవసరం కనుక వడ్డీ గురించి ఆలోచించకుండా అప్పులు తీసుకున్నవారు తిరిగి కట్టేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. దినసరి కూలీలు, చిరువ్యాపారులు కావడంతో వాయిదాలను సక్రమంగా చెల్లించే పరిస్థితి ఉండదు. దీంతో వ్యాపారులు తమ బాకీలపై వడ్డీలకు చక్రవడ్డీలను కలిపి బాధితులకు తలకు మించిన భారాన్ని చూపి తీర్చమని ఒత్తిడి తెస్తారు. తీర్చలేకపోతే బాధితులకు ఉన్న ఆస్తులపై కన్నేసి తక్కువ మొత్తానికి వాటిని సొంతం చేసుకుంటారు. బాధితులకు ఆస్తులు ఏవీ లేకపోతే వారి ఇంట్లో ఉండే మహిళలపై వ్యాపారుల కన్నుపడుతుంది. అందంగా ఉన్న వారుంటే అప్పును బూచిగా చూపి వారిని లోబరుచుకునేందుకు పావులు కదుపుతారు. అలా కానిపక్షంలో రౌడీలను పంపించి ఇంట్లోని వస్తువులను ఎత్తుకుపోతామని, వస్తువులను వీధిలో పడేస్తామని బెదిరిస్తారు. ఆ విధంగా జరిగితే చుట్టుపక్కల వారి దగ్గర పరువుపోతుందనే భయంతో వ్యాపారులు చెప్పినట్లు చేస్తున్నారు. వాటిని వీడియో తీసి వారి కుటుంబంలో ఎవరైనా యువతులు వుంటే వారికి వీడియోలను చూపిస్తామని బెదిరించి ఆ యువతులను కూడా తమదారికి తెచ్చుకుంటున్నారు. అయితే దీనిపై బాధితులు ఇప్పటివరకూ ఫిర్యాదు చేసిన సందర్భాలు లేకపోయినా ఇదంతా గుట్టుగా సాగుతున్న వ్యవహారమేనని కొంతమంది బాధితులు పేర్కొనడం గమనార్హం.

sankethika vyavasthalapia purthi parignanam undali, సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి

సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి

జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌, సిసి టిఎన్‌ఎస్‌ రైటర్లు, రిసెప్షనిస్టులకు సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్‌స్టేషన్‌లలోని సిబ్బందికి ఒకరోజు శిక్షణా శిబిరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిటిఎన్‌ఎస్‌ రైటర్లు, రిసెప్షనిస్టులకు, పోలీస్‌స్టేషన్‌ టెక్‌ టీమ్‌ సిబ్బందికి సిసిటిఎన్‌ఎస్‌, టెక్‌ డాటమ్‌, రిసెప్షన్‌ సెంటర్‌, 07 ఇంటిగ్రేటెడ్‌ ఫార్మ్స్‌ ఎంట్రీ, పోలీస్‌స్టేషన్‌ సంబంధిత రికార్డుల ఆన్‌లైన్‌ ఎంట్రీ అంశాలపై కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ప్రస్తుత ఆధునికయుగంలో మారుతున్న, దూసుకుపోతున్న టెక్నాలజీని మనకు అందుబాటులో ఉన్న అంశాలు విరివిగా వాడుకుంటూ మోడరన్‌ పోలీసింగ్‌ చేయాలని తెలిపారు. ప్రతిఒక్కరు విధుల్లో ఉపయోగించే అన్ని సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని అన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది అందరికి పలు దఫాలలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, ఈ శిక్షణ శిబిరాలలో నేర్చుకున్న అంశాలు రోజువారీ విధుల్లో ఉపయోగిస్తూ వేగవంతమైన ఫలితాలు రాబట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌, ఎస్సై రాజశేఖర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

rashtra avatharana dinostava reharsals, రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌

ఈనెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌ కళాశాల మైదానంలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే పర్యవేక్షణలో జరిగాయి. రేపటి కవాతు రిహార్సల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…యూనిఫార్మ్‌ ధరించి చూపరులను ఆకట్టుకునేలా కవాతు నిర్వహించాలని చెప్పారు. నేడు చేసిన రిహర్సల్స్‌ చాలా బాగున్నాయని, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. కళాశాల మైదానంలో జిల్లా బాంబ్‌ డిస్పోజల్‌ టీం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతోపాటు ఇన్‌స్పెక్టర్‌ రజనీకాంత్‌, ప్లాటూన్‌ కమాండర్‌ దామోదర్‌, ఆర్‌ఎస్సై, పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version