తెలంగాణ ఆణిముత్యం.. సురవరం

సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆణిముత్యమని, ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి 123వ జయంతి వేడుకలను గ్రంధాలయ సంస్థ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సురవరం ప్రతాపరెడ్డి నిజాంకాలంలోనే గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని గుర్తుచేశారు.

తెలంగాణలో కవులు లేరనే విమర్శను సవాల్‌గా స్వీకరించి 354మందితో గోల్కొండ కవుల సంకలనం ద్వారా మన మట్టి గొప్పతనాన్ని చాటారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక చరిత్రను సష్టించుకున్న సురవరం తెలంగాణ ఆణిముత్యమని కొనియాడారు. తెలంగాణలో తెలుగురాదని వాదన ఉన్న సమయంలో సురవరం గోల్కొండ పత్రిక స్థాపించి ప్రజాసమస్యలను పత్రికలో ప్రచురించి ప్రజలపక్షాన నిలిచారన్నారు. నిజాం నిరంకుశపాలన కాలంలోనే సురవరం తెలుగుపత్రికను స్థాపించి తెలంగాణవాణిని వినిపించారన్నారు.

సాంఘిక సంస్కర్తగా ఆయన బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలిచారని, రెడ్డిహాస్టల్‌ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఆయన రచనా సమగ్రాన్ని తెలంగాణ ప్రజలలోకి తీసుకెళ్లేందుకు తద్వారా సురవరం గౌరవాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. జిల్లా ప్రజాసంబంధాల అధికారి మామిండ్ల దశరథం మాట్లాడుతూ సురవరం బహుముఖ ప్రజ్ఞాశాలి అని, పత్రికా సంపాదకుడిగా, రచయితగా, గ్రంథాలయోద్యకారుడిగా, రెడ్డి హాస్టల్‌ నిర్వాహకుడిగా, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా విశేష కషి చేశారన్నారు. తెలంగాణలో సాహిత్య చైతన్యాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. గొల్కొండ పత్రిక, గొల్కొండ కవుల సంకలనంతోపాటు తొలి జానపద సాహిత్యాన్ని సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించారన్నారు.

aruhulaku double bedroom illu nirminchali, అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి

అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి

అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్రీకాంత్‌ అన్నారు. మంగళవారం శాయంపేట మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా మిషన్‌ భగీరథ నల్లాలు పూర్తిగా నిర్మించాలని చెప్పారు. ఈ సమావేశంలో యాదవ్‌, ప్రసాద్‌, ప్రభాస్‌, వికాస్‌, మోహన్‌, కపిల్‌ రామ్‌ పాల్గొన్నారు.

govulatho veluthunna lorry pattivetha, గోవులతో వెళుతున్న లారీ పట్టివేత

గోవులతో వెళుతున్న లారీ పట్టివేత

అక్రమంగా గోవులను తరలిస్తున్న రెండు కంటైనర్ల పెట్టే గల వాహనాలను మంగళవారం వెంకటాపురం యువకులు పట్టుకున్నారు. పట్టుకున్న రెండు లారీలలో గోవులు ఉండటాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. వెంకటాపురం యువకులు పట్టుకున్న రెండు లారీలు, గోవులను పోలీసులకు అప్పగించారు. రెండు లారీలు, పశువులు పోలీసుల అదుపులో ఉన్నాయి.

mhmpia avagahana karyakramam, ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం

ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం

మెన్‌స్ట్రాల్‌ హైజినిక్‌ డేను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మహిళలతో ర్యాలీ చేపట్టారు. మంగళవారం పట్టణకేంద్రంలోని పొదుపు భవన్‌లో ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సమావేశాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఎంహెచ్‌ఎంపై అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు, కిశోర బాలికలకు పరిశుభ్రత లేకపోవడం వల్ల అనేకరకాల ఆరోగ్యసంబంధమైన శారీరక, మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఎన్నో అపోహాలతో ఆ రోజుల్లో బయటకు వెళ్లవద్దని మూఢనమ్మకాలను పాటిస్తున్నారని తెలిపారు. గ్రామగ్రామాల్లో అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టి మహిళలు, కిషోర బాలికలలో అవగాహన కల్పించాలని చెప్పారు. సానిటరి పాతపద్దతులను మానేసి కొత్త పద్దతులు అవలంభించేలా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా మార్పు తీసుకురావాలని, గ్రామాల్లో మరుగుదొడ్లు, ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం చేసినవిధంగానే ఎంహెచ్‌ఎంపై ప్రచారం చేయాలని వివరించారు. డిడబ్ల్యుఓ మాట్లాడుతూ కిషోర బాలికలకు, మహిళలకు రుతుస్రావ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. అదేవిధంగా సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. అదనపు డిఆర్‌డిఓ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా ప్రతి సమావేశంలో ఎంహెచ్‌ఎంపై చర్చించి పేదప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ డిపార్టుమెంట్‌ ఆర్‌బిలు, వైద్యులు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, ఎస్‌బిఎం కన్సల్టెంట్‌ సురేష్‌, సిడిపిఓలు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు, డిఎం అండ్‌ హెచ్‌ఓలు, ఎఎన్‌ఎంలు, ప్రేమ్‌కుమార్‌, నిహారిక, రమ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

prajala avasaralaku thaggattuga panicheyali, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి

ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి

ప్రజల మనోభావాలు, అవసరాలకు తగ్గట్లుగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తించాల్సి వుంటుందని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పనీతీరుపై రాష్ట్ర డీజీపీ మంగళవారం రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతోపాటు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లయిన ఇన్స్‌స్పెక్టర్లు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లతో హైదరాబాద్‌ డిజీపీ కార్యాలయం నుండి వీడియో సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌తోపాటు కమిషనరేట్‌కు చెందిన అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో గత తొమ్మిదినెలల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన శాసన, పార్లమెంటరీ, పంచాయితీ, పరిషత్‌ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు, ఎలాంటి సంఘటన జరగకుండా ఎన్నికల విధులు నిర్వహర్తించినందుకు డీజీపీ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌తోపాటు అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం రానున్న తెలంగాణ పోలీసుల ముందున్న లక్ష్యాలపై డీజీపీ వివిధస్థాయి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరం తెలంగాణ పోలీస్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ పోలీస్‌గా నిలిచిందని, ఈ స్థాయికి తెలంగాణ పోలీస్‌ను తీసుకరావడంలో పోలీస్‌ ఆధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయడమే ఇందుకు కారణమని. ఫిర్యాదుదారుడు రాష్ట్రంలోని ఏ పోలీస్‌స్టేషన్‌కు, ఏ సమయంలో వెళ్లిన ఒకే విధమైన స్పందన వుండాలని, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే మనమందరం జీతాలందుకుంటున్నామని, ప్రజలను మన యజమానులుగా భావించాల్సి వుంటుందని తెలిపారు. అధేవిధంగా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా పోలీసు అధికారులు పనిచేయాలని, విధినిర్వహణలో భాగంగా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా పోలీసులు విధులు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా చట్టాలను అమలుపర్చే ముందుగా పోలీసులు, అధికారులు చట్టాలను పాటించాల్సి వుంటుందని, ముందుగా ట్రాఫిక్‌ సంబంధించి ప్రతి పోలీస్‌ అధికారులు విధిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మేట్‌ ధరించాల్సి వుంటుందని సూచించారు. అధేవిధంగా కారుడ్రైవింగ్‌ చేసే సమయంలో సీటుబెల్ట్‌ తప్పక ధరించే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్‌స్టేషన్లతోపాటు పోలీస్‌ కార్యాలయాల్లో పనితీరుతోపాటు, పరిసరాలను మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టిన 5ఎస్‌ అమలుతీరుపై రాష్ట్ర డీజీపీ అడిగిన ప్రశ్నకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ తెలిపిన వివరణపై రాష్ట్ర డీజీపీ సంతోషాన్ని వ్యక్తం చేయడంతోపాటు ఇన్‌స్పెక్టర్‌ను అభినందించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు వచ్చినప్పుడు తప్పకుండా కమిషనరేట్‌ పరిధిలో 5ఎస్‌ ఆమలుతీరును పరిశీలిస్తానని డీజీపీ పోలీస్‌ కమిషనర్‌కు తెలిపారు. ఈ సమావేశంలో ఎసిపిలు చక్రవర్తి, శ్రీనివాస్‌, జనార్థన్‌, శ్యాంసుందర్‌ సింగ్‌, మాజీద్‌, బాబురావు, శ్రీనివాస్‌తోపాటు ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సబ్‌-ఇన్స్‌స్పెక్టర్లు, పరిపాలన సిబ్బంది పాల్గోన్నారు.

superintendent saibabanu suspend cheyali, సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను సస్పెండ్‌ చేయాలి

సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను సస్పెండ్‌ చేయాలి

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా పేపర్‌ వాల్యూయేషన్‌ క్యాంపు పేరిట అవినీతికి పాల్పడినాడని, క్యాంపులో జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ కమిటీని నియమించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన అవినీతి ఉద్యోగులను గుర్తించి వెంటనే వారిని సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని దళిత బహుజన విధ్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ గురుమిళ్ల రాజు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాయ్స్‌ పేరిట, స్టేషనరీ, ట్రావెలింగ్‌, టిఏ, డిఏ, లెక్చరర్‌లకు పేపర్‌ వాల్యుయేషన్‌ చేసినందుకు ఉన్న లెక్చరర్‌ల కంటే ఎక్కువ మంది లెక్చరర్‌లు వాల్యుయేషన్‌ చేసినట్టుగా పేర్లను సృష్టించి సంతకాలు లేకుండానే బిల్లులు చెక్కుల ద్వారా డ్రా చేశారని, దీనికి డిఐఈవో కూడా సహకరించడం వల్లనే ఇది సాధ్యమయ్యిందని రాజు తెలిపారు. తక్షణమే క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీని వేసి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కమీషనర్‌ను కలవనున్న విద్యార్థి సంఘం నేతలు

అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, ప్రధాన సూత్రదారి అయిన సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను, అతనికి సహకరించిన డిఐఈవో లింగయ్యను సస్పెండ్‌ చేయాలని కోరుతూ తమ వద్ద ఉన్న ఆదారాలతో ఇంటర్మీడియట్‌ బోర్డు కమీషనర్‌ను కలువనున్నట్లు గురుమిళ్ల రాజు తెలిపారు. కార్యాలయంలో జరిగిన అవినీతిపై వెంటనే విచారణ కమిటీని నియమించాలని అన్ని విధ్యార్థి సంఘాలను కలుపుకొని కమీషనర్‌ను కలువనున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్జేడీగా అవినీతిపరులను నియమించొద్దు

ఇటీవల గుండెపోటుతో మరణించిన ఇంటర్మీడియట్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ హనుమంతారావు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి దళిత బహుజన విధ్యార్థి మోర్చా తరుపున సంతాపం తెలుపుతున్నాము. ఆయన మరణంతో ఖాళీ అయిన ఆర్జేడి బాధ్యతలను ఇంటర్‌బోర్డుకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే వారిని నియమించాలి. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో అవినీతిపరులకు సహకరించిన ఓ అధికారి పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తున్నదని ఆయనకు ఎట్టి పరిస్థితులల్లో ఇవ్వవద్దని ఇంటర్మీడియట్‌ బోర్డు కమీషనర్‌కు మా తరుపున కోరుతున్నాం. ఆయనపై ఓ మహిళ పలు పోలీస్‌స్టేషన్‌లల్లో ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారంఉందని వాటి వివరాలను త్వరలో కమీషనర్‌కు అందిస్తామని డిబివిఎం రాష్ట్ర కన్వీనర్‌ గురుమిళ్ల రాజు తెలిపారు.

hanuman junction gudisela kahani…, హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…!

హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…!

ఓ కమ్యూనిస్టు పార్టీ పోరాటం ప్రారంభిస్తుంది. గుడిసెల పోరాటం చేస్తుంది అంటే కమిటీతో చర్చించి, సాధ్య, అసాధ్యాలను పరిశీలించి ముందుకు కదులుతారు. అదే భూపోరాటం చేయాలంటే, పేదప్రజలకు ఇంటిస్థలాలు ఇప్పించాలంటే ఆ భూమి సర్వే నెంబర్‌ ప్రభుత్వ భూమా…? ప్రైవేట్‌ భూమా…? కబ్జాలో ఎవరైనా ఉన్నారా…లేదా…తదితర వివరాలను పరిశీలించి భూమిపైకి వెళ్తారు. కానీ వరంగల్‌ నగరంలో భూపోరాటాలకు సీపీఐ నేతలు చెప్తున్న కొన్ని పోరాటాలు వాటి వెనుక నడిచిన తతంగాలను చూస్తే నవ్వొస్తుంది. గుడిసెల పోరాటంలో పావులుగా మిగిలిపోయి మోసపోయిన పేదప్రజలను చూస్తే ఆవేదన కలుగుతుంది. ఎంతో కొంత ప్రతిఫలం అందుకుని మూట, ముల్లే సర్థుకుని శల్యసారథ్యం వహించిన సీపీఐ నాయకులు నగరంలో అనేక పోరాటాలకు పుల్‌స్టాప్‌ పెట్టారు. అందినకాడికి దండుకుని బయటపడ్డారు. నిజానికి చెప్పాలంటే లక్షల్లో వెనకేసుకున్నారు. చెప్పేది శ్రీరంగ నీతులు…చేసేది ఏదో పని అన్నట్లు కామ్రేడ్‌లు కనికరం లేకుండా పేదప్రజల నిలువ నీడ అనే సెంటిమెంట్‌తో ఇల్లు అనే ఆశతో ఓ ఆట ఆడుకున్నారు.

ఇదీ హనుమాన్‌ జంక్షన్‌ కథ

సరిగ్గా 18సంవత్సరాల క్రితం వరంగల్‌ ములుగురోడ్డు సమీపంలో కాకతీయ కెనాల్‌ దాటాక ప్రస్తుతం హనుమాన్‌ జంక్షన్‌గా పిలుస్తున్న ప్రాంతం కాకతీయుల కట్ట 701, సర్వే నెంబర్‌ 45/బి. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో అప్పటి సీపీఐ నాయకులు పాటూరి సుగుణమ్మ, సదాలక్ష్మి, జ్యోతి, మోతె లింగారెడ్డి, సిరిబోయిన కరుణాకర్‌లు, కేఎల్‌ మహేంద్రనగర్‌ వాసులు ఈ భూమిలో జెండాలు పాతి తుమ్మకంపలు కొట్టి గుడిసెలు వేశారు. ఇల్లును సాధించుకోవాలనే పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చిన పేదలు ధైర్యం కోల్పోలేదదు. పోలీసు, రెవెన్యూ అధికారులు పలుమార్లు గుడిసెలు తొలగించాలని బెదిరించిన పోరాటాన్ని కొనసాగించారు.

పోరాటం ఎందుకు ముగిసింది…?

నెలరోజులపాటు గుడిసెలు వేసి ఇళ్ల స్థలాల కోసం పోరాటం ఉద్ధృతంగా నడిచిన అది రాజీమార్గం పట్టింది. కారణం డబ్బులతో సీపీఐ నాయకులను ఓ భూమి కొనేయడమే కారణమని ఆరోపణ ఉంది. 4లక్షల రూపాయలకు 2వందల మంది గుడిసెవాసుల ఆశలను తాకట్టు పెట్టినట్లు తెలిసింది. సీపీఐకి చెందిన ప్రధాన నాయకులు భూస్వామితో కుమ్మక్కు కాగానే అతని అనుచరులు ఇతర నాయకులను బెదిరించారు. గుడిసెలు తీసేయాలి..మీ నాయకులతో మాట్లాడమని హుకుం జారీ చేశారు. దీంతో పార్టీలో గొడవ ముదిరిపోయిందట. గుడిసెలు ఎలా తీస్తారని కొందరు ప్రశ్నిస్తే పార్టీ ఫండ్‌ ఇస్తారట అని సమాధానం లభించిందట. ఇక్కడ అర్థంకానీ విషయం ఏంటంటే గుడిసెలు వేసేటప్పుడు ప్రభుత్వభూమి రికార్డుల్లో చూశాం అని వాదించిన సీపీఐ నాయకులు, అప్పటి కార్యదర్శితోసహా వెంటనే మాటమార్చి అది ప్రైవేట్‌భూమిని వారికి వారే నిర్థారణకు ఎలా వచ్చారో తెలియదు. కాకతీయుల కోట కట్ట అని ఊదరగొట్టిన నాయకులు పార్టీలోనే ఇతరులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే వెళ్లి ఆ భూస్వామినే అడగండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారని తెలిసింది. ఈ విషయం సీపీఐకి రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. పైగా అతన్నే జిల్లా కార్యదర్శిగా కొనసాగించారు. ఆ తరువాత ఆ భూమి నాది పట్టాదారు అంటూ సీపీఐ నాయకులకు కావాల్సింది ముట్టజెప్పిన భూస్వామి పోలీసులతో తన అనుచరులను పంపి అక్కడ ఉన్న పేదప్రజలను తరిమివేసి గుడిసెలు దగ్ధం చేశారు. సీపీఐ నాయకులు మాత్రం ఆ సీన్‌లోకి ఎంటర్‌ కాకుండా ఇంట్లోనే హాయిగా ఉండిపోయారు. దీంతో హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కథ ముగిసిపోయింది. ఇంటిస్థలం ఆశతో జనం లాఠీ దెబ్బలు తిన్నారు. ఖర్చుల పాలయ్యారు. సీపీఐ నాయకులు మాత్రం కావల్సింది అందుకుని జేబులు నింపుకున్నారు. చివరకు ఓడింది మాత్రం పేదప్రజలే.

prabuthva badilone cherpinchali, ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

గీసుగొండ మండలకేంద్రంలో ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు స్థానిక నాయకులు తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని, అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ సూర్యకళ, ఉపాధ్యాయులు రామ్మూర్తి, ప్రభాకర్‌, స్థానికులు చాడ కొమురరెడ్డి, లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.

bhanudi bagabaga..janam vilavila, భానుడి భగభగ…జనం విలవిల

భానుడి భగభగ…జనం విలవిల

రోజురోజుకు భానుడి ప్రతాపం పెరుగుతోంది…భానుడి భగభగకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రెండురోజుల వ్యవధిలో సుమారుగా 15మంది మృతిచెందారు. ఇదేవిధంగా భానుడు ప్రతాపం చూపితే ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొన్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ 45డిగ్రీలు దాటి 50డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు వెళ్లొచ్చని, ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతను బట్టి అంచనా వేయవచ్చు. ఈ ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలు మధ్యాహ్నం వేళల్లోనైతే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి. రోజువారి పనుల్లో భాగంగా ప్రజలు తమ పనులను ఉదయం 11గంటలలోపే పూర్తి చేసుకుంటున్నారు. తిరిగి అత్యావసర పనుల నిమిత్తం సాయంత్రం 7 తరువాత మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది.

జాగ్రత్తలు తీసుకోవాలి

పనికి వెళ్లే వారు ఉదయం, సాయంకాలం వేళల్లో తమ పనులను చూసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లేవారు తెల్లని కాటన్‌ వస్త్రాలను తలపాగాగా చేసుకుని వెంట తాగేందుకు నీటిని తీసుకువెళ్లాలని తెలిపారు. అదేవిధంగా ఒదులుగా ఉన్న కాటన్‌ వస్త్రాలను ధరించాలని, తలకు తప్పనిసరిగా చేతిరుమాలు చుట్టుకోవాలని, మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై రాకుండానే మంచిదని హెచ్చరిస్తున్నారు.

puttinaroju vedukalu, పుట్టినరోజు వేడుకలు

పుట్టినరోజు వేడుకలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లిబోర్డు వేణునగర్‌ వద్దగల సేవాజ్యోతి శరణాలయంలో వరంగల్‌ జిల్లా వాస్తవ్యుడు, సగర జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారు, నేటిధాత్రి దినపత్రిక అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ధాత్రి గ్రూప్స్‌ చైర్మన్‌ కట్టా రాఘవేందర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో ఒకరోజు మీరోజు కావాలని కోరుతున్నామని అన్నారు. అభాగ్యుల సేవకు ఆలయంగా నిరంతరం సేవలు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శవంతమైన విధంగా జరగాలని, మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖసంతోషాలతో సమాజానికి ఆదర్శంగా జీవించాలని కోరారు. సేవా జ్యోతి శరణాలయం నుండి ఆశీర్వాదం ఎప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉంటుందని అన్నారు. మంచిర్యాల జిల్లా జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం సభ్యుడు ఆసం ముత్తయ్య తిర్యాణి ఎఇఓ మాట్లాడుతూ భారతదేశం ఘనత ప్రపంచానికి పరిచయం చేసిన మహత్ముల పుణ్యభూమిలో పుట్టిన సగరుడు సర్వమానవుల సంక్షేమం కోసం పాటుపడటం అనేకరకాల బాధ్యతలను కూడా స్వీకరించి తదనుగుణంగా ముందుకు వెలుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి సేవా ప్రముఖ్‌ గజ్జెల్లి మల్లేశం, గజ్జెల్లి సత్యకేశవ్‌ జిత్‌, నిర్వాహాకులు కొంకటి స్వప్న, కష్ణ కొంకటి, కుటుంబ రమేష్‌, రాజ్‌కుమార్‌, సర్వమాధవ్‌ జిత్‌, నాగమణి, రాజేశ్వరి, విద్యార్థులు, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

gananga hanuman irumudi mahostvam, ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం

ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం

మండల రోజులు దీక్ష పూర్తి చేసుకున్న హనుమాన్‌ మాలాదారులు సోమవారం ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామంలోని హనుమాన్‌ భక్తులు మాలాధారణతో మండల దీక్ష పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్‌ దేవాలయంలో గణపతి హోమం, నవగ్రహాల పూజలను వేదపండితులు గణేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి నిర్వహించుకున్నారు. అనంతరం ఇరుముడి మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు, కుటుంబసభ్యులతో కలిసి ఇరుముడి ప్రాంగణం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహించారు. బుధవారం జరిగే హనుమాన్‌ జయంతి సందర్భంగా ద్విచక్రవాహనాలపై భద్రాచలానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కందుల కుమారస్వామి, కామెడీ మల్లారెడ్డి, ఈర్ల కొమ్మాలు, గడ్డమీది కుమారస్వామి, శరత్‌, రుదీర్‌, రామకష్ణ, శ్రీనివాస్‌లతోపాటు పలువురు ఉన్నారు.

gudiselu veinchi…beram kudurchuco…,గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో…

గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో…

నిలువ నీడలేని పేదలను కొందరిని చేరదీస్తారు. చెప్పింది వినాలంటారు. ప్రభుత్వభూమినో, ప్రైవేటు భూమినో చూపిస్తారు. ఇందులో మీకు జాగ ఖాయం అంటారు. దీనిని చదును చేస్తే మనం గుడిసెలు వేసుకోవచ్చని నమ్మకంగా చెప్తారు. నిలువ నీడ దొరుకుతుంది. నగరంలో ఓ ఇల్లు కట్టుకోవచ్చని పేదలు చెప్పిన ప్రతీ దానికి తలలూపుతారు. మరీ భూమిని చదును చేయాలి, జెండాలు పాతాలి, పోలీసులను ఎదుర్కొవాలి. ఇదంతా చేయాలంటే ముందుగా చేతిలో ఎంతో కొంత పైకం ఉండాలి. ఇంకేముంది చేరదీసిన ప్రజల వద్ద నుంచే తలా కొన్ని పైసలు వసూలు చేస్తారు. ఇక్కడ మొదలవుతుంది. వసూళ్ల పర్వం వంద నుంచి మొదలైన ఈ పర్వం డిమాండ్‌ను బట్టి వేలకు చేరుకుంటుంది. పొద్దస్తమానం కష్టపడి సంపాదించిన సొమ్మును నిలువ నీడ కోసం పేదలు అక్కడి నాయకులకు సమర్పించుకుంటారు. కష్టనష్టాలకోర్చి గుడిసెలు వేసుకుంటారు. ఒకటి, రెండు రోజులు చూసి ప్రభుత్వభూమి అయితే రెవెన్యూ అధికారులు, పోలీసుల సహాయంతో గుడిసెలు తొలగిస్తారు. అడ్డుకుంటే ఈడ్చి అవతల పారేస్తారు. డబ్బులు వసూలు చేసి గుడిసెలు వేయడానికి నాయకత్వం వహించిన నాయకులు సైతం అధికారులకు ఎదురుతిరుగుతారు. పోలీస్‌ వ్యాన్‌ ఎక్కుతారు. ఇదంతా బాగానే ఉన్నా తెల్లవారి నుంచి గుడిసెల పోరాటం మాట వినపడదు. చివరకు పేదలు, గుడిసె కోసం చెమటోడ్చి తమ కష్టార్జితం చేతిలో పెట్టినవారు నష్టపోతారు. నాయకులు మాత్రం వసూళ్ల పైసలతో హాయిగా ఉంటారు. ఇక ప్రైవేట్‌ స్థలం అయితే కథ వేరే విధంగా ఉంటుంది. వారం, పదిరోజులపాటు గుడిసెలు వేసి తమకు పేద ప్రజల అండ ఉందని నిరూపించుకుని బేరసారాలకు దిగుతారు. యజమానితో కుమ్మకైతారు. అదే రియలెస్టేట్‌ వెంచర్‌ అయితే డిమాండ్‌ భారీగానే పెట్టి తమ జేబులు నింపుకుని గుడిసెలు వేసిన వారికి ఏవో మాయమాటలు చెప్పి తప్పుకుంటారు. గుడిసెల స్థలంలో వారం, పదిరోజుల్లో అందమైన భవంతులు, అపార్టుమెంట్లు వెలుస్తాయి. ఇక్కడ చివరకు పేదలే ఓడిపోతారు. నాయకులు ఆర్థికంగా లాభపడి హాయిగా ఉంటారు. ఇదంతా గుడిసెల పేరుతో జరుగుతున్న పోరాటాల్లో తరుచుగా కనపడుతున్న మోసాలు. నిలువ నీడ లేని పేదలకు ఎంతో కొంత జాగ కోసం పోరాటం చేయడం సరైందే అయిన కేవలం తమ పార్టీల కోసం డబ్బులు రాబట్టుకోవడం కోసం కొందరు కమ్యూనిస్టుల పేరుతో ఎర్రజెండాను అడ్డుగా పెట్టుకుని దిగజారుడు పద్దతులు అవలంభించడం నిజంగా క్షమించరాని నేరం.

బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మూెత్సవాలు జరుగుతున్న సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నూతనంగా ఎంపికైన మహబూబాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితలు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఆలయ ధర్మకర్త వారికి ఘనంగా స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ జడ్పీటిసి అభ్యర్థి ఆకుల శ్రీనివాస్‌, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బీరం సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్‌ మురళి, హేమచందర్‌గౌడ్‌, కమలాకర్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.

anni vidala adukuntam,  అన్ని విధాల ఆదుకుంటాం

అన్ని విధాల ఆదుకుంటాం

కిడ్ని వ్యాధితో మృతిచెందిన అనుముల రమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. వివరాల్లోకి వెళితే…మండలంలోని నాగపురానికి చెందిన అనుముల రమ కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం నగరంలోని మ్యాక్స్‌కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌, ఎంపిపి మార్నేని రవిందర్‌రావులు ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా రమ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉండి వారిని ఆదుకుంటామని అన్నారు. అనంతరం వారి కుటుంబానికి ఆయన ఆర్ధికసహాయం చేశారు. మృతురాలికి భర్త సంపత్‌, కుమార్తెలు శిరిష (25), అనూష(21)లు ఉన్నారు.

kulina prabuthva patashala bavanam, కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం

కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం

నుగూరు వెంకటాపురం మండలం నెలారిపేటలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం శనివారం ఉదయం కుప్పకూలింది. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలకోసం నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శిథిలమైన భవనాల్లో పాఠశాల నడపడం ఎప్పటికైనా ప్రమాదమేనని వారు అంటున్నారు.

 

errajanda perutho buvyaparam, ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం

ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం

వారికి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం లేకున్నా కమ్యూనిస్టులమని చెప్పుకుంటారు. ఎర్రజెండా పేరుతో గుడిసెలు వేస్తారు. ఖరీదైన స్థలాలను గుర్తించి అమ్మేసుకుంటారు. అధికారుల సాయం తీసుకోవడానికి వారికి స్థలం ఆశ చెపుతారు. ఖరీదైన ప్రభుత్వ స్థలంలోనే అధికారులకు ప్రహరీ గోడ కట్టి, బోర్‌ వేసి స్థలాన్ని ఆక్రమించి అప్పగిస్తారు. అధికారుల స్థలాన్ని కంటికి రెప్పలా కాపాడుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే స్థలం ఆ అధికారిది కాదు మాదే అని దబాయిస్తారు. ఎం చూస్తారో చేసుకొండని బెదిరిస్తారు. విలేకరులు వివరణ అడిగిన అలాగే అంటారు. అసలు మీకేం సంబంధం మేము ఇలాగే కబ్జా చేస్తాం అంటూ అవగాహన లేకుండా మాట్లాడుతారు. స్థానిక పోలీసు అధికారికి సైతం ఇందులో వాటా ఉందంటారు. ప్రభుత్వ భూములు యథేచ్చగా కబ్జా అవుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లే వ్యవహరిస్తారు. హన్మకొండలో జరుగుతున్న ఈ యధేచ్చ కబ్జాపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కథనం సోమవారం సంచికలో…

collector sir…mudokannu teravali, కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…

కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ జిల్లా డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతికి పాల్పడిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేస్తూ, డిఐఈవో, సూపరింటెండెంట్‌ను విధుల్లో నుండి తొలగించాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సమితి(ఎవిపిఎస్‌), అంబేద్కర్‌ విద్యార్థి సమాఖ్య(ఎబిఎస్‌ఎఫ్‌), డెమోక్రాటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌(డివైఎఫ్‌), భారతీయ విద్యార్థి మోర్చా(బివిఎమ్‌), బహుజన దళిత్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌(బిడిఎస్‌ఎఫ్‌) సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత పదిరోజులుగా డిఐఈవో కార్యాలయంలో క్యాంపు పేరిట వచ్చిన డబ్బులను కార్యాలయంలోని కొందరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోపాటు డిఐఈవో, సూపరింటెండెంట్‌లు అవినీతికి పాల్పడ్డారని ‘నేటిధాత్రి’ దినపత్రికలో వస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సంబంధిత జిల్లా యంత్రాంగం అధికారుల తీరును విమర్శిస్తున్నారు.

అవినీతి ఉద్యోగులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీని నియమించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను గుర్తించి వెంటనే సస్పెండ్‌ చేయాలి. స్టేషనరీ పేరుతో ముక్కున వేలేసుకునే విధంగా లెక్కలు రాశారని, క్యాంపులో పనిచేయని వారి పేర్లను రాసి దొంగపేర్లతో, దొంగల అకౌంట్లలో డబ్బులు వేసుకుని అందినకాడికి దండుకున్నారని, కొన్ని బిల్లులపైన తీసుకున్న వారి సంతకాలు లేకున్నా వారికి చెల్లించినట్టుగా బిల్లులు తయారుచేసి అసలు పనిచేసిన వారికి తెలియకుండా ఎక్కువ మొత్తంలో నొక్కేశారు. పేపర్‌ వాల్యుయేషన్‌ చేసే లెక్చరర్‌ల విషయంలో కూడా ఒక్కో టేబులో ఉన్న వారికంటే ఎక్కువ మంది ఉన్నట్టు బిల్లులు డ్రా చేశారు. వీటిని కమిటీ చేత విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

డిఐఈవో, సూపరింటెండెంట్‌లను ఉద్యోగాల నుండి తొలగించాలి

క్యాంపునకు చెందిన డబ్బులను డ్రా చేయడంలో వీరిద్దరి పాత్ర కీలకమైనదని, వీరు సంతకాలు చేస్తేనే బిల్లులు డ్రా చేసే అవకాశం వుంటుంది. ఫిఫ్టీ-ఫిఫ్టీ దండుకునేందుకు పన్నిన ప్రణాళికలో భాగమే ఈ అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. క్యాంపు రిజిష్టర్‌లలో సంతకాలు లేని వారికి బిల్లులు, డబ్బులు డ్రా ఎలా చేస్తారని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ అవినీతి భాగోతానికి సూత్రధారి డిఐఈవో, పాత్రధారి సూపరింటెండెంట్‌లేనని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, ఇంటర్మీడియట్‌ ఆర్జేడీ వెంటనే స్పందించి విచారణ చేయించి బాధ్యులను ఉద్యోగాల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్‌ బోర్డు కమీషనర్‌, హైదరాబాద్‌, తెలంగాణ విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రాలు ఇస్తామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

harithahaaraniki mokkalu siddam cheyali, హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి

హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి

హరితహారం కార్యక్రమ సమయానికి మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని రాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి సూచించారు. శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాయినగర్‌లో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహార కార్యక్రమానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. అదేవిధంగా సాయినగర్‌లోని వాటర్‌ట్యాంకులను సందర్శించి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సినారె ఆధునాతన గ్రంథాలయ పనులను పర్యవేక్షించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీలకు సూచిస్తూ నాణ్యతాయుతంగా పనులు కొనసాగేలా చూసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

 

summer season, badibatapia avagahana, సమ్మర్‌ సీజన్‌, బడిబాటపై అవగాహన

సమ్మర్‌ సీజన్‌, బడిబాటపై అవగాహన

సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌లో సమ్మర్‌ సీజన్‌, బడిబాటలపై తెలంగాణ సాంస్క తిక సారధి, టీమ్‌లీడర్‌ గడ్డం శ్రీనివాస్‌ అవగాహన కల్పించారు. శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌ గ్రామాలు పెద్దూర్‌, జగ్గారావుపల్లి, సర్దాపూర్‌ గ్రామాల్లో జిల్లా సమాచారశాఖ ఆదేశాలతో గడ్డం శ్రీనివాస్‌ బందంచే సమ్మర్‌ సీజన్‌, టిబి వ్యాధి, బడిబాటలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లితండ్రులు కషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏవిధమైన ఫీజులు లేకుండా నాణ్యమైన విద్య, మంచి సంస్క తి, ఆరోగ్యమైన వాతావరణం ఉంటుందని వివరించారు. కూలి పనులు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు, మండుటెండలకు అందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలని అన్నారు. ఎండలోకి వెళ్లే ముందు తలపాగా, టోపి ధరిస్తూ, గొడుగు, మంచినీరు వెంట ఉంచుకోవాలని చెప్పారు. పిల్లలు, వద్దులు, గర్భిణులు, బీపీ, షుగర్‌, గుండె జబ్బులు ఉన్నవారు, ధీర్ఘ వ్యాధిగ్రస్తులపై వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కనుక ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, తెల్లని, వదులైన కాటన్‌ దుస్తులు ధరించడం మంచిదని సూచించారు. మజ్జిగ, నిమ్మ, కొబ్బరినీళ్లు తాగడం, అధికంగా ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిదని, ఎండలో ఎలాంటి రక్షణ లేకుండా తిరగడం, నీళ్లు తక్కువగా, మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా వడదెబ్బ తగులుతుందని తెలిపారు. తల తిరగడం, తీవ్ర తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం, బాగా జ్వరం రావడం అనిపిస్తే సత్వర చికిత్స అందజేయాలని, లేకుంటే ప్రమాదకరం, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణం, నీడలో కాసేపు సేదతీర్చి మంచినీరు తాగించి, తడిగుడ్డతో తుడిచి, చల్లని నీటిస్నానం చేయించి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వివరించారు. అదేవిధంగా టీబీ వ్యాధి గాలి ద్వారా మైక్రో బ్యాక్టీరియా, ఒకరినుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అని, టిబి2 వరకు పైగా జ్వరం, తేమడతో కూడిన దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, నీరసం, తిమ్మిర్లు, రాత్రిపూట చెమటలు, ఈ లక్షణాలు కనిపిస్తే సమీప ఏరియా ఆస్పత్రులలో పరీక్షలు చేయించాలని సూచించారు. టిబి అని నిర్దారణకు వస్తే భయపడే అవసరం లేదని, తగు జాగ్రత్తలతో డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ, వ్యాధికి తగు మందుల కోర్సును వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణకోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఎడ్మల శ్రీధర్‌రెడ్డి, ఆకునూరి దేవయ్య, గడ్డం దేవయ్య, కాయితోజు ప్రవీణ్‌, పొత్తురి రాజు, కొడుమోజు లక్ష్మినారాయణ, ఆయా గ్రామల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

 

మడిపల్లిలో మహాయజ్ఞం

మడిపల్లిలో మహాయజ్ఞం

మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం బొడ్రాయి ఉత్సవాల చివరిరోజు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు బొడ్రాయి వద్ద పూజలు చేసి మహాయజ్ఞం చేశారు. గ్రామస్తులంతా కలసివచ్చి గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రతిష్టించిన అమ్మవార్లకు కొత్తబట్టలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమతమ మొక్కులు తీర్చుకున్నారు. వేదపండితులతో ప్రతిఒక్కరు అమ్మవార్ల దీవెనెలు తీసుకున్నారు. గ్రామంలోని వారందరు చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గల గ్రామాల ప్రజలు కూడా మడిపల్లి గ్రామంలోని బొడ్రాయి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ బొడ్రాయి మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఆనందోత్సాహాలతో సాగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ చిర్ర సుమలత విజయ్‌, ఎంపిటిసి ఆకుల ఇంద్రయ్య, రైతు సమన్వయ అధ్యక్షుడు అంచూరి విజయ్‌కుమార్‌, వెలుదండి శ్రీరాములు, రమేష్‌, మాజీ ఎంపిటిసి రాజ్‌కుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version