గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామంలోని పలు సమస్యల పట్ల, గ్రామాబివద్ధి లక్ష్యంగా సమీక్ష సన్నివేశాన్ని సర్పంచ్‌ బరిగెల లావణ్య అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామంలోని అంతర్గతరోడ్లు, మంచినీటి సౌకర్యం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పనుల పట్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కెసిఆర్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్నిరకాల వర్గాల ప్రజలకు అందేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రుతి, ఉపసర్పంచ్‌ బాషబోయిన శ్రీనివాస్‌, వార్డుసభ్యులు ఉప్పుల రాజు, శ్యామల, రజితలతోపాటు కారోబార్‌ కొల్లాపురం కోటిలింగంలతోపాటు పలువురు పాల్గొన్నారు.

ఎన్నికల ఖర్చుల్లో గోల్‌మాల్‌ : ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

కమీషన్లే ఆయన ప్రధాన కర్తవ్యం. విధులు నిర్వహించే శాఖలోనైనా, అతని భాద్యత నిర్వహించే ఏ పనిలోనైనా ఆయనకు వ్యవస్థను అవినీతిమయం చేయడం వెన్నతో పెట్టిన విద్య. పైకి మాములూగా నవ్వుతూ అంతా సవ్యంగానే చేస్తున్నట్లు కనిపించినా ఆ నవ్వు మాటున అవినీతి అర్రులు చాచుకుని ఆనంద తాండవం చేస్తుంది. గత 7నెలలుగా జరుగుతున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది రెవెన్యూశాఖ. ఈ శాఖలోనూ పనిచేస్తున్న ఈయన ఈ వ్యవహారంలోనూ ఆయన వ్యవహారశైలిని మార్చుకోలేదు. ఇంకే ముంది ఎన్నికల విధుల్లో పాల్గోన్న సిబ్బందికి సంబంధించి వచ్చిన టిఎ, డిఎల్లో భారీగా దండుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారం ఇప్పుడే జరుగుతున్నది కాకపోయినా తాజాగా ఈయన వ్యవహరిస్తున్న తీరు పట్ల విసుగు చెందిన ప్రభుత్వ అధికారులే ఈయన జరుపుతున్న వ్యవహారంపై బహిరంగ విమర్శలు చేస్తున్నారంటే సదరు రెవెన్యూ అధికారి ఆగడాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పకనే చెబుతున్నారు. ఇక ప్రభుత్వ అధికారుల పరిస్థితే ఇలా ఉంటే ఎన్నికల విధుల్లో పనిచేసిన అనధికార వ్యవస్థకు సంబంధించిన వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.

వివిధ శాఖల అధికారుల అలవెన్స్‌లలో కమీషన్లు…

శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికల విధుల్లో భాద్యతలు నిర్వహించిన వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారుల రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల నుండి గెజిటెడ్‌ అధికారులు మైక్రో అబ్జర్వర్లుగా, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, వీడియో సర్వేలైన్స్‌ టీం, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎస్‌టి విభాగాలకు సంబంధించి శాసనసభ ఎన్నికల్లో 52రోజులు, పార్లమెంట్‌ ఎన్నికల్లో 22రోజులు విధులు నిర్వహించారు. వీరు నిర్వహించిన విధులకుగాను ఎన్నికల కమీషన్‌ ఇచ్చిన అలవెన్స్‌లలో భారీగా కమీషన్ల రూపంలో దండుకున్నారు. పనిచేసిన కాలానికి ఎంత మొత్తం వచ్చింది అని వారు అడిగినప్పటికి పూర్తి అలవెన్స్‌ రాలేదని, ఇంతే వచ్చిందని మరికొందరు అధికారులకు చెప్పి వారితో అలవెన్స్‌లు ముట్టినట్లు సంతకాలు తీసుకున్నారు. సదరు రెవెన్యూ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై చేసేదెమి లేక ఇచ్చిందే పుచ్చుకుని సైలెంట్‌ అయ్యారు.

ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

ఎన్నికల విధుల్లో భాగమైన ప్రైవేట్‌ వాహనాలు, ఫోటో, వీడియోగ్రాఫర్లు, టెంట్‌హౌజ్‌ ఇలా అన్ని వ్యవస్థల్లోనూ ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. ఉన్నతస్థాయి గెజిటెడ్‌ అధికారుల అలవెన్స్‌లలోనే కమీషన్లకు దిగిన ఆయనకు అనధికార వ్యవస్థలో విధులు నిర్వహించిన వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. వారికి పూర్తి డబ్బులు ఇవ్వకపోగా ఇచ్చిన డబ్బులు ఇవ్వడానికి ముందుగానే తన చేతివాటంతో లంచాలు తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల విధులకు సంబంధించిన వీరికి వచ్చిన నిధులను సగానికిపైగా స్వాహా చేసి అధికారులు వాటాలు పంచుకున్నారని, ప్రతి ఎన్నిక సందర్భంలోనూ రెవెన్యూ అధికారులు ఇలానే చేస్తారని ఫోటో, వీడియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల కమీషన్‌ ఎంత కేటాయించిందో అంతా గోప్యం…

ఎన్నికల సంధర్భంగా విధులు నిర్వహించిన వివిధ విభాగాల వారికి కమీషన్‌ అలవెన్స్‌లు, ఖర్చుల కొరకు నిర్ధిష్టమైన మొత్తాలను కేటాయిస్తారు. కానీ ఈ ఖర్చుల మొత్తాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. విధులు నిర్వహించిన ప్రభుత్వ గెజిటెడ్‌ తెలుపుతున్న సమాచారం ప్రకారం అలవెన్స్‌లుగా 1200రూపాయలు ప్రతిరోజుకు ఇస్తారని అంటున్నారు. అధేవిధంగా ఫోటో, వీడియో గ్రాఫర్లకు భోజన ఖర్చులకు, టెంట్‌ హౌజ్‌, కిరాయి వాహనాలకు ఖర్చులను కేటాయిస్తారు. కానీ ఎవరికి ఎంత కేటాయిస్తారనేది మాత్రం రెవెన్యూ అధికారులకు మినహాయించి మరెవ్వరికి తెలియదు. తెలియకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. పనిచేసిన వారికి వచ్చిన అలవెన్స్‌లు, జీతభత్యాలు, ఖర్చులకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఎందుకు ఉంచుతారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

స్థానిక రెవెన్యూ అధికారి కనుసన్నలోనే వ్యవహారమంతా…?

స్థానికంగా రెవెన్యూ కార్యాలయంలో కీలక అధికారి అయిన ఒకరి చేతుల్లోనే ఈ వ్యవహారమంతా జరుగుతుందని ఎన్నికల విధుల్లో పని చేసిన వారు చెబుతున్నారు. కీలక అధికారి కావడంతో సమన్వయలోపం ఏర్పడుతుందని చేసేదేమి లేక ఇచ్చిన మొత్తాన్నే విధులు నిర్వహించిన వివిధ శాఖల అధికారులు తీసుకుంటే, ఇక అనధికార వ్యవస్థకు సంబంధించిన వారు ఇదేంటని అడిగితే మరోమారు వారి అవకాశం ఇవ్వరనే భయంతో ఆ అధికారిని ప్రశ్నించడం లేదు. దీంతో ఆయన చేస్తున్న అవినీతి వ్యవహారానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. సదరు అధికారి చేస్తున్న అవినీతిలో ఉన్నత అధికారులకు వాటాలు చేరుతాయని, అందుకే వారు కూడా ఈ వ్యవహారం గురించి నిమ్మకు నిరెత్తనట్లు వ్యవహరిస్తూ ఆయనకు అవసరమైన అండదండలు అందిస్తారని అందరు చెప్పుకుంటున్నారు. సమాజంలో కీలకశాఖలో పనిచేస్తూ ప్రతి అంశంలో అవినీతికి పాల్పడుతూ ఇటు ప్రజలను,అటు అధికారులను వదలకుండా చేస్తున్న వ త్తికి కలంకం తెస్తున్న సదరు అధికారి వ్యవహారం గురించి సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగిన విచారణ చేసి ఎన్నికల విధుల్లో పాల్గోన్న సిబ్బందికి, ప్రజలకు న్యాయం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఎమ్మెల్యే నరేందర్‌ను అభినందించిన కేటీఆర్‌

ఎమ్మెల్యే నరేందర్‌ను అభినందించిన కేటీఆర్‌

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టీ.రామారావు అభినందించారు. బుధవారం వరంగల్‌ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విజయం, పరిషత్‌ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన సందర్బంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా వారిని కేటీఆర్‌ అభినందించారు. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయం సాధించినందుకు కేటిఆర్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరించి జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుని అన్ని స్థానాల్లో విజయం సాదించిన సందర్బంగా తూర్పు ఎమ్మల్యే నన్నపునేని నరేందర్‌ను కేటీఆర్‌ ఈ సందర్బంగా అభినందించారు. కేటిఆర్‌ను కలిసిన వారిలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, టిఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు తదితరులు ఉన్నారు.

పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు : జడ్పీటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు

పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు

జడ్పీటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నామని వరంగల్‌ నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. మంగళవారం వరంగల్‌ ఆర్బన్‌ జిల్లాకు సంబంధించి మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ధర్మసాగర్‌లోని వియంఅర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలను పోలీస్‌ కమిషనర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు జరుగుతున్న కేంద్రాల్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్‌ కమిషనర్‌ పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఎనిమిది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోంది. డిసిపి స్థాయి పోలీస్‌ అధికారి పర్యవేక్షణలో ఎసిపి పోలీస్‌ అధికారి అధ్వర్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

నర్సంపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా..

నర్సంపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా..

నర్సంపేట డివిజన్‌లోని ఆరుమండలాల్లో 50ఎంపిటిసి స్థానాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. టిఆర్‌ఎస్‌ పార్టీ దుగ్గొండి, నెక్కొండ, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపిపి స్థానాల మెజారిటీని కైవసం చేసుకోగా, నర్సంపేట మండలంలో ఎంపీపీ స్థానానికి మెజారిటీతో కాంగ్రెస్‌ పార్టీ తన సత్తా చాటుతూ పరువు నిలబెట్టుకుంది. డివిజన్‌వ్యాప్తంగా 70స్థానాలు ఉండగా టీఆర్‌ఎస్‌ పార్టీ 50స్థానాలలో అత్యధికంగా గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ 19స్థానాలను గెలుచుకుంది. డివిజన్‌వ్యాప్తంగా దుగ్గొండి మండలంలోని వెంకటాపురం ఎంపిటిసి స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి ఊహించని విధంగా గెలుపొందారు. నర్సంపేట డివిజన్‌వ్యాప్తంగా గెలుపొందిన ఎంపిటిసి స్థానాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. నర్సంపేట మండలంలో మొత్తం 11ఎంపిటిసి స్థానాలకు 5టీఆర్‌ఎస్‌ గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ 6స్థానాలను కైవసం చేసుకుంది. చెన్నారావుపేట మండలంలో మొత్తం11స్థానాలు ఉండగా టిఆర్‌ఎస్‌ పార్టీ 9 కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ పార్టీ 2 సాధించింది. దుగ్గొండి మండలంలో 12 స్థానాలకు మల్లంపల్లి ఎంపిటిసి స్థానం ఏకగ్రీవం కాగా, ఏకగ్రీవంతోపాటు 9స్థానాల్లో అధికార పార్టీ తన సత్తాను చాటుకోగా, కాంగ్రెస్‌ 1 స్థానంలో, ఇండిపెండెంట్‌ 1స్థానాలు గెలుపొందాయి. నల్లబెల్లి మండలంలో 11స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ 10స్థానాలల్లో గెలుపొంది ప్రభంజనం సష్టించగా, కాంగ్రెస్‌ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నది. నెక్కొండ మండలంలో 16స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ 10 గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ 6స్థానాలను గెలుపొందింది. ఖానాపురం మండలంలో 9ఎంపిటిసి స్థానాలకు టిఆర్‌ఎస్‌ పార్టీ 6 కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలతో నిలిచింది. ఈ సందర్భంగా గెలుపొందిన ఎంపిటిసి అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ధవపత్రాలను అందచేశారు.

నర్సంపేట మండలంలో…

రాజుపేట : కాంగ్రెస్‌

ముత్తోజిపేట : కాంగ్రెస్‌

చంద్రయ్యపల్లి : టీఆర్‌ఎస్‌

లక్నేపల్లి : కాంగ్రెస్‌

బాంజీపేట : కాంగ్రెస్‌

ముగ్దుంపురం : కాంగ్రెస్‌

మహేశ్వరం : టీఆర్‌ఎస్‌

మాధన్నపేట : కాంగ్రెస్‌

కమ్మపెల్లి : టీఆర్‌ఎస్‌

గురిజాల : టీఆర్‌ఎస్‌

ఇటుకాలపల్లి : టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 05

కాంగ్రెస్‌ : 06

మొత్తం ఎంపీటీసీలు : 11

చెన్నారావుపేట మండలంలో…

చెన్నారావుపేట : టీఆర్‌ఎస్‌

కోనాపురం : టీఆర్‌ఎస్‌

ఉప్పరపల్లి : టీఆర్‌ఎస్‌

లింగగిరి : టీఆర్‌ఎస్‌

అమీనాబాద్‌ : టీఆర్‌ఎస్‌

పాపయ్యపేట : టీఆర్‌ఎస్‌

ఖాదర్‌ పేట : టీఆర్‌ఎస్‌

జల్లి : టీఆర్‌ఎస్‌

ఎల్లాయిగూడెం : కాంగ్రెస్‌

అక్కల్‌ చెడ : టీఆర్‌ఎస్‌

బోజేర్వు : కాంగ్రెస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 02

మొత్తం ఎంపీటీసీలు : 11

దుగ్గొండి మండలంలో…

దుగ్గొండి : టీఆర్‌ఎస్‌

చాపలబండ : కాంగ్రెస్‌

తొగర్రాయి : టీఆర్‌ఎస్‌

మహ్మదాపురం : టీఆర్‌ఎస్‌

మల్లంపల్లి : ఏకగ్రీవం

ముద్దునూరు : టీఆర్‌ఎస్‌

నాచినపల్లి : టీఆర్‌ఎస్‌

పోనకల్‌ : టీఆర్‌ఎస్‌

వెంకటాపురం : స్వతంత్ర

తిమ్మంపేట : టీఆర్‌ఎస్‌

లక్మీపురం : టీఆర్‌ఎస్‌

రేకంపల్లి : టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 01

స్వతంత్ర : 01

ఏకగ్రీవం : 01

మొత్తం ఎంపీటీసీలు : 12

నల్లబెల్లి మండలంలో…

నల్లబెల్లి : టీఆర్‌ఎస్‌

నారక్కపేట : టీఆర్‌ఎస్‌

నందిగామ : టీఆర్‌ఎస్‌

రంగాపురం : టీఆర్‌ఎస్‌

అర్షనపల్లి : టీఆర్‌ఎస్‌

రుద్రగూడెం : టీఆర్‌ఎస్‌

కన్నారావుపేట : టీఆర్‌ఎస్‌

రాంపూర్‌ : టీఆర్‌ఎస్‌

మేడపల్లి : కాంగ్రెస్‌

గోవిందాపురం : టీఆర్‌ఎస్‌

లెంకాలపల్లి : టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 10

కాంగ్రెస్‌ : 01

మొత్తం ఎంపీటీసీలు : 11

నెక్కొండ మండలంలో…

నెక్కొండ 1 : కాంగ్రెస్‌

నెక్కొండ 2 : టీఆర్‌ఎస్‌

అప్పల్‌ రావుపేట : టీఆర్‌ఎస్‌

పత్తిపాక : టీఆర్‌ఎస్‌

పెద్దకోర్పోలు : టీఆర్‌ఎస్‌

దీక్షకుంట్ల : టీఆర్‌ఎస్‌

గొల్లపల్లి : టీఆర్‌ఎస్‌

అలంకానిపేట : టీఆర్‌ఎస్‌

బొల్లికొండ : కాంగ్రెస్‌

బంజరుపల్లి : టీఆర్‌ఎస్‌

నాగారం : కాంగ్రెస్‌

వెంకటాపురం : ఏకగ్రీవం

రెడ్లవాడ : కాంగ్రెస్‌

సూరిపెల్లి : కాంగ్రెస్‌

టీక్యాతండా : కాంగ్రెస్‌

గుండ్రపల్లి : టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 06

ఏకగ్రీవం : 01

మొత్తం ఎంపీటీసీలు : 16

ఖానాపురం మండలంలో…

ఖానాపురం 1 : టీఆర్‌ఎస్‌

ఖానాపురం 2 : టీఆర్‌ఎస్‌

అశోకనగర్‌ 1 : టీఆర్‌ఎస్‌

అశోకనగర్‌ 2 : టీఆర్‌ఎస్‌

బుధరావుపేట 1 : కాంగ్రెస్‌

బుధరావుపేట 2 : టీఆర్‌ఎస్‌

కొత్తూరు : టీఆర్‌ఎస్‌

మంగళవారిపేట : కాంగ్రెస్‌

ధర్మరావుపేట : కాంగ్రెస్‌

టీఆర్‌ఎస్‌ : 06

కాంగ్రెస్‌ : 03

మొత్తం ఎంపీటీసీలు : 09

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కారుదే పైచేయి

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కారుదే పైచేయి

వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ఎంపిటిసి ఫలితాలు

నర్సంపేట మండలంలో…

1) రాజుపేట – కాంగ్రెస్‌

2) ముత్తోజిపేట – కాంగ్రెస్‌

3) చంద్రయ్యపల్లి – టీఆర్‌ఎస్‌

4) లక్నేపల్లి – కాంగ్రెస్‌

5) బాంజీపేట – కాంగ్రెస్‌

6) ముగ్దుంపురం – కాంగ్రెస్‌

7) మహేశ్వరం – టీఆర్‌ఎస్‌

8) మాధన్నపేట – కాంగ్రెస్‌

9) కమ్మపెల్లి – టీఆర్‌ఎస్‌

10) గురిజాల – టీఆర్‌ఎస్‌

11) ఇటుకాలపల్లి – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 05

కాంగ్రెస్‌ : 06

మొత్తం ఎంపీటీసీలు : 11

…………………………..

చెన్నారావుపేట మండలంలో…

1) చెన్నారావుపేట – టీఆర్‌ఎస్‌

2) కోనాపురం – టీఆర్‌ఎస్‌

3) ఉప్పరపల్లి – టీఆర్‌ఎస్‌

4) లింగగిరి – టీఆర్‌ఎస్‌

5) అమీనాబాద్‌ – టీఆర్‌ఎస్‌

6) పాపయ్యపేట – టీఆర్‌ఎస్‌

7) ఖాదర్‌పేట – టీఆర్‌ఎస్‌

8) జల్లి – టీఆర్‌ఎస్‌

9) ఎల్లాయిగూడెం – కాంగ్రెస్‌

10) అక్కల్‌ చెడ – టీఆర్‌ఎస్‌

11) బోజేర్వు – కాంగ్రెస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 02

మొత్తం ఎంపీటీసీలు : 11

…………………………………..

దుగ్గొండి మండలంలో…

1) దుగ్గొండి – టీఆర్‌ఎస్‌

2) చాపలబండ – కాంగ్రెస్‌

3) తొగర్రాయి – టీఆర్‌ఎస్‌

4) మహ్మదాపురం – టీఆర్‌ఎస్‌

5) మల్లంపల్లి – ఏకగ్రీవం

6) ముద్దునూరు – టీఆర్‌ఎస్‌

7) నాచినపల్లి – టీఆర్‌ఎస్‌

8) పోనకల్‌ – టీఆర్‌ఎస్‌

9) వెంకటాపురం – స్వతంత్ర

10) తిమ్మంపేట – టీఆర్‌ఎస్‌

11) లక్మీపురం – టీఆర్‌ఎస్‌

12) రేకంపల్లి – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 01

స్వతంత్ర : 01

ఏకగ్రీవం : 01

మొత్తం ఎంపీటీసీలు : 12

………………………………….

నల్లబెల్లి మండలంలో…

1) నల్లబెల్లి – టీఆర్‌ఎస్‌

2) నారక్కపేట – టీఆర్‌ఎస్‌

3) నందిగామ – టీఆర్‌ఎస్‌

4) రంగాపురం – టీఆర్‌ఎస్‌

5) అర్షనపల్లి – టీఆర్‌ఎస్‌

6) రుద్రగూడెం – టీఆర్‌ఎస్‌

7) కన్నారావుపేట – టీఆర్‌ఎస్‌

8) రాంపూర్‌ – టీఆర్‌ఎస్‌

9) మేడపల్లి – కాంగ్రెస్‌

10) గోవిందాపురం – టీఆర్‌ఎస్‌

11) లెంకాలపల్లి – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 10

కాంగ్రెస్‌ : 01

మొత్తం ఎంపీటీసీలు : 11

…………………………….

నెక్కొండ మండలంలో…

1) నెక్కొండ 1 – కాంగ్రెస్‌

2) నెక్కొండ 2 – టీఆర్‌ఎస్‌

3) అప్పల్‌రావుపేట – టీఆర్‌ఎస్‌

4) పత్తిపాక – టీఆర్‌ఎస్‌

5) పెద్దకోర్పోలు – టీఆర్‌ఎస్‌

6) దీక్షకుంట్ల – టీఆర్‌ఎస్‌

7) గొల్లపల్లి – టీఆర్‌ఎస్‌

8) అలంకానిపేట – టీఆర్‌ఎస్‌

9) బొల్లికొండ – కాంగ్రెస్‌

10) బంజరుపల్లి – టీఆర్‌ఎస్‌

11) నాగారం – కాంగ్రెస్‌

12) వెంకటాపురం – ఏకగ్రీవం

13) రెడ్లవాడ – కాంగ్రెస్‌

14) సూరిపెల్లి – కాంగ్రెస్‌

15) టీక్యాతండా – కాంగ్రెస్‌

16) గుండ్రపల్లి – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 06

ఏకగ్రీవం : 01

మొత్తం ఎంపీటీసీలు : 16

…………………………………

ఖానాపురం మండలంలో…

1) ఖానాపురం 1 – టీఆర్‌ఎస్‌

2) ఖానాపురం 2 – టీఆర్‌ఎస్‌

3) అశోకనగర్‌ 1 – టీఆర్‌ఎస్‌

4) అశోకనగర్‌ 2 – టీఆర్‌ఎస్‌

5) బుధరావుపేట 1 – కాంగ్రెస్‌

6) బుధరావుపేట 2 – టీఆర్‌ఎస్‌

7) కొత్తూరు – టీఆర్‌ఎస్‌

8) మంగళవారిపేట – కాంగ్రెస్‌

9) ధర్మరావుపేట – కాంగ్రెస్‌

టీఆర్‌ఎస్‌ : 06

కాంగ్రెస్‌ : 03

మొత్తం ఎంపీటీసీలు : 09

……………………………………..

శాయంపేట్‌ మండలం.

1) శాయంపేట్‌ 1 – టిఆర్‌ఎస్‌

2) పెద్దకొడపాక 1 – టీఆర్‌ఎస్‌.

3) పెద్దకొడపాక 2 – టీఆర్‌ఎస్‌

4) మైలారం – టిఆర్‌ఎస్‌.

5) తహరపూర్‌ – టిఆర్‌ఎస్‌.

6) గట్లకనిపర్తి – టీఆర్‌ఎస్‌.

7) ప్రగతి సింగారం – టిఆర్‌ఎస్‌

8) పత్తిపాక – కాంగ్రెస్‌.

9) వసంతపూర్‌ – టిఆర్‌ఎస్‌

10) కాట్రపల్లి – టిఆర్‌ఎస్‌

11) కొప్పుల – టిఆర్‌ఎస్‌

12) శాయంపేట్‌ – టిఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 11

కాంగ్రెస్‌ : 01

మొత్తం ఎంపీటీసీలు : 12

……………………………..

పరకాల మండలం..

1) నాగారం – టిఆర్‌ఎస్‌

2) వెల్లంపల్లి – స్వతంత్ర అభ్యర్థి

3) మల్లక్కపేట్‌- టిఆర్‌ఎస్‌

4) పోచారం – టిఆర్‌ఎస్‌

5) లక్ష్మిపూర్‌ – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 04

స్వతంత్రం : 01

మొత్తం ఎంపీటీసీలు : 05

…………………………….

నడికూడ మండలం..

1) చర్లపల్లి – టిఆర్‌ఎస్‌

2) నార్లాపూర్‌ – టిఆర్‌ఎస్‌

3) చౌటుపర్తి – టిఆర్‌ఎస్‌

4) వరికోల్‌ – టీఆర్‌ఎస్‌

5) పులిగిల్ల – కాంగ్రెస్‌.

6) రాయపర్తి – కాంగ్రెస్‌.

7) నర్సక్కపల్లి – కాంగ్రెస్‌.

8) నడికూడ – కాంగ్రెస్‌

9) కంటాత్మకూర్‌ – స్వతంత్ర అభ్యర్థి.

10) కౌకొండ – టిఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 05

కాంగ్రెస్‌ : 04

స్వతంత్రం : 01

మొత్తం ఎంపీటీసీలు : 10

……………………………….

ఆత్మకూరు మండలం.

1) ఆత్మకూర్‌ టౌన్‌ – టిఆర్‌ఎస్‌

2) ఆత్మకూరు – టీఆర్‌ఎస్‌.

3) హౌజ్‌బుజుర్గు – టీఆర్‌ఎస్‌

4) నీరుకుళ్ల – టీఆర్‌ఎస్‌.

5) గుడెప్పుడు – కాంగ్రెస్‌.

6) పెద్దపూర్‌ – కాంగ్రెస్‌.

7) అక్కంపెట్‌ – కాంగ్రెస్‌.

8) చౌళ్లపల్లి – టిఆర్‌ఎస్‌

9) పెంచిలపెేట్‌ – టిఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 06

కాంగ్రెస్‌ : 03

మొత్తం ఎంపీటీసీలు : 09

……………………………..

దామెర మండలం.

1) దామెర – టిఆర్‌ఎస్‌

2) ల్యాదేళ్ల – టీఆర్‌ఎస్‌

3) ఉరుగొండ – టిఆర్‌ఎస్‌

4) దుర్గంపెట్‌ – టిఆర్‌ఎస్‌

5) ఒగ్లాపూర్‌ – కాంగ్రెస్‌

6) కొగిల్వాయి – టీఆర్‌ఎస్‌

7) పులుకుర్తి – టిఆర్‌ఎస్‌

8) పసరకొండ – కాంగ్రెస్‌.

టీఆర్‌ఎస్‌ : 06

కాంగ్రెస్‌ : 02

మొత్తం ఎంపీటీసీలు : 08

అరూరికి మంత్రి పదవి ఇవ్వాలి…

ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు మంత్రి పదవి కేటాయించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు కోరారు. గురువారం వర్థన్నపేట మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టివిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల అపద్భాంధువు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమంకోసం నిరంతరం కషి చేస్తు, నియోజకవర్గంలో నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తన సమస్యలుగా భావించే వారిని, దాదాపు రెండువేలకు పైగా నిరుద్యోగ యువత, యువకులకు ఉచిత శిక్షణ, ఉచిత భోజన, వసతి, పుస్తకాలు, రవాణా కోసం ఉచిత బస్‌పాస్‌ ఇప్పించిన ఘనత గట్టుమల్లు ఫౌండేషన్‌ ద్వారానే సాధ్యమైందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీవర్గంలో బలమైన మాదిగవర్గానికి చెందిన అరూరి రమేష్‌కి రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్‌కి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. రెండుసార్లు దాదాపుగా లక్ష మెజారిటీతో విజయం సాధించిన ఘనత, ఇటీవల కాలంలో వరంగల్‌ ఎంపి ఎన్నికల్లో భారీ మెజారిటీని అందించిన ఎమ్మెల్యే రమేష్‌ని మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తే వర్ధన్నపేట నియోజకవర్గ అభివద్ధికి, ప్రజలకు మరింత సేవా చేసుకునే భాగ్యం ముఖ్యమంత్రి కేసిఆర్‌, కేటిఆర్‌ కల్పిస్తారని, త్వరలో తెలంగాణ వికలాంగుల ఫోరం బందంతో కేసిఆర్‌కు వినతిపత్రం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్‌ రాష్ట్ర నాయకులు పిన్నింటి రవీందర్‌రావు, రావుల వెంకట్‌రెడ్డి, అడెపు సోమయ్య, వీరయ్య, సతీష్‌, సారయ్య, సంధ్య, రజనీ, ఎల్లయ్య, రాజయ్య, రమేష్‌, కుమార్‌, దివ్య తదితరులు పాల్గొన్నారు.

దయన్న సొమ్మెక్కడిదన్న- పీఎలకు లక్షల్లో ఖర్చు…?

ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు మంత్రి పదవి దక్కని ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ రాష్ట్రంలో అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చొరవతో మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కిన నాటి నుంచి ఎర్రబెల్లి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో తానొక్కడినే మంత్రిని అని టిఆర్‌ఎస్‌ సీనియర్లు, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నాడని అంతర్గతంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఎర్రబెల్లి తన బిల్డప్‌ను పెంచుకుని కాస్ట్లీ మంత్రి అనిపించుకోవడానికి తెగ ఆరాటపడిపోతున్నాడట. ఈ బిల్డప్‌లో భాగంగా ఎంతగా ఖర్చుపెట్టడానికైనా మంత్రి వెనుకాడడం లేదని బాగానే ప్రచారం జరుగుతోంది. నెలవారీగా మంత్రికి భారీగానే ఖర్చు అవుతున్న ఆ ఖర్చును అవలీలగా వేసి అవతల వేస్తున్నట్లు తెలుస్తోంది.

పీఎలకు లక్షల్లో ఖర్చు…?

పీఎలకు, పీఆర్వోలకు నెలవారిగా చెల్లించడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం బేఖాతర్‌ చేస్తున్న మంత్రి పీఎల నియామకం విషయంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడట. తన చుట్టూ ఉండేందుకు డజను మందికిపైగా పీఎలను నియమించుకున్న ఎర్రబెల్లి ఎంతమంది తన వెనకాల ఉండే అంతమంచిది అనే లెవల్‌లో భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పీఎలు, పీఆర్వోలకు 20వేలకుపైగానే జీతం చెల్లిస్తున్న మంత్రి నెలవారీగా ఈ మొత్తం ఎక్కడి నుంచి, ఎలా సమకూరుస్తున్నారో అర్థం కాని విషయం. ప్రభుత్వం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను పీఎలు, ఓఎస్డీగా అందజేయగా నలుగురు అటెండర్లను సైతం సమకూర్చిందట. వీరు సరిపోరనట్లుగా మంత్రి తన ఇష్టారీతిన నియమించుకుంటున్నారు. మంత్రి చుట్టూ ఉండేందుకు ఎవరిని పలకరించిన మంత్రి పీఎను అని అంటున్నారట. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు ఎవరు పీఎలో, ఎవరు కాదో సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నారట. ప్రస్తుతం మంత్రివర్గంలో అత్యధిక పీఎలు, అత్యధిక చెల్లింపులో మంత్రి దయాకర్‌రావే టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

సొమ్మెలా సమకూరుతుంది…?

ప్రభుత్వం నియమించిన పీఎలు, ఓఎస్డీ, అటెండర్లకు వేతనాలు చెల్లిస్తుంది మరీ. ఎర్రబెల్లి నియమించుకున్న ఇంతమంది పీఎలకు జీతాలు ఎలా సమకూరుతున్నాయో అర్థంకాని విషయం. లక్షల్లో సొమ్మును సమకూర్చడానికి మంత్రి ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారో తెలియడం లేదు. పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి కాంట్రాక్టర్లు, ఇతరులకు ప్రైవేట్‌ సిబ్బంది వేతనాల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎర్రబెల్లికి ఇంతగా ప్రైవేట్‌ సిబ్బంది ఎందుకని ప్రశ్న తలెత్తుతుంది. ఆంగ్ల భాషలో అంతగా పరిజ్ఞానం లేని మంత్రి శాఖపరమైన జిఓలను ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేసేందుకు సైతం భారీ మొత్తంలో వేతనాలు అందిస్తూ ట్రాన్స్‌లెటర్లను పీఎలుగా నియమించుకున్నారట. వీరి వేతనాలు కూడా తడిసి మోపడవుతున్న మంత్రి కదా సొమ్ము సులభంగానే చక్కబెట్టుకుంటున్నట్లు తెలిసింది. ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న మంత్రికి శాఖాపరంగా సైతం బాగానే గిట్టుబాటు అవుతుందని ఈ విషయంలో అందరి మంత్రులంటే ఎర్రబెల్లి ముందువరుసలో ఉన్నట్లు సమాచారం.

మీడియా మేనేజ్‌మెంట్‌లోనూ…

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియా మేనేజ్‌మెంట్‌లోనూ దూసుకువెళుతున్నారట. మేనేజ్‌మెంట్‌ అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రతిపక్షం సమాధానం చెప్పకుండా ఉండే కౌంటర్లు ఇవ్వడం అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. తాను ఏం చేసిన పాజిటివ్‌గా ప్రచారం చేసేలా, నెగిటివ్‌ ఉన్నా చూసిచూడనట్లు ఉండేట్లు మీడియాను మేనేజ్‌ చేస్తున్నాడట. మొత్తానికి పని తక్కువ…ప్రచారం ఎక్కువ అన్నట్లు. ఇక వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోనైతే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన ఇద్దరు మీడియా ప్రతినిధులకు నెలవారి అవసరాలు తీర్చేందుకు లక్షల్లో ముట్టజెప్పుతూ మీడియా అంతటిని మేనేజ్‌ చేసినట్లు ఎర్రబెల్లి సంతృప్తి చెందుతున్నడట. తనపై ఏ వ్యతిరేక వార్తలు వచ్చిన ఈ ఇద్దరు చక్కదిద్దేలా బాద్యతలు అప్పగించాడట.

ప్రభుత్వం ఇచ్చేది లక్షల్లో…ఖర్చుపెట్టేది కోట్లల్లో…

రాష్ట్రప్రభుత్వం మంత్రుల క్వార్టర్స్‌ మరమ్మత్తుల కోసం లక్షల రూపాయల్లో బడ్జెట్‌ కేటాయించింది. ఈ మరమ్మత్తులు ఈ బడ్జెట్‌లోనే ముగిసిపోవాలి కానీ మంత్రి మాత్రం తన క్వార్టర్‌ రిపేరు కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్నాడట. ఇంటీరియల్‌, ప్లోరింగ్‌ ఇతర ఆధునిక సదుపాయాలను ఈ ఇంటిలో ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఈ ఖర్చు అంతా పైల్‌పై సంతకం పెడితే చాలు ఈజిగా సమకూరుతుందని ఈ మరమ్మత్తు బాధ్యతను ఎంత ఖర్చు అయిన ఓ కాంట్రాక్టర్‌ భరిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.

ఎర్రబెల్లి ట్రస్ట్‌ పేరుతో ఆదాయం…?

మంత్రి ఎర్రబెల్లి తన ప్రైవేట్‌ సిబ్బంది, ఇతర కార్యక్రమాలకు భారీగా ఖర్చుపెట్టడానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్‌ ట్రస్ట్‌ మంచి ఆదాయవనరుగా ఉపయోగపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి తన పరపతితో ట్రస్ట్‌కు ఆదాయాన్ని భారీగానే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీని మూలంగానే మంత్రి ఎంత ఖర్చయిన చేయగలుగుతున్నారనే ప్రచారం ఉంది. మొత్తానికి మంత్రి పదవి లభించిన దగ్గర నుంచి ఖర్చు లెక్క చేయకుండా భారీగా వెచ్చిస్తున్న ఎర్రబెల్లికి సొమ్ము ఎలా సమకూరుతుందనే సందేహాలు పార్టీ వర్గాలతోపాటు అందరిలో కలుగుతున్నాయి. ప్రైవేట్‌ పీఎలు, పీఆర్వోలతో ఎర్రబెల్లి తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే పార్టీకి తలవంపులు వచ్చేలా ఉన్నాయని కొందరు సీనియర్లు అంటున్నారు. ఎర్రబెల్లిని కంట్రోల్‌లో పెడితే మంచిదని భావిస్తున్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్‌

సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి ప్రజల గుండెల్లో జననాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఆద్యుడు ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనియాడారు. హన్మకొండ భవానీనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసాచారి ఏర్పాటుచేసిన కేక్‌ను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కట్‌ చేశారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ వెండితెర వేల్పుగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతికాలంలోనే అన్నివర్గాల ప్రజల మన్ననలు స్వర్గీయ ఎన్టీఆర్‌ పొందారని అన్నారు. 1982కంటే ముందు నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌ మహిళా రిజర్వేషన్‌తోపాటు నిమ్న వర్గాలకు స్వాతంత్య్రం, సామాజిక, రాజకీయపరమైన అవకాశాలను కల్పించారని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో వ్యక్తిగత కక్షతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మోడీ, కేసిఆర్‌, జగన్లు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడిని ఓడించడమే ధ్యేయంగా అక్రమ పద్ధతులతో పనిచేశారని, తెలుగుదేశం పార్టీ వ్యక్తుల పార్టీ కాదని ప్రజల పార్టీ అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రం ఎంతో అభివద్ధి చెందిందని తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రానికి రెండుసార్లు లేఖలిచ్చారని తెలుగుదేశం పార్టీ ద్వారానే అన్నివిధాలుగా ఎదిగిన వారే తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడిని దెబ్బతీయాలని కుట్ర చేయడం సిగ్గుచేటని అన్నారు. సిద్ధాంతపరంగా నిస్వార్థంగా సేవచేసే వారే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజలు, బడుగు, బలహీనవర్గాలు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం రాజకీయ విశ్వరూపం ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం దొరికే ఎన్టీఆర్‌ అని ప్రజల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశమని అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల సంక్షేమానికి కషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పుల్లూరు అశోక్‌కుమార్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ జాటోతు సంతోష్‌నాయక్‌, మాజీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ బాబా ఖాదర్‌ అలీ, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు కంప వినోద్‌కుమార్‌, టిఎన్‌యుఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంజ వెంకట్రాజంగౌడ్‌, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ రహీం, ఉమ్మడి జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు హన్మకొండ సాంబయ్య, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కుసుమ శ్యాంసుందర్‌, జిల్లా నాయకులు బైరపాక ప్రభాకర్‌, గొల్లపల్లి ఈశ్వరాచారి, మాఢగాని మనోహర్‌, తోట రమేష్‌, అంబటి ప్రభాకర్‌, బర్ల యాకుబ్‌, సయ్యద్‌ బాబాభాషా, బైరి శేషాద్రి, రవీందర్‌ గుప్తా, చెంచు వేణు, శివరాత్రి వెంకన్న, నాయిని సత్యనారాయణరెడ్డి, కిన్నెర సుధాకర్‌, పిట్టల శ్రీనివాస్‌, కొంగర ప్రభాకర్‌, పోతరాజు అనిల్‌కుమార్‌, కాగితాల జయశంకర్‌, బోడా మోహన్‌బాబు, సాగంటి రాకేష్‌, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

‘ఈటెల’కు పీఎల తలనొప్పి…? ఈటెలను వదలనంటున్న పీఎలు?

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రస్తుతం పీఎల తలనొప్పితో గందరగోళానికి గురి అవుతున్నట్లు తెలిసింది. గతంలో మంత్రికి సన్నిహితంగా ఉన్నవారు, పీఎలుగా కొనసాగిన వారు ఉద్యోగం ఖాళీగా లేదు. ప్రస్తుతం తనకు పీఎల అవసరం ఎంతమాత్రం లేదన్న వినడం లేదట. వద్దుమొర్రో అని చెప్పిన మంత్రి పేషీ చూట్టే తిరుగుతూ పీఎలుగా పనిచేస్తాం అంటూ జబర్థస్తీ చేస్తున్నట్లు తెలిసింది. రెండోసారి అధికారంలోకి వచ్చి పాలన పగ్గాలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రులు, ఇతరులకు పీఎల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పీఎలు, ఓఎస్డీల విషయంలో తానే స్వయంగా వారిని నియమిస్తానని, ఎవరి ఇష్టాలకు వారు నియమించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అన్నట్లుగానే ఆ పనిని చేసి చూపించారు. కానీ సీఎం అంతగా ఆదేశించిన ప్రైవేట్‌ పీఎల విషయంలో మంత్రుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. ఒక్కో మంత్రి అవసరం ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చినట్లుగా ఎంతమందిని అంటే అంత మందిని పీఎలుగా నియమించుకుంటున్నారు. దీని మూలంగా ప్రజల్లో, నాయకులు, కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.

ఈటెలను వదలనంటున్న పీఎలు

టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత ఈటెల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. అప్పుడు కొంతమందిని పీఎలుగా నియమించుకున్నారు. అయితే ఈ పీఎల్లో ఓ ఇద్దరు పీఎలు ఆర్థిక అరాచకత్వాకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మీడియా నుంచి బయటకు వచ్చి ఈటెల పీఎగా కొనసాగిన వ్యక్తి ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బుతో అదృశ్యమయ్యాడని తెలిసింది. ఈటెల పదేపదే ప్రశ్నించిన సమాధానం చెప్పకుండా దాటవేసి మొహం చాటేసినట్లు సమాచారం. అయితే రెండోసారి టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఈటెల తిరిగి మంత్రి కావడంతో పీఎగా కొనసాగుతానని ఈటెలను బ్రతిమిలాడగా అవసరం లేదని చెప్పినా వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చూసుకుంటానని చెప్పి తిరిగి విధుల్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. సెటిల్‌మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ నిర్వహించేందుకు ఈ పీఎ ఈటెలను ఒప్పించి హైదరాబాద్‌లోని జివికె మాల్‌ వెనకాల రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించి ఓ కార్పొరేట్‌ కార్యాలయాన్ని తెరిచినట్లు తెలిసింది. ఇదే పీఎ గతంలో తన సొంత మీడియా సంస్థ పేరుతో ఆర్థికశాఖ నుంచి ప్రకటనల రూపంలో లక్షల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక వనరుల విషయంలో తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పడం వల్లే ఈటెల ఈ మాజీ మీడియా జర్నలిస్టు, ప్రస్తుత పీఎకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.

అప్‌ అండ్‌ డౌన్‌ పీఎ

ప్రస్తుతం మంత్రి ఈటెల వద్ద అప్‌ అండ్‌ డౌన్‌ పీఎ సైతం తన సెటిల్‌మెంట్ల ప్రతాపాన్ని చూపుతున్నట్లు తెలిసింది. అసలు పీఎ కాకున్న, మంత్రి పీఎగా ఒప్పుకోకపోయిన ఇతగాడు నిత్యం కరీంనగర్‌ నుండి హైదరాబాద్‌ సెక్రటేరియట్‌కు తిరుగుతూ పైరవీల పనులు చక్కబెడుతున్నట్లు తెలిసింది. మంత్రికే తెలియకుండా తాను పీఎనని అధికారులను పరిచయం చేసుకుని పనులన్నీ చేసుకుంటున్నట్లు తెలిసింది. టోకెన్‌ క్లియరెన్స్‌, బదిలీలు, ప్రమోషన్లు, సీఎం రిలీప్‌ఫండ్స్‌, ఎల్‌ఓసి, పనులు లేకుండా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి పేషీలో పనిచేసిన అధికారులను మచ్చిక చేసుకుని మెడికల్‌ సీట్లు సైతం ఇప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్న ఈ విషయాలేవి మంత్రి ఈటెల దృష్టికి రాకపోవడం గమనార్హం.

పొమ్మంటే…పోరు

ఈటెల వద్ద గతంలో పీఎలుగా పనిచేసిన వారు అవసరం లేదు అంటే కూడా వినడం లేదంటే. ఎందుకు అంతలా పీఎ పోస్టునే పట్టుకు వేలాడుతున్నారో అద్దం కావడం లేదు. ఈటెల సైతం వీరి విషయంలో సానుకూలంగా వ్యవహారించడం, అవసరం లేదని చెపితే ఏం జరుగుతుందోనని ఆలోచించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మంత్రికి సంబంధించిన కొన్ని రహాస్యాలు వీరి వద్ద ఉండడం వల్లే మంత్రి వీరి విషయంలో సీరియస్‌గా ఉండలేకపోతున్నారే ప్రచారం జోరుగానే కొనసాగుతుంది.

తెలంగాణలో మిశ్రమ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ 4స్థానాలను కైవసం చేసుకోగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలను చేజిక్కించుకోగా, 16కు 16 గెలుస్తామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 9స్థానాల వద్దే ఆగిపోయింది. ఇక ఎంఐఎం పార్టీ ఒకస్థానంతో సరిపెట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ 16కు 16 గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడంతో టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఖంగుతిన్న పరిస్థితి నెలకొంది. ప్రజలు ఊహించని విధంగా తెలంగాణలో బిజెపి కరీంనగర్‌లో బండి సంజీవ్‌, సికింద్రాబాద్‌ కిషన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ సోయం బాబురావులు గెలుపొందారు.

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలలో బిజెపి 4స్థానాలను గెలవడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ మొదటి నుండి ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఎలాగైనా కేంద్రంలో అధికారం చేపట్టి ప్రధాని కావాలనుకున్నారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా రావడంతో ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేకుండాపోయింది. కేసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జాతీయస్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కల కలగానే మిగిలిపోయింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు వెలువడిన ఫలితాలలో నల్గొండ నియోజకవర్గం నుండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), భువనగిరి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్‌), మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌), నిజామాబాద్‌ ధర్మపురి అరవింద్‌ (బిజెపి), కరీంనగర్‌ బండి సంజీవ్‌ (బిజెపి), ఆదిలాబాద్‌ సోయం బాబురావు (బిజెపి), సికింద్రాబాద్‌లో జి.కిషన్‌రెడ్డి (బిజెపి), పెద్దపల్లిలో నేతకాని వెంకటేశ్వర్లు (టిఆర్‌ఎస్‌), నాగర్‌కర్నూల్‌లో రాములు (టిఆర్‌ఎస్‌), వరంగల్‌లో పసునూరి దయాకర్‌ (టిఆర్‌ఎస్‌), మహబూబాబాద్‌లో మాలోతు కవిత (టిఆర్‌ఎస్‌), ఖమ్మంలో నామా నాగేశ్వర్‌రావు (టిఆర్‌ఎస్‌), మెదక్‌ కొత్త ప్రభాకర్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), మహబూబ్‌నగర్‌లో యన్నం శ్రీనివాస్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), జహీరాబాద్‌లో బివి పాటిల్‌ (టిఆర్‌ఎస్‌), చేవేళ్లలో రంజిత్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఓవైసి (ఎంఐఎం) కైవసం చేసుకున్నారు.

దేశంలో రెండోసారి మోడీ హవా : కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

దేశవ్యాప్తంగా మరోసారి భారతీయ జనతా పార్టీ సునామీ కొనసాగింది. 45రోజుల ఉత్కంఠ అనంతరం కొనసాగిన ఎన్నికల లెక్కింపులో దేశవ్యాప్తంగా మొదటి నుంచి బిజెపి తన సత్తా చాటింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచిన బిజెపి ఎవరి మద్దతు లేకుండానే అధికారపీఠం ఎక్కడానికి మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకుంది. మిత్రపక్షాల సహకారం లేకుండానే 299 స్థానాలను సాధించుకుంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 348 స్థానాలతో బిజెపి బలమైన శక్తిగా అవతరించింది. యుపిఎ తన మిత్రపక్షాలతో కలిసి 90స్థానాలను సాధించగా కేవలం 50 స్థానాలను సొంతంగా సాధించగలిగింది.

రెండోసారి మోడీ హవా

దేశంలో రెండోసారి మోడీ హవా కొనసాగింది. నోట్ల రద్దు, జిఎస్టీ తదితర అంశాలు మోడీకి ఎన్నికల్లో ప్రతికూలంగా మారి ఘోరపరాజయాన్ని పొందుతాడని ప్రతిపక్షాలు కలలు కంటే వాటినన్నింటిని కల్లలుగా మార్చి, దేశప్రజలు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం దగ్గర నుండి బిజెపి తన ప్రభావాన్ని చూడగలిగింది. దీంతో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కనున్నారు. బిజెపి విజయంతో పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది.

కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

ఈ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి ప్రధాని పీఠం ఎక్కవచ్చనే రాహుల్‌గాంధీ ఆశలపై బిజెపి నీళ్లు చల్లింది. ఘనవిజయంతో రాహుల్‌ ఆశలు అడియాశలయ్యాయి. ఎంపీగా కేరళ వయనాడ్‌లో, యుపి అమేథీలో పోటీ చేసిన రాహుల్‌ కేవలం కేరళ వయనాడ్‌లో మాత్రమే తన ప్రభావాన్ని చూడగలిగాడు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీతో తలపడిన రాహుల్‌ విజయం కోసం తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.

పశ్చిమబెంగాల్‌లోను బిజెపి హవా

పశ్చిమ బెంగాల్‌లో మొదటి నుండి దీదీ వర్సెస్‌ మోడీగా కొనసాగింది. అయితే ఇక్కడ బిజెపి అంతగా ప్రభావం చూపదని అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి 15స్థానాల్లో తన సత్తాను చాటుకుంది. తృణమూల్‌ 25స్థానాలతో సరిపెట్టుకుంది.

‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు – ఖాతా తెరవని జనసేన

‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ కుదేలయిపోయింది. రెండోసారి తప్పక అధికారంలోకి వస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్న చంద్రబాబు అంచనాలను వైఎస్సార్‌సీపీ పటాపంచలు చేసింది. అత్యధిక స్థానాలలో మెజార్టీని కనబరుస్తూ అధికారం దిశగా కదిలింది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి వైఎస్సార్‌సీపీ తన అధిక్యాన్ని ప్రదర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ 152 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఖాతా తెరవని జనసేన

ఆంధ్ర ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన పార్టీని ఆంధ్రప్రజలు ఎంతమాత్రం ఆదరించలేదు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. గాజువాకలో మొదట్లో పవన్‌ లీడ్‌లో ఉన్నా విజయం దక్కలేదు. మరోవైపు భీమవరంలో పవన్‌ మూడోస్థానంలో నిలవాల్సి వచ్చింది.

వెనుకంజలో మంత్రులు, మంత్రుల కుమారులు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. వైఎస్సార్‌సీపీ సునామీలో ఓటమి బాట పట్టారు. వీరితోపాటు కొంతమంది మంత్రుల కుమారులు సైతం ఓటమి పాలయ్యారు.

పార్లమెంట్‌ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ హవా

ఆంధ్రప్రదేశ్‌లోని పార్లమెంట్‌ స్థానాల్లో సైతం వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఫ్యాన్‌ మెరుపు వేగంతో దూసుకుపోయింది. టిడిపి, జనసేన పార్టీలు పార్లమెంట్‌ ఖాతా కూడా తెరవలేకపోయాయి. 25స్థానాల్లో వైఎస్సార్‌సీపీ లీడ్‌ ఇలాగే కొనసాగితే దేశంలో అతిపెద్ద మూడోపార్టీగా వైఎస్సార్‌సీపీ అంతరించి రికార్డు సృష్టించబోతుంది.

పసుపు అంచనాలు పటాపంచాలు

పసుపు అంచనాలు పటాపంచాలు

కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ చంద్రబాబు గెలుస్తాడని తమ అంచనాలు ప్రకటించగా నిన్న మొన్నటి వరకు పసుపు శిబిరంలో కొంత ఉత్సాహం నెలకొంది. ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి తన పార్టీ గెలుపుపై కాసింత అనుమానంతో ఉన్న చంద్రబాబుకు ఎగ్జిట్‌ పోల్స్‌ కొంత ఊరటనివ్వగా, బాబు గెలుస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు. ఆంధ్ర ప్రజలు మాత్రం అందుకు వ్యతిరేకంగా తీర్పునిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ 130 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుండగా టిడిపి కేవలం 29స్థానాల్లో తన అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కొంత మైర అయినా ప్రభావం చూపుతున్న జన సేన ఒకే ఒక స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం ఆంధ్రలో వైఎస్సార్‌సీపీ తన హావాను కొనసాగిస్తోంది. 13స్థానాల్లో అధిక్యాన్ని కనబరుచుతుండగా టిడిపి ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తానికి వైఎస్సార్‌సీపీ ఆంధ్రలో గెలుపు సునామీని సృష్టించబోతుందని స్పష్టమవుతోంది.

జీవితాన్నిచ్చిన గ్రామానికి సేవచేసే అవకాశం రావడం అదృష్టం : కౌడగాని కవితరాంబాబు

కష్టపడి వృద్ధిలోకి వచ్చిన కుటుంబంలో ప్రధాన పాత్ర ఆమెది.కోట్ల రూపాయల వ్యాపార వ్యవహారాలు చూసుకునే కుటుంబంలో కీలకపాత్ర కావడంతో వ్యాపార వ్యవహారాలే కాక అదనంగా కుటుంబ బాధ్యతలు ఆమె చూసుకునేది. తీరిక లేని జీవితం. కుటుంబం,వ్యాపారాలే ప్రధాన అంశాలుగా సాగిపోతున్న కుటుంబమే అయినా అమే ఆలోచన జీవితాన్నిచ్చిన గ్రామంపై పడింది. పలు కంపనీలకు మెనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటికి తన బాధ్యతలను పక్కనబెట్టి పూర్తి సమయాన్ని గ్రామ అభివృద్ధికి కేటాయించి గ్రామం,గ్రామ ప్రజల ఋణం తీర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో వ్యాపారవ్యవహారాలను పక్కనబెట్టి గ్రామసేవ చేయడానికి ముందుకోచ్చింది. అందుకోరకు ముందుగానే గ్రామ పరిస్థితులను అధ్యయనం చేసింది. అందు కోరకు గ్రామంలో ముందుగా నాయకులు,ప్రజల మధ్య సఖ్యతకు బాటలు వేసి విజయం సాధించింది. గ్రామంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులు,అవసరమైన కనీస సౌకర్యాలు,జరగాల్సి అభివృద్ధి గురించి తెలుసుకుంది.గ్రామసేవకు అమె పడుతున్న తపనను గుర్తించి ప్రజలు అమేకు ప్రథమపౌరురాలిగా పట్టంకట్టారు.పాలన బాధ్యతలు చెపట్టింది మొదలు ప్రభుత్వ నిధులు,పాలకుల సహకారం కోరకు ఎదురు చూడకుండా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా స్థానిక ప్రజలకు అవసరమైన అన్ని కార్యమ్రాలు నిర్వహిస్తూ గ్రామ రూపురేఖలు మార్చేందుకు పాలుపడుతూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతూ మరో నాలుగేళ్ళలో మా గ్రామాన్నే చూసి ఆదర్శ గ్రామానికి నిర్వచనంగా చెప్పుకోవాలనే లక్ష్యంగా ముందుకు వచ్చిన కొత్తపల్లి గ్రామ ప్రథమపౌరురాలు కౌడగాని కవితరాంబాబు తో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ…

నేటిధాత్రి ప్రతినిధి: గ్రామంలో ఎంతమంది జనభా ఉన్నారు, ఓటర్లు ఎంత మంది.?

సర్పంచ్‌:గ్రామంలో మొత్తం 2080 మంది జనాభా,1587 మంది ఓటర్లు ఈ గ్రామంలో ఉన్నారు.

ప్రతినిధి: పన్నుల వసూళ్ళ కార్యక్రమం ఎంత వరకు జరిగింది?

సర్పంచ్‌:ప్రస్తుతం గ్రామంలో స్థానిక సిబ్బంది,సంబంధిత అధికారులు,గ్రామ ప్రజల సహకారంతో 50 శాతం పన్నులు వసూళు చేయడం జరిగింది. పన్నుల వసూళ్ల గురించి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.దాని కోరకు సంబంధిత స్థానిక అధికారులు,సిబ్బందితో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం.పన్నుల చెల్లింపుల వలన జరిగే మార్పులను స్థానిక ప్రజలు గుర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పన్ను చెల్లింపుల్లో ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించి వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి గ్రామంలో 100శాతం పన్నులు వసూలు చేస్తాం.

ప్రతినిధి: ఈ వేసవిలో గ్రామ ప్రజలకు నీటి సమస్యలు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకున్నారా..?

సర్పంచ్‌: ప్రస్తుతానికి గ్రామంలో ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.అధే విధంగా గ్రామంలో నీటి సమస్యలు అధిగమించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు బోర్లను కూడా ఏర్పాటు చేశాం.వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు రాకుండా చూసేందుకు శాయశక్తులా మా పాలకవర్గం పాటుపడుతుందనే నమ్మకం ప్రజలకు ఉంది.ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శక్తివంచన లేకుండా పాటుపడతా.

ప్రతినిధి: గ్రామంలో మిసన్‌ భగీరథ పనులు పూర్తయ్యాయా…?

సర్పంచ్‌: గ్రామంలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి కాలేదు. మిషన్‌ భగీరథ పనులు ఇప్పటికే పూర్తి అయి ఉంటే మంచినీటి విషయంలో చాలా వెసులుబాటు ఉండేది.కాని పూర్తి అవ్వలేదు. మిషన్‌ భగీరథ పనుల్లో గ్రామంలో నల్లాలు ఎర్పాటులో జాప్యం జరుగుతుంది.పనులు జరగాల్సి ఉంది. సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళాం.వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రతినిధి: గ్రామంలో మరుగుదొడ్లు,ఇంకుడు గుంతల నిర్మాణాలు ఏ మేరకు పూర్తి అయ్యాయి.?

సర్పంచ్‌: గ్రామంలో ఇప్పటికే 70శాతం మరుగుదొడ్లు పూర్తి అయ్యాయి. మిగిలిన 30శాతం పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం.అవసరమైతే ఆర్ధిక ఇబ్బందులతో నిర్మాణాలు చేసుకోని వారికోరకు అవసరమైన ఆర్ధిక చేయూతను ఇస్తాం.అధే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణం కొరకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకుడుగుంతల నిర్మాణాల వలన కలిగే ప్రయోజనాలను గురించి ప్రజలకు చైతన్యం కలిగించే కార్యక్రమాలను నిర్వహించి మరుగుదొడ్లు,ఇంకుడుగుంతల నిర్మాణాలను పూర్తి చేస్తాం.

ప్రతినిధి: హరితహారం కార్యక్రమం కొరకు ఎలాంటి ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారు.?

సర్పంచ్‌: నూతన పంచాయితిరాజ్‌ చట్టంలో హరితహారం కార్యక్రమానికి ప్రత్యేకస్థానం ఉంది. హరితహారం కార్యక్రమం కోరకు ఇప్పిటికే గ్రామంలో ప్రత్యేక నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరీలో మొక్కలు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.అధే విధంగా గ్రామంలో హరితహారం కార్యక్రమం కొరకు గ్రామం ప్రారంభం దగ్గర నుండి చివరి వరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నాం. అధే విధంగా గ్రామం మొత్తంలో రోడ్లకు ఇరువైపులా అవసరమైన మొక్కలను నాటడం,గ్రామంలో ప్రతి ఇంటికి పూల,పండ్ల మొక్కలను పంపిణీ చేయడానికి ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నాం. అధే విదంగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి,మొక్కలను సంరక్షించడానికి ప్రథమ పౌరురాలిగా ప్రతి మొక్కకు ట్రీగార్డు ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలను సంరక్షణ కోరకు ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తులను నియమించడం జరుగుతుంది.

ప్రతినిధి:గ్రామంలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా.?

సర్పంచ్‌: గ్రామంలో ప్రధానం అంతర్గరోడ్ల నిర్మాణాలను ప్రధాన సమస్యగా ఉన్నాయి. వీటి నిర్మాణాలకు కోరకు ఇప్పటికే గ్రామంలో రోడ్ల నిర్మాణాలు లేని అన్ని వీధుల్లో మొరంతో మెటల్‌ రోడ్ల నిర్మాణం చేశాం.అధే విధంగా చాలాకాలంగా నిర్మాణ పనులు నిలిచిపోయిన గ్రామపంచాయితి నిర్మాణ సముదాయాన్ని తిరిగా నిర్మాణం చేయడం సమస్యగా ఉంది . అందుకే పాలన బాధ్యతలు చేపట్టగానే నిర్మాణం కోరకు అవసరమైన అన్ని పనులను మొదలు పెట్టడం జరిగింది.గ్రామంలో స్మశాన వాటిక పనులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని దృస్టికి రాగానే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు మొదలు పెట్టడం జరిగింది. గ్రామంలో పక్కా గృహాల సమస్య ఉంది. ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూం పథకం పరిధిలో గ్రామానికి 60 గృహాలు మంజూరు అయి ఉన్నాయి.వాటికి తోడు మరో 60 ఇండ్లు వస్తే గ్రామంలో ప్రజలకు పక్కా ఇండ్ల సమస్య తీరుతుంది.గ్రామంలో మరో ప్రధాన సమస్య ఆకేరువాగుపై చెక్‌డ్యాం నిర్మాణం జరగాల్సి ఉంది.వీలైనంత త్వరగా దీని నిర్మాణం ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్‌ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు కమ్యూనిటి భవనాల నిర్మాణాలు జరగాల్సి ఉంది. వీటిని మా పాలకవర్గం సమయంలో పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం.అధే విధంగా గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక వివో భవనం కావాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు,గ్రామంలో డంపింగ్‌ యార్డు,స్మశాన వాటికనిర్మాణాలు జరగాల్సి ఉంది. ఈవిషయంలో సంబంధిత అధికారులు వీలైనంత త్వరగ పనులు పూర్తి చేయాలి.గ్రామంలో సైడ్‌ డ్రైనేజిల సమస్య కూడా తీవ్రంగా ఉంది.

ప్రతినిధి:గ్రామంలో విద్యాపరమైన అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు.?

సర్పంచ్‌: గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. దాని కోరకు ప్రత్యేకంగా ఈ నెల 20వ తేదిన గ్రామం నుండి విద్యావంతులుగా ఉన్న వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు చేయాల్సిన కార్యక్రమాలను గురించి చర్చిస్తాం. అధే విధంగా ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు గ్రామ విధ్యావంతులు,సర్పంచ్‌,పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి,ప్రైవేటు పాఠశాల వద్దు- ప్రభుత్వ పాఠశాల ముద్దు అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించే కార్యక్రమం చేయబోతున్నాం. గ్రామంలో విద్యార్ధుల భవిష్యత్తుకు భరోసాగా వారికి స్వంత ఖర్చులతో వారి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధేవిధంగా విద్యకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలను దత్తత తీసుకొనే ఆలోచన ఉంది.ప్రజల సహకారం ఉంటే ఈ కార్యక్రమం తప్పక విజయవంతం అవుతుంది. విజయవంతం చేస్తాం

ప్రతినిధి: మీ విజన్‌ ఏమిటి..?

సర్పంచ్‌: గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే లక్ష్యంతోనే సర్పంచ్‌గా పోటి చేయడం జరిగింది. ంశంలో వారి అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు నాకు సహకరిస్తారనే నమ్మకం నాకుంది.అందుకే గ్రామానికి నా శక్తివంచన లేకుండా సేవ చేయాలనే పట్టుదలతో ఉన్నాను.గ్రామంలో వందశాతం అక్షరాస్యత సాదించే దిశగా అడుగులు వేస్తున్నాం.కాని ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధించి విజయానికి నిర్వచనంగా చెప్పుకునే స్థాయికి గ్రామాన్ని తీసుకెళ్ళడే లక్ష్యంగా పని చేస్తా.గ్రామంలో ప్రజలు అభివృద్ధి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో జీవించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలనేదె మా ప్రాధాన లక్ష్యంగా ఎంచుకుని తద్వారా ఆదర్శ గ్రామంగా తీర్చదిద్దుతా.అధే విధంగా గ్రామంలో యువతకు ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలతో ఒక లైబ్రరి ఏర్పాటు,అర్హులైన యువతకు ఉపాధి కల్పించేందకు ప్రత్యేక కార్యక్రమాన్ని చెపట్టడం,గ్రామంలో ఒక కళ్యాణ మండపం నిర్మాణం దీని కోరకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాం.నిర్మాణం కోరకు తెలిసిన దాత 5లక్షల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది.అధే విధంగా గ్రామాన్ని నిజమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను సమయాణుగుణంగా నిర్వహించి పూర్తి ఆదర్శ గ్రామంగా నిర్మాణం చేసి ప్రజల మన్ననలు పొందుతాం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు డిపాజిట్‌ గల్లంతే : పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి.

ఎన్నికలు అంటేనే కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుడుతోందని, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లతో కలిసి మంగళవారం నామినేషన్‌ ధాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని..ఎన్నికలు ఏవైనా విజయం టిఆర్‌ఎస్‌ పార్టీదేనని అన్నారు. ఓటమి భయంతో రాష్ట్రంలో ప్రతి ఎన్నికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుందని విమర్శించారు.

రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో నిలపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కషి చేస్తుంటే..కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ..అభివద్ధి నిరోధకులుగా మిగిలిపోతున్నారని ఆరోపించారు. ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహాకరించాలని సూచించారు. అంతకు ముందు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచంపల్లి, అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు బండా ప్రకాష్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్‌లు, పలు కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రజాకవి కాళోజి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుంది : పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు

నల్లబెల్లి మండలంలో జరుగుతున్న మండల పరిషత్‌ ,జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్షంగా అన్ని స్థానాలతో పాటు జడ్పీటిసి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అని నర్సంపేట శాసన సభ్యులు  .శుక్రవారం నర్సంపేట డివిజన్‌లోని ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ రెండవ విడత ఎన్నికలు జరిగాయి. నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి నల్లబెల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి పెద్ది స్వప్నతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ గత ఇరవైఅయిదు సంవత్సరాలుగా నల్లబెల్లి మండల ప్రజలకు ప్రజాసేవ చేస్తున్నానని, ఇక్కడి నుండే తనకు రాజకీయ అవకాశం వచ్చిందని, నల్లబెల్లి మండల ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని తెలిపారు. తన సతీమణి స్వప్నకు అధిష్టానం జడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం కల్పించిందని అన్నారు .

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నా సతీమణికి జడ్పీటీసీ అవకాశం దక్కనందున కొందరు ఆరోపణలు చేశారని తెలుపుతూ తన ప్రచారానికి ఒక్కరోజు కూడా రాలేదన్నారు .అయినప్పటికీ మండల ప్రజలు ,ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఎంతో విశ్వాసంతో ఆమె గెలుపు కోసం ఎవరికి వారిగా కషి చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని అన్ని జడ్పీటీసీ స్థానాలలో నల్లబెల్లి నుండి పదివేల మెజారిటీ వస్తుందని విశ్వాసంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్‌ పదవిపై వస్తున్న ప్రచారం పట్ల అడుగగా అధిష్టానం మేరకు నడుచుకుంటానని ఇప్పటికీ త్పత్తి కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వివరించారు. జడ్పిటిసి అభ్యర్థి పెద్ది స్వప్న సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు సెవా వేసేందుకు తెలంగాణ ఉద్యమకారురాలుగా ఎన్నికల బరిలో దిగానని ఆమె తెలిపారు. మండల ప్రజలు, పార్టీ శ్రేణులు తనకు జడ్పిటిసిగా పట్టం కట్టడానికి ఏకాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ బాటలో నడుస్తామని తెలుపుతూ పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని స్వప్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి సర్పంచ్‌ రాజారాం, నాయకులు సట్ల శ్రీనివాస్‌ గౌడ్‌, దార్ల రమాదేవి ,మాజీ సర్పంచ్‌ కోటిలింగాచారిలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు .

ఎంపి అభ్యర్థికి బహిరంగ లేఖ

ఎంపి అభ్యర్థికి బహిరంగ లేఖ

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఖర్చుల డబ్బులను ఇవ్వాలని కోరుతూ బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షుడు కందగట్ల టాక రాజు ఎంపీ అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌కు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా బహిరంగ లేఖను రాసారు .ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మహబూబాబాద్‌ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో మహిళలతో రోడ్‌షోను నిర్వహించారని తెలిపారు .కోలాటం మహిళలకు ఒక్కరికి వంద రూపాయల చొప్పున 550 మందికి 55000 అలాగే మంచినీటి ప్యాకెట్ల కోసం 800రూపాయలు ఖర్చు అయ్యాయని ,అందుకు పార్లమెంటు అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ , నర్సంపేట ఎన్నికల ఇంచార్జి బోడా వీరన్న ముప్పైనాలుగు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగతా 26300 రూపాయలను ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ రాజు ఆరోపించారు.

వీరన్నను ఎన్నికల ఖర్చుల మిగతా డబ్బులు ఇవ్వమని అడిగితే గతంలోనే ఇచ్చారంటూ దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని ఈ విషయంపై అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ కు వివరించి తెలుపగా గతంలోనే మొత్తం డబ్బులను వీరన్నకు ఇచ్చామని తెలిపినట్లు ఆయన తెలిపారు. కోలాటం సంబంధించిన మహిళలు ప్రతిరోజూ తమ ఇంటి వద్దకు వచ్చి అడుగుతున్నారని, దీంతో దిక్కులేని స్థితిలో మనస్తాపానికి గురైతున్నట్లు రాజు వివరించారు. వెంటనే డబ్బులను జిల్లా పార్టీ అధిస్థానం ఇప్పించాలని కందగట్ల రాజు కోరారు.

ఇక్కడ బిజెపి ఉందా…చెప్పుతో కొడతా : దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి

 దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి

శాయంపేట మండలకేంద్రంలో రెండవ విడత జరుగుతున్న ప్రాదేశిక పోలింగ్‌ సందర్భంగా శాయంపేట-2 ఎంపీటీసీ బిజెపి అభ్యర్థి కోడెపాక స్వరూప ఓటర్లకు బిజెపికి ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి, శాయంపేట జడ్పీటిసి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర జ్యోతి మండలకేంద్రంలో స్వరూప వద్దకు వెళ్లి ఇక్కడ ఇంకా బిజెపి ఉందా…బిజెపి ఎక్కడిది…బిజెపికి ఓటు వేయాలని అడుగుతున్నావా…చెప్పుతో కొడతా…అంటూ దళిత మహిళ అయిన స్వరూపను ఇష్టం వచ్చినట్లు తిట్టిందని బిజెపి ఎంపీటీసీ అభ్యర్థి కోడెపాక స్వరూప తెలిపారు.

ఈ సందర్భంగా కోడెపాక స్వరూప మాట్లాడుతూ శుక్రవారం పోలింగ్‌ కేంద్రం వద్ద తాను ఓటర్లకు పువ్వుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా గండ్ర జ్యోతి తన వద్దకు వచ్చి దళిత మహిళనైన నన్ను చెప్పుతో కొడతానని ఇష్టంవచ్చినట్లు తిట్టిందని ఆరోపించింది. గతంలో తాను ఉపసర్పంచ్‌గా పనిచేసిన విషయాన్ని కూడా మరచి నన్ను చెప్పుతో కొడతానని అనడం టిఆర్‌ఎస్‌ పార్టీ దౌర్జన్యానికి అగ్రకుల అహాంకారానికి గండ్ర జ్యోతి వ్యవహారించిన తీరే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ప్రజలే మా కుటుంబం…సేవయే కర్తవ్యం : ఐనవోలు-2 ఎంపిటిసి అభ్యర్ధి మార్నేని మధుమతి రవిందర్‌రావు

ఐనవోలు (వర్ధన్నపేట), నేటిధాత్రి: కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూనే వారు సంతృప్తి చెందుతున్నారు. స్థానికంగా మార్నేని వంశస్థులు చేసిన ప్రజాసేవను వారసత్వంగా స్వీకరించి సమాజసేవలోనే తరిస్తున్నారు. రాజకీయ జీవితంలో నిజమైన నాయకత్వ లక్షణాలతో ప్రజల గుండెల్లొ నిలిచిన ఎంపిపి మార్నేని రవిందర్‌రావు సేవలు మరోమారు ప్రజలు ముక్తకంఠంతో కోరకున్న తరుణంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి అవకాశం మహిళలకు రావడంతో సేవ చేయడానికి ప్రజల కోరిక మేరకు ఎంపిటిసి బరిలో ఉన్న మార్నేని మధుమతి రవిందర్‌రావుతో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ

నేటిధాత్రి ప్రతినిధి: మార్నేని కుటుంబం నుండి ప్రజాజీవితంలో రెండు దశాబ్దాల కాలంగా ఉన్నారు.ప్రస్తుతం అభ్యర్ధిగా పోటిలో ఉన్నారు ప్రజల స్పందన ఎమిటి?

మధుమతి రవిందర్‌రావు: మార్నేని వంశంలో సభ్యురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తా.ఎందుకంటే సమాజసేవలో ప్రజల బాగోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే అదృష్టం దక్కింది. చిన్నతనం నుండే సమాజసేవ గురించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి అవగతం చేసుకునే అవకాశం మా కుటుంబం నుండే వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా ప్రజాక్షేత్రంలో దశాబ్దాల కాలంగా ప్రజాప్రతినిధులుగా ఉండడం వలన ప్రజాసేవలో ప్రత్యక్ష అనుభవం ఉంది. మార్నేని కుటుంబంలోకి సభ్యురాలిగా వచ్చిన దగ్గర నుండి మరింత దగ్గరగా ప్రజలతో ఉండే అవకాశం నాకు దొరికింది.నా జీవితంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక అభ్యర్ధిగా పోటిలో ఉన్న విషయానికొస్తే నా అభ్యర్ధిత్వం నేను కోరుకున్నది కాదు స్థానిక ప్రజలు నేను ఇంతకాలం వారికి చేసిన సేవలు ప్రత్యక్షంగా చేసేందుకు నాకు ఇచ్చిన అవకాశంగానే భావిస్తున్నా.నేను పోటి చేసేది పదవుల కోరకు ప్రజాసేవను మరింత బాధ్యతగా స్వీకరించడానికి. వారు కోరి ఇచ్చిన అభ్యర్ధిత్వం కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గోన్నారు. వారి అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

ప్రతినిధి:ప్రజలు మీ నాయకత్వాన్ని కోరకోవడం గురించి మీ అభిప్రాయం ?

మధుమతి రవిందర్‌రావు: ప్రజలకు ఇంతకాలం చేసిన సేవయే నన్ను నాయకత్వ విషయంలో ప్రతిపాధించేలా చేసింది. వారు నా నుండి కోరకుంటున్న సేవ విషయంలో మరింత బాధ్యతగా ఉంటాను. సాధారణ గృహిణిగా ఉన్నప్పటికి నాభర్త ఇంతకాలంగా చేస్తున్న సమాజ సేవలో పరోక్షంగా పాలుపంచుకునే అవకాశం లభించింది. ఎట్టి పరిస్థితుల్లో మండల కేంద్రం నిలిచిపోకూడదనే అభిప్రాయంతో నాపై నమ్మకంతో ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని పోదడం పట్ల నేను చేసిన సేవలకు లభించిన నమ్మకం. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను.

ప్రతినిధి:ప్రజలు ఆశిర్వదిస్తే మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏమిటి.?

మధుమతి రవిందర్‌రావు: ఎంతోకాలంగా ప్రజలు కోరుకున్న ఐనవోలు గ్రామం మండలంగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మండల వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. స్థానికంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం. పంచాయితీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిల సహకారంతో అభివృద్ధి కోరకు అవసరమైన నిధులు తీసుకువచ్చి ఆదర్శమండల కేంద్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version