ఉప్పల్ లో గు’లాబీ’ కింద ముల్లు?

 

బేతి వెనకాల బొంతు తీస్తున్న గోతులు?

సొంత పార్టీకే వెన్నుపోట్లు?

పార్టీ బలంగా వున్న చోట లుకలుకలు?

 

కారు జోరుకు వేస్తున్న బ్రేకులు?

సజావుగా సాగాల్సిన చోట సృష్టించుకుంటున్న సమస్యలు?

బేతిని బద్నాం చేస్తూ, టిక్కెట్టుపై బొంతు ఆశలు?

ఎదరులేని చోట తిరుగులేని కారుకు తూట్లు?

ప్రతి పక్షాలకు అనుకూలం కానున్న నాయకుల తీరు?

ఏం జరుగుతుందో అని కలవరపడుతున్న కార్యకర్తలు?

ఎటు వైపు నిలబడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు?

బలం లేని చోట బలం పెంచుకునేందుకు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. పార్టీ బలంగా వుంటే చాలు మనం బలంగా వున్నట్లే అనుకోవాలి. అంతే కాని బలంగా వున్న చోట పార్టీని బలహీనపర్చే పనులు కూడ చేయొచ్చని అక్కడక్కడ టిఆర్‌ఎస్‌ నాయకులే నిరూపిస్తున్నారనడంలో సందేహం లేదు. అలాంటి నియోజకవర్గాలలో ఉప్పల్‌ ఒకటి. తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోట. ఎన్నికలు ఏవైనా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిఆర్‌ఎస్‌ తప్ప మరొక పార్టీకి విజయావకాశాలు లేని నియోజకవర్గం. అలా పార్టీ వేళ్లూనుకోవడానికి నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చేసిన కృషి సామాన్యమైంది కాదు. జై తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమం మొదలు పెట్టి జెండా ఎత్తుకున్న నాడు ఉప్పల్‌లో గులాబి జెండాకు జై కొట్టింది బేతి సుభాష్‌రెడ్డి. గులాబీ జెండాను మోసిన నాయకుడు బేతి సుభాష్‌రెడ్డి. అప్పటి రాజకీయ పరిస్ధితులను సైతం ఎదిరించుకంటూ, జై తెలంగాణ నినాదం చేశాడు. జెండా పట్టుకొని వీది వీధి తిరిగారు. ప్రజలను చైతన్యం చేశారు. 2004 ఎన్నికల వరకు ఉప్పల్‌లో తెలుగుదేశం పార్టీదే హవా…ఆ తర్వాత కాంగ్రెస్‌…వామపక్షాలు బలంగా వుండేవి. 2001లో టిఆర్‌ఎస్‌ పురుడుపోసుకున్నప్పటి నుంచి బేతిసుభాష్‌రెడ్డి ఎత్తిన జెండాను, ఎత్తిన పిడికిలి దించలేదు. పార్టీని పెంచారు. పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాడు. 

2014 ఎన్నికల్లో కూడా బిజేపి తెలుగుదేశం కూటమి మూలంగా కారు గెలుపు చేజారిందే గాని, ఆ ఎన్నికల్లో కూడా బేతి సుభాష్‌ రెడ్డి గెలిచేవారు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో తిరిగి 2018 టిక్కెట్‌ తెచ్చుకొని, ఎన్నికల్లో గెలిచి నిలిచారు. తన సుధీర్ఘ ప్రస్ధానాన్ని ప్రజలు గుర్తించేలా చేసుకున్నారు. 2001 నుంచి, 2009 డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రకటన వచ్చేవరకు కూడా హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ బలంగా లేదు. కాని నగర శివారు ప్రాంతాలుగా వున్న ఉప్పల్‌ లాంటి ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌ బలంగానే వుంది. అందుకు ఆది నుంచి జెండాలు మోసిన వారి కృషి కూడా కారణం. అలాంటి ఉప్పల్‌ టిఆర్‌ఎస్‌లో ఇప్పుడు ఆధిపత్య పోరు మొదలైంది. 2014 ఎన్నికల సమయంలో తన రాజకీయ జీవితం ఏమిటో…తన ప్రస్ధానమేమిటో కూడా తెలియని బొంతు రామ్మోహన్‌ , జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కార్పోరేటర్‌గా పోటీ చేసేందుకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మంత్రి కేటిఆర్‌ చొరవ మూలంగా మేయర్‌ పదవి బొంతు రామ్మోహన్‌కు కట్టబెట్టారు. ఐదేళ్లపాటు జిహెచ్‌ఎంసి మేయర్‌గా పనిచేశారు. 2018 ఎన్నికల్లో బొంతు రామ్మోహన్‌ ఉప్పల్‌ నుంచి పోటీ చేయాలని ఉబలాటపడ్డాడు. 2001 నుంచి పార్టీ పట్టుకొని, నాయకులను వేలు పట్టుకొని నడిపించుకుంటూ, ఉద్యమాలు చేసుకుంటూ, పోరాటాలలో ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ సాగిన ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని టిక్కెట్టు ఇవ్వాలని బొంతు రామ్మోహన్‌ పట్టుపట్డాడు. 

ఒక దశలో సెల్‌ ఫోన్‌ ఆఫ్‌ చేసుకొని అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లారన్న ప్రచారం కూడా జరిగింది. తర్వాత మంత్రి కేటిఆర్‌ భుజ్జగింపులతో తన ఆలోచన ఉపసంహరించుకున్నారు. కాని ఆ ఎన్నికల్లో బేతి సుభాష్‌రెడ్డికి మనస్పూర్తిగా పనిచేయలన్నది జగమెరిగిన సత్యమే అని పార్టీ నాయకులే అంటున్నారు. ఎప్పుడైతే తనకు టిక్కెట్‌ దక్కలేదో అప్పటినుంచి బొంతు రామ్మోహన్‌ కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొంటూ ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో రికార్డు స్ధాయిలో వర్షాలు కురిశాయి. జన జీవనం అస్ధవ్యస్ధమైన సందర్భం చూసిందే…అలాంటి సమయంలో కాలన్నీల్లో నీరు చేరడం, అవి ఇళ్లలోకి చేరుకోవడం జరిగింది. కొన్ని కాలనీలు పూర్తిగా జలదిగ్భందనంలో చిక్కుకున్నవి. ఆ సమయంలో ఎమ్మెల్యే బేతి సుబాష్‌రెడ్డి ఎంతో చొరవతో, ప్రజలకు అండగా వుండే ప్రయత్నం చేశారు. ఆదుకునే ప్రయత్నం చేశారు. కాలనీలలో బోట్లు వేసుకొని మరీ తిరిగారు. ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేశారు. ఆ నీళల్లో ఎలాంటి విష పురుగులైనా వుండొచ్చు. అయినా ఆయన వెరవలేదు. ప్రజలు ముఖ్యమనుకున్నాడు. బోట్లు వేసుకొని, అధికారులను వెంట బెట్టుకొని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు క్షేత్ర స్ధాయి పర్యటనలు చేశారు. 

ఇలాంటి సందర్భాలను ఎవరైనా సహజంగా ప్రశంసించాలి. కాని సహాయం చేసేందుకు ముందుకొచ్చిన బేతిని అభాసుపాలు చేయడానికి ఇది కూడా అదునే అనుకొని రాజకీయం చేశారు. సహజంగా అలాంటి సమయంలో ప్రజలనుంచి కొంత వ్యతిరేకత ఎదురౌతుంది. అయినా బేతి సుభాష్‌రెడ్డి ప్రజల్లోనే వున్నాడు. వారికి సహాయ సహకారాలు అందించాడు. మరి ఆ సమయంలో బొంతు రామ్మోహన్‌ ఎక్కడున్నాడన్నదానిపై కూడా పెద్ద చర్చే జరిగింది. అప్పార్టుమెంట్లులోని మహిళలు మాట్లాడిన మాటలను పెద్దఎత్తున వైరల్‌ చేసిందెవరో తెలిసిందే..? అలా ఎమ్మెల్యేను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చిన సంగతి చూసిందే. ఇదిలా వుంటే బొంతు రామ్మోహన్‌ సతీమణి కార్పోరేటర్‌ శ్రీదేవి సైతం అడుగడుగునా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే వస్తున్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. 

ఇక తాజాగా ఈసారి ఉప్పల్‌ టిక్కెట్టు నాదే అంటూ, తనకు పార్టీనుంచి ఆదేశాలు అందాయంటూ ప్రచారం చేసుకుంటూ ఉప్పల్‌ నాయకులను, కార్యకర్తలను బొంతు రామ్మోషన్‌ గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధాన విమర్శ. గత కార్పోరేటర్లను ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి ఎంత ప్రోత్సహించినా, వారిలో కొందరికి ఎమ్మెల్యే మీద కొంత అసంతృప్తి వుంది. దాన్ని ఆసరాగా చేసుకొని వారితో ఉప్పల్‌ రాజకీయంలో బొంతు వేలు పెడుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఏ ఎన్నిక కనిపించినా వాటిని గురించి ఆశించడం బొంతు రామ్మోహన్‌కు బాగా అలవాటైందని కూడా పార్టీలో చెప్పుకుంటున్నారు. మొదట ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించాడు. కాని నెరవేరలేదు. దాంతో ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్నాడు. అదీ కుదరలేదు. ఇక జిల్లాల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుల పదవులు పంపకాలు జరిగాయి. అప్పుడు కూడా మేడ్చల్‌ జిల్లా అధ్యక్ష పదవి ఆశించాడు. అక్కడా ఆశ నెరవేరలేదు. మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడై అక్కడినుంచే పోటీ చేస్తే ఎలా వుంటుందన్న దానిపై కొంత కాలం కసరత్తు చేశాడు. కాని కుదలేదు. ఇక మళ్లీ ఉప్పల్‌ మీద పడ్డాడు. ప్రతిపక్షాలను ఏగేస్తూ కూడా రాజకీయం చేస్తున్నాడని పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారట. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం చేసే స్ధాయిలో వుండి, బొంతు రామ్మోహన్‌ పార్టీని ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదంటున్నారు. దక్కితే టిక్కెట్టు తనకే దక్కాలి…లేకుంటే బేతికి దక్కకూదడదు…దక్కినా గెలవకూడదన్నంత ధోరణిలో బొంతు రామ్మోహన్‌ రాజకీయాలు చేస్తున్నాడని సమాచారం. ఉప్పల్‌లో ఇలా బొంతు రామ్మోహన్‌ చర్యల మూలంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ప్రతిపక్షాలకు బలం చేకూరే పరిస్ధితి లేకుండా పోదు…? ఇప్పటికైనా పార్టీ అధిష్టానం వెంటనే స్పందించకపోతే, పార్టీకి తీవ్రనష్టం తప్పదంటున్నారు.

యశ్వంత్ సిన్హా కు ఎంపీ రవిచంద్ర స్వాగతం

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పలువురు మంత్రులు, ఎంపీలు సిన్హా కు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయనను నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీతో తోడ్కొని వచ్చారు. అనంతరం అక్కడ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా భోజన విరామ సమయంలో సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాల గురించి చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీ రవిచంద్ర కూడా పాల్గొన్నారు.

మహాదేవపూర్ పంచాయతీరాజ్ శాఖ అవినీతికి అడ్డా.!?

ఏ,ఈ, రాజేందర్ రెడ్డి లీలలు.

ఏ ఈ రాజేందర్ రెడ్డి వద్దే అందరి  చిట్టా, సంవత్సరాలుగా మేపుతున్న నాకు ఏమీ కాదు,!

రోజు కు ఒకటి తెరపైకి అవినీతి భాగవతం.

ఈ ఈ, ఎస్ ఈ లు పాత్రధారులు కాగా,ఈ ఎన్ సి కమిషన్కు కక్కుర్తి పడి నో యాక్షన్,!?

మహాదేవపూర్ కుంభకోణంపై బాధ్యత వహించేది ఎవరు,!?

అవినీతి లో కూడుకపోయి ఉన్న పనులను సాక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ఇన్చార్జి ఏ ఈ పై చర్యలు తీసుకొని ఇతర ఏ ఈయనకి బాధ్యతలు అప్పగించాలి. 

మహాదేవపూర్-నేటిధాత్రి:-

పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మండలంలో అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ మండలంలోని పంచాయతీరాజ్ శాఖ నిధుల దుర్వినియోగానికి ఒక అడ్డగా మారి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జీబుల్లోకి మళ్లించుకోవడం జరిగింది.

నిధుల దుర్వినియోగ వ్యవహారంలో ఇప్పటికే 97 రోజుల నుండి 20వేల నుండి రెండున్నర లక్షల రూపాయల వరకు కమిషన్ పేరుతో బాధితులకు పీడించడం జరిగిందని బాధితులు మీడియా ముందుకు రావడం జరిగింది మరోపక్క తాజాగా పని చేపట్టకుండానే 1,38,000 బిల్లును రికార్డ్ చేయడం వాటికి సంబంధించిన చెక్కును విత్ డ్రా చేసుకొని నిధులను తీసుకోవడం జరిగింది. ఇక నాసిరక పనులకు సంబంధించి మండలంలో ఇప్పటికే వందల నాసిరకం పనులు చేపట్టి ఉన్నాయని సాక్షాలు సైతం ప్రజల ముందుకు పెట్టడం జరిగింది ఇక సాక్షాలు తారుమారు చేసే క్రమంలో మూడు నెలలుగా ఆగి ఉండి శిథిల అవస్థకు వచ్చిన పనులు పలు రహదారులు కాంకేర లేకుండానే ఉన్నప్పటికీ వాటిపై పాల్ తీన్మార్చి నిధుల దుర్వినియోగానికి సాక్షాలు ఉండకూడదని గుట్టు చప్పుడు కాకుండా పనులను సాగించడం జరుగుతుంది. గా ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణంలో  పాత్రధారుని తను ఒక్కడే కాదని ఉన్నత అధికారుల కు సైతం వీళ్ళ తరబడి పోషిస్తున్నానని తనకు ఏమీ కాదని బినామీలతో చెప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 

 *మహాదేవపూర్ పంచాయతీరాజ్ శాఖ అవినీతికి అడ్డా.!?* 

 

ప్రభుత్వ నిధులు దుర్వినియోగంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలోని మండలాల్లో అవినీతికి అడ్డా అంటే మహదేవ్పూర్ పంచాయతీరాజ్ శాఖ అని కోట్ల కుంభకోణం వ్యవహారాన్ని శ్రీకారం చుట్టిన అధికారి రాజేందర్ రెడ్డి పై నేటి వరకు చర్యలు తీసుకోలేదంటే అవినీతి సొమ్ములు ఇప్పటికీ ఏరులై పారేలా చేయడం జరిగిందని చెప్పవచ్చు. పంచాయతీరాజ్ శాఖ అవినీతి విషయానికొస్తే మండలంలో ఇప్పటివరకు ఏ ఈ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల నిర్మాణాలు సెంట్రల్ లైట్ డ్రైనేజ్ నూతన భవనాలు భవనాల మరమ్మతు ఇలాంటి పనులకు సంబంధించి ఏ ఈ రాజేందర్ రెడ్డి తన బినామీ కాంట్రాక్టర్లకు మాత్రమే పెద్ద మొత్తంలో పనులు అందించడం జరిగింది. విధాబీల ద్వారా లక్షల రూపాయల కమిషన్ కొరకు పలు రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో మండలానికి వచ్చిన బినామీ కాంట్రాక్టర్లు పదుల సంఖ్యలో పనులు చేపట్టుకోవడం కేవలం ఇతర చిన్న కాంట్రాక్టర్లు అందించని కమిషన్ను పది పర్సెంట్ మోతాదులో అందించడం అందుకే బినామీ కాంట్రాక్టర్లకు పనులు కేటాయించడం జరిగింది. అలాగే మరో పక్క బినామీల పేరుతో అమాయక కాంట్రాక్టర్లకు ఇబ్బందులకు గురి చేస్తూ ఏ ఈ రాజేందర్ రెడ్డి పెట్టుబడి పెట్టి బినామీల పేరుతో వందల పనులను ఇప్పటికే పూర్తి చేయడం వాటికి సంబంధించిన బిల్లులను కూడా తీసుకోవడం జరిగింది. తాజాగా ఎక్కువ కమిషన్ వస్తుందని యావత్ మండలంలో అవసరం లేనప్పటికీ 500 సెంట్రల్ లైట్లు 65 వేల రూపాయల కమిషన్ తీసుకొని విచ్చలవిడిగా బిల్లులను రికార్డు చేయడం జరిగింది. ఇలా పంచాయతీరాజ్ పరిధిలోని అభివృద్ధి పనులకు సంబంధించి ఏ ఈ రాజేందర్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు 80 కోట్ల కోట్ల నిధులను అభివృద్ధి పనులు పేరిట కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది.

 

 *ఏ ఈ రాజేందర్ రెడ్డి వద్దే అందరి  చిట్టా, సంవత్సరాలుగా మేపుతున్న నాకు ఏమీ కాదు,!* 

 

మండలంలో భారీ కోట్ల కుంభకోణ వ్యవహారంలో నేడు సెలవులు ఉన్నప్పటికీ తన అధికారం తన అరాచకాన్ని మాత్రం వీడే ప్రసక్తి లేదంటూ మరింత రెచ్చిపోయి వాస్తవాలను బినామీ లకు చెప్పడం సన్ మండలమంతా సంచలనాన్ని సృష్టిస్తుంది. నేడు మండలంలో ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణ వ్యవహారంపై సత్వర చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఏఈ రాజేందర్ రెడ్డి విధాబీలకు చెప్పుకుంటున్న వాస్తవాలను విని ప్రజల్లో పంచాయతీరాజ్ శాఖ తో పాటు జిల్లా మరియు ఉన్నత అధికారులపై విరక్తిని కలిగించే విధంగా ఏ ఈ చెప్పుకున్న మాటలు ఉన్నాయి. పలు వినమీలకు రాజేందర్ రెడ్డి తను మండలంలో నాలుగున్నర సంవత్సరాలుగా కమిషన్ వ్యవహారం కాంట్రాక్టర్ లతో చేపట్టిన పనులకు సంబంధించి వచ్చిన లక్షల రూపాయలను తను ఒక్కడే తీసుకోలేదని మండలంలోని అధికారులతో పాటు ఉన్నత అధికారుల వరకు పంపించడం జరిగిందని చెప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇంతే కాకుండా ఇప్పటికీ తను నిధుల దుర్వినియోగం లో చేసిన పనులకు సంబంధించిన డబ్బులను నాలుగున్నర సంవత్సరాల నుండి ఉన్నత అధికారుల వరకు పోషించుతున్నానని తనపై చర్యలకు అధికారులు ఆదేశిస్తే నాతో పాటు వారు కూడా దోషులు గాని నిలుస్తారని బినామీలకు చెప్పడం జరిగిందని మండలమంతా చర్చించుకుంటున్నారు. అలాగే రాజేందర్ రెడ్డి బినామీలకు మరింత భరోసాను కల్పిస్తూ మీరెవరు తొందర పడాల్సిన అవసరం లేదని నాపై ఏ అధికారి కూడా షరియకు ఆదేశించాడని మీరు చూస్తున్నారు కదా మూడు నెలలుగా నాపై వరుస కథనాలు వచ్చినప్పటికీ నాకు ఏ అధికారి కూడా విచారణకు ఆదేశించలేదని దీన్నిబట్టి చూస్తే మీకు అర్థమవుతుందని భరోసా కలిగించడం జరుగుతుందని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ ఈ మాటలను బట్టి చూస్తే అతను బినామీలకు చెప్పింది వాస్తవాలేనని డి ఈ నుండి ఈ ఎన్ సి వరకు కుంభకోణానికి సంబంధించిన లక్షల రూపాయలను ఏఈ దుర్వినియోగానికి పాల్పడుతూ వారికి అందజేయడం జరిగిందని అందుకే ఏ అధికారి కూడా రాజేందర్ రెడ్డి పై నీటి వరకు చర్యలు తీసుకునే విధంగా అడుగు వేయలేదని చెప్పుటకు సందేహ పడాల్సిన అవసరం లేదు.

 

 *రోజు కు ఒకటి తెరపైకి అవినీతి భాగవతం.* 

 

ఎన్ని సాక్షాలు పంచాయతీరాజ్కు అవసరం ఎప్పుడు రాజేందర్ రెడ్డి తో పాటు ఇతర అధికారులపై చర్యలు తీసుకుంటారు గత మూడు నెలలుగా బాధితులు సాక్షాలతో తెరపైకి రావడం వందల సంఖ్యలో నాసిరకం పనులు బయట పెట్టడం గత నెలలో తాజాగా ఒక బాధితుడు రెండు లక్షల 50 వేల రూపాయల కమిషన్ను తన బిల్లులను రికార్డు చేయుటకు అందించాలని చెప్పడం జరిగినప్పటికీ పంచాయతీరాజ్ ఉన్నత అధికారి ఈ ఎన్ సి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరిగింది. రోజులు గడవక ముందే పేదల సొమ్ము ప్రభుత్వం మండల అభివృద్ధి కొరకు తన వంతు పాత్రను అభివృద్ధి కొరకు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే అభివృద్ధి పనుల పేరుతో ఏ ఈ రాజేందర్ రెడ్డి పంచాయతీరాజ్ ఉన్నత అధికారులకు ఇటు ప్రజా ప్రతినిధులకు కొమ్ము కాస్తూ కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడడం జరిగినప్పటికీ చర్యలు తీసుకోకుండా అధికారులు రాజేందర్ రెడ్డి కి కొమ్ముకాస్తూ ఉండడం జరుగుతుంది. పంచాయతీరాజ్ అధికారులకు ఎన్ని సాక్షాలు కావాలో రాజేందర్ రెడ్డి కుంభకోణ విషయంలో వారానికి ఒక సంఘటన తెరపైకి రావడం పంచాయతీరాజ్ కనీస విచారణకు కూడా ఆదేశించకపోవడం గమనార్థం. మండలంలోని సూరారం గ్రామంలో ఎస్సీ కాలనీ నుండి మురికి మరియు వర్షపు నీరును గ్రామంలోని చెరువులోకి పంపించుటకు ఆరు పైప్ లైన్ లను అమర్చి పనిని గత సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. నాలుగు పైప్ లైన్లను అమర్చించాల్సి ఉండగా కేవలం 3 లైన్లను మాత్రమే అమర్చి నాలుగవ లైన్ అమర్చకుండానే పని పూర్తి చేసినట్లు రికార్డులు నమోదు చేసి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలను దండుకోవడం జరిగింది. పనిచేయకుండానే ఏ ఈ రాజేందర్ రెడ్డి బిల్లును రికార్డు చేయడం వాటికి సంబంధించిన డబ్బులను తీసుకోవడం జరిగింది. గ్రామస్తులు ఏఈ అక్రమాలపై మూడు నెలలుగా వరుస కథనాలకు వారిలో మార్పులు తీసుకువచ్చిందని పంచాయతీరాజ్ శాఖ నిర్లక్ష్యం వహించడంతోనే తమ సొమ్మును తామే కాపాడుకుంటాం అన్నట్టుగా పంచాయతీరాజ్ అవినీతి తిమింగళం చేసిన అక్రమాలను ఇక తామే బట్టబయలు చేస్తామని మండల ప్రజల్లో సంకల్పంగా తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. పంచాయతీరాజ్ అవినీతికి బట్టబయలు చేసుటకు ఇక మండల ప్రజలే కంకణం కట్టినట్లు కనబడక తప్పడం లేదు. పనిచేయకుండానే లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని ప్రజలే బయటపెట్టినప్పటికీ పంచాయతీరాజ్ నిద్రమత్తును వీడుతుందా  అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.

 

 *ఈ ఈ, ఎస్ ఈ లు పాత్రధారులు కాగా,ఈ ఎన్ సి కమిషన్కు కక్కుర్తి పడి నో యాక్షన్,!?* 

 

మండలంలో కోట్ల కుంభకోణం వ్యవహారంపై నేటి వరకు పంచాయతీరాజ్ ఈ ఎన్ సి సంజీవరావు స్పందించకపోవడం వెనుక కారణమేమిటో అని యావత్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్న తరుణంలో గత వారం రోజుల క్రింద డివిజనల్ అధికారి సాయిలు పలు బినామీలు ప్రజల ప్రదేశాల్లో పలు గ్రామస్తులతో పంచాయతీరాజ్ శాఖ లో కమిషన్ మామూలే అని నాసిరకం పనులు అనేది పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని ఏఈ రాజేందర్ రెడ్డి పై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పుకోవడం జరుగుతుందని ప్రచురించడం కూడా జరిగింది. ఇదే క్రమంలో ఏఈ వినామీలతో చెప్పుకున్న మాటలను బట్టి చూస్తే వాస్తవానికి కుంభకోణంలో డి ఈ నుండి ఎస్సీ వరకు పాత్రధారులు అన్న విషయం ముందు నుండి అనుమానాలు వ్యక్తమౌతూ పలు సందర్భాల్లో నిజాలుగా తేలడం జరిగింది. కానీ ఉన్నత అధికారి ఈఎంసి డి ఈ ఎస్ ఈ లపై చర్యలు తీసుకుంటారని అనుకుంటున్న తరుణంలో డి ఈ సాయిలు ఏ ఈ రాజేందర్ రెడ్డి దినములకు చెప్పుకున్న మాటలు ఈ ఎన్ సి  కూడా కుంభకోణానికి సంబంధించి కమిషన్ మాయలో పడి ఉన్నారని అర్థమవుతుంది. నేటి వరకు పదుల సంఖ్యలో సాక్షాలు స్థిరపైకి వచ్చినప్పటికీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ముఖ్య అధికారి అయి ఉన్న ఈ ఎన్ సి నేటి వరకు రాజేందర్ రెడ్డి తో పాటు ఎస్సీ లపై చర్యలకు ఆదేశిస్తూ మండలంలో విజిలెన్స్ విచారణ జరిపించకుండా తనకు సంబంధం లేని అధికారులుగా భావిస్తూ కోట్ల కుంభకోణ వ్యవహారంలో ఈ ఎన్ సి సంజీవరావు నిశ్శబ్దం

కమిషన్ కక్కుర్తి లో పడి నో యాక్షన్ అన్నట్లుగా ఉందని మండలంతో పాటు జిల్లా ప్రజలంతా చెప్పుకోక తప్పడం లేదు.

 

 *మహాదేవపూర్ కుంభకోణంపై బాధ్యత వహించేది ఎవరు,!?* 

 

మండలంలో భారీ కోట్ల నిధుల కుంభకోణానికి శ్రీకారం చుట్టి నేడు సెలవు పేరుతో సెలబ్రేట్ చేసుకుంటూ కుంభకోణ వ్యవహార విషయంలో వరుస కథనాలు వస్తు యావత్ రాష్ట్రమంతా ఏ ఈ రాజేందర్ రెడ్డి సెలబ్రిటీగా మారిపోవడం జరిగిందని పంచాయతీరాజ్ శాఖ అనుకుంటుంది అందుకే మా అవినీతి తిమింగళం సెలబ్రిటీ తో పాటు మాకు కమిషన్ అందించే కింగ్ అని పంచాయతీరాజ్ శాఖ అనుకుంటుందేమో అందుకే నిధుల కుంభకోన వ్యవహారానికి బాధ్యత ఏ అధికారి తీసుకొని శాఖ పరుగును నిలబెట్టి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఈ ఎన్ సి వరకు నిశ్శబ్ద వైఖరిని యావత్ ప్రజలంతా అసహ్యించుకుంటున్న క్రమంలో కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ తన బాధ్యతగా మండలంలో నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశిస్తారా లేక పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్య రాజేందర్ రెడ్డి తోపాటు ఇతర ఉన్నత అధికారులపై కొరడా కురిపించి శాఖ పరుగులు నిలబెడతారా అనేది వేచి చూడాల్సిందే.

 

 *అవినీతి లో కూడుకపోయి ఉన్న పనులను సాక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ఇన్చార్జి ఏ ఈ పై చర్యలు తీసుకొని ఇతర ఏ ఈయనకి బాధ్యతలు అప్పగించాలి.* 

 

 

తాజాగా మండలంలో కుంభకోణానికి శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులకు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే సాక్షాలు ఉండకుండా చేసే ప్రయత్నం ఏ ఈ రాజేందర్ రెడ్డి డి ఈ సాయిలు మూడు నెలలుగా ఆగి ఉండి శిథిలావస్థకు చేరి ఉన్న పనులను తిరిగి ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ తో పరులను గొట్టుశప్పుడు కాకుండా ప్రారంభించడం జరుగుతుంది. తాజాగా మండల కేంద్రంలోని 24 లక్షల రూపాయలతో టెండర్ ఫార్మింగ్ కు పోవాల్సిన రహదారి బిట్లుగా ఏర్పాటు చేసి బినామీ కాంట్రాక్టర్కు అందించడం జరిగింది. నాసిరకం పనులతో బిట్ల చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని ప్రచురించడంతో కుంభకోణం లో చేపట్టిన పనులు ఆగిపోవడం జరిగింది. తిరిగి ఆ పనులను ఉన్నత అధికారులు ఎవరూ కూడా ఏఈని ఏమి చేయలేరని ముందు గాని డి ఈ ప్రచారం చేసుకోవడం తాజాగా ఏఈ తనకు ఏమీ కాదు ఉన్నతాధికారులు కూడా నా గుప్పిట్లో ఉన్నారని బినామీలకు చెప్పుకోవడం ఇన్చార్జి ఏఈగా ఉన్న రవీందర్ ను తన విధి నిర్వహణలో భాగంగా అని చెప్పుకుంటూ ఇటు స్థానిక ప్రజాప్రతినిధుల అండలతో రహదారి నిర్మాణాలను గుట్టు చప్పుడు కాకుండా నాసిరకం అయినప్పటికీ పనులు వేగం పెంచి పనులు కొనసాగించడం జరుగుతుంది. తక్షణమే ఉన్నత అధికారులు మండలంలో అవినీతికి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన పనులను విజిలెన్స్ విచారణ జరిగేంతవరకు నిలిపివేయాలని ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ పై చర్యలు తీసుకోవాలని రవీందర్ స్థానంలో మరి ఇతర ఏఈ ని నియమించాలని అప్పుడే మండలంలో అభివృద్ధి పనులు నాణ్యతతో సజావుగా సాగుతాయని మండలంతో పాటు జిల్లా ప్రజలు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ తోపాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్యకు వీడుకోవడం జరుగుతుంది.

సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ జులై 5న* *తెలంగాణ

పాఠశాలల బంద్ :ABVP తెలంగాణ 

తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అఘాడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జులై 5న *తెలంగాణ పాఠశాలల బంద్* నిర్వహించనున్నట్లు ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ *మన ఊరు-మన బడి* కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహసంగా ప్రకటించిన ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభమైనా కనీసం పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్ లు పంపిణీ చేయకపోవడం,నిధులు విడుదల చేయకపోవడంతో మౌలిక వసతుల కల్పనలో,మధ్యాహ్న భోజనం అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఫీజు దోపిడీ నియంత్రించి *ఫీజు నియంత్రణ చట్టం* అమలు చేస్తామని స్వయంగా విద్యా శాఖ మంత్రి జనవరిలో ప్రకటించినా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం,ఫీజుల నియంత్రణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు డొనేషన్, బుక్స్, స్కూల్ డ్రెస్ పేరుతో బహిరంగంగా లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలను హింసిస్తూ పలు పాఠశాలలు ప్రవేశం రోజు 60% ఫీజు చెల్లిస్తేనే తరగతి అనుమతిస్తామని షరతులు పెడుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరేత్తినట్లు వ్యవహారిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.గత ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం సర్కారు బడులను నిర్లక్ష్యం చేస్తూ నియామకాలు చేపట్టకుండా, నిధులు విడుదల చేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థును విద్యకు దూరం చేసే కుట్ర ఒక వైపు చేస్తూ మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ప్రోత్సహిస్తూ అనుమతి లేకపోయినా,ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తూ ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహించినా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడిన విద్యా శాఖ అధికారుల నియంత్రణ మాత్రం శూన్యం. సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరి నిరసిస్తూ ABVP తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో *july5* న *తెలంగాణ పాఠశాలల బంద్* నిర్వహిస్తుందని ఈ బంద్ కు విద్యార్థులు తల్లిదండ్రులు అందరు మద్దతిచ్చి బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

*డిమాండ్స్*

 

*1* సర్కారు బడుల్లో సత్వరమే పుస్తకాలు,డ్రెస్ లు అందించాలి.

*2* ప్రభుత్వం ప్రకటించిన *మన ఊరు-మన బడి* కార్యక్రమానికి నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలి.

*3* పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, DEO, MEO పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

*4* ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి.

*5* ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించి, ఏక రూప ఫీజు నిర్ణయించాలి.

*6* ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లను నిషేధించాలి.

*7* బుక్స్, డ్రెస్, డొనేషన్ పేరుతో ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలపై కఠినంగా వ్యవహారించాలి.

*8* ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి.

*9* విద్యా హక్కు చట్టం అమలు చేయాలి.

ఈ ఎన్ సి గారికి బహుమతి వెలుగులోకి మరో సంఘటన.

ఏ ఈ రాజేందర్ రెడ్డి లీలలు

పని కాకుండానే బిల్లు చేసిన ఏ ఈ రాజేందర్ రెడ్డి. 

రెండు నెలల ముందే బిల్లు తీసుకున్న కాంట్రాక్టర్, గ్రామస్తుల చొరవతో పైపులను మహదేపూర్ గ్రామపంచాయతీకి తరలింపు, విచారణ చేపట్టిన ఎంపీ ఓ.

ఫోన్ చేసి నాకు విసిగించకు ఏమి రాసుకుంటావు రాసుకో, 

మరో గోదావరి రోడ్డు ప్రారంభిస్తున్న దమ్ముంటే ఆపుకో ఇంచార్జ్ ఏ ఈ రవీందర్.

నిధుల కుంభకోణం వలన ఆగిన  పనులను ప్రారంభిస్తూ రెచ్చిపోతున్న ఇంచార్జి ఏ ఈ, ఈ ఎన్ సి నిర్లక్ష్యమే ఏ ఈ రవీందర్ రెచ్చిపోవడానికి కారణం.!

మహాదేవపూర్-నేటిధాత్రి:-

మండలంలో అభివృద్ధి పనుల్లో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని దానికి ఎన్నో సాక్ష్యాలు ప్రచురిస్తూ నేటి రాత్రి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం కాకుండా ఇప్పటికీ నిధుల దుర్వినియోగం చేసిన అధికారిపై చర్య తీసుకొని నిధులను రికవరీ చేయాలని గత 97 రోజులుగా అక్షర పోరాటాన్ని సాగించడం జరుగుతుంది.

పంచాయతీరాజ్ ఈ ఎన్ సి నిర్లక్ష్యం వలన అధికారిపై చర్యలు తీసుకోకపోవడం అక్రమాలకు ప్రోత్సాహం జరుగుతుందని చెప్పడానికి మరో సాక్ష్యం వెలుగులోకి రావడం జరిగింది కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని నేటి ధాత్రి గత మూడు నెలలుగా చెపుతూనే ఉన్నప్పటికీ ఈ ఎన్ సి స్పందించకపోవడం ప్రజల్లో నీటి ధాత్రి అక్షర పోరాటానికి ఒక అడుగు ముందుకేసి ఏ ఈ కుంభకోణంలో మరో దుర్వినియోగాన్ని బయట పెట్టడం జరిగింది ఒక లక్ష 30 వేల రూపాయల పైప్ లైన్ వేయకుండానే రెండు నెలల ముందే బిల్లులు చేసి డబ్బులను ఫిట్రా చేసుకోవడం జరిగింది. మండల కేంద్రంలో ఏఈ రాజేందర్ రెడ్డి నిధుల కుంభకోణంలో ప్రారంభించిన రోడ్లు ఆగి ఉన్నప్పటికీ వాటిలో నాణ్యత లోపాలు ఉన్నప్పటికీ ఇన్చార్జి ఏఈ రవీందర్ పనులను తిరిగి ప్రారంభించడం వాటికి సంబంధించిన వివరాల కొరకు సంప్రదిస్తే నేటి ధాత్రిపై అనుచిత వాక్యాలు చేయడం మరిన్ని రహదారులను ప్రారంభిస్తాను దమ్ముంటే ఆపుకో అనే స్థితికి వచ్చి బినామీ కాంట్రాక్టర్ పనులను తిరిగి చేపడుతున్నాడు అంటే ఒకవైపు ఈ ఎన్ సి నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల అండ ఉందని నేటి వరకు కోట్ల కుంభకోణం పై చర్యలు తీసుకోలేదు కాబట్టి తనపై ఎవరు ఏమి చేయాలరు అనె ఆలోచనతో ప్రవర్తిస్తున్నట్లు కనబడుతుంది.

 

 *ఈ ఎన్ సి గారికి బహుమతి వెలుగులోకి మరో సంఘటన.* 

 

ఏఈ రాజేందర్ రెడ్డి కుంభకోణానికి ఎన్ని సాక్ష్యాలు అవసరము నేటి వరకు కుంభకోణం జరిగిందన్న విషయంపై ఉన్నత అధికారులు స్పందించకపోవడం లేదంటే మండలంలో అవినీతి జరగలేదని అనుకుంటున్నారా లేదా అక్రమ ఏఈ కమిషన్ మాయలో ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని పదాన్ని మాయం చేశారు అని చెప్పటానికి నిధుల దుర్వినియోగంలో మరో కుంభకోణం బయటపడి నేడు మండలమంతా చర్చలు జరుగుతున్నాయి ఏ ఈ రాజేందర్ రెడ్డి మండలంలోని సూరారం గ్రామంలో అభివృద్ధి పనుల్లో భాగంగా నాలుగు పనులు చేపట్టే క్రమంలో కేవలం 3 పనులు చేపట్టి నాలుగవ నాలుగవ పని పైప్ లైన్ వేయకుండానే రెండు నెలల క్రితం పనిని రికార్డ్ చేసి చెక్ మేజర్ చేయించి బిల్లును తీసుకోవడం జరిగింది. మండలంలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని పనులు చేయకుండానే లక్షల రూపాయల బిల్లులను ఏ ఈ రాజేందర్ రెడ్డి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని తన దుర్వినియోగానికి నామకరణమై తన వ్యవహారం బట్టబయలు అవుతుందని వార్తలు రావడంతో అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై అనారోగ్యం పేరుతో అతనికి సెలవు మంజూరు చేయడం కుంభకోణాన్ని పక్కదారి పట్టించే క్రమంలోని రాజేందర్ రెడ్డి కి సెలవు మంజూరు చేయడం జరిగింది. కోట్ల రూపాయల కుంభకోణానికి మరో సాక్ష్యంగా పంచాయతీరాజ్ ఈ ఎన్ సి రాజేందర్ రెడ్డి కుంభకోణ వ్యవహారానికి మరో అవినీతి జరిగిందన్న సాక్ష్యం ఈ ఎన్ సి సంజీవరావు కు అవినీతి తివంగలం చేసిన ఘనత ఒక బహుమతిగా మండల ప్రజలు అందించడం జరుగుతుంది.

 

 *పని కాకుండానే బిల్లు చేసిన ఏ ఈ రాజేందర్ రెడ్డి.* 

 

రాజేందర్ రెడ్డి కోట్ల కుంభకోణం మండల పేద ప్రజల సొమ్మును ఏలా దోచుకున్నాడు  అనేది సూరారం సంఘటన ప్రస్తుతం యావత్ రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్ శాఖకు అలాగే ఈ ఎన్ సి సంజీవరావుకు ఏ ఈ తో పాటు ఇతర అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికైనా ఈ యొక్క సాక్ష్యం సరిపోతుందో లేదో మహదేవ్పూర్ మండలంలోని సూరారం గ్రామంలో నాలుగు పైప్లైన్ పనులను చేపట్టుటకు ప్రారంభించడం జరిగింది కానీ కేవలం మూడు పైప్ లైన్ లను మాత్రమే పనులు చేపట్టి ఒక లక్ష 38 వేల పనిని నాలుగవ పైప్ లైన్ వేయకుండానే రెండు నెలల కింద బిల్లులను రికార్డ్ చేసి కాంట్రాక్టర్కు చెక్ మేజర్ తో అందించడం సదరు కాంట్రాక్టర్ డబ్బులను విడ్రా చేసుకోవడం జరిగింది. ఈ విషయం గ్రామస్తులకు తెలవగానే ఇటు నేటిదాత్రి వరుస కథనాలు అక్రమాలపై వస్తున్న క్రమంలో గ్రామంలో అభివృద్ధి పనుల నాణ్యతలపై చర్చించుకునే క్రమంలో పైప్లైన్ వ్యవహారం బయటకు రావడంతో హట ఉట్టిగా కాంట్రాక్టర్ బుధవారం రోజున పైప్లైన్ అమర్చే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకొని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం తో కలెక్టర్ పైపులను స్వాధీనం చేసుకొని మహదేవ్పూర్ గ్రామపంచాయతీకి తరలించాలని ఆదేశించడం జరిగింది. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కమిషన్ మాయ నుండి బయటికి వచ్చి విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

 

 *రెండు నెలల ముందే బిల్లు తీసుకున్న కాంట్రాక్టర్, గ్రామస్తుల చొరవతో పైపులను మహదేపూర్ గ్రామపంచాయతీకి తరలింపు, విచారణ చేపట్టిన ఎంపీ ఓ.* 

 

పని చేయకుండానే కాంట్రాక్టర్ కు ఎంబి లను రికార్డ్ చేసి డబ్బులను విడ్రా చేసుకోమని అందించిన ఏ ఈ పని కాకుండానే చెక్ మేజర్ చేసిన డి ఈ మండలంలో ఇప్పటికే జరిగిన కోట్ల కుంభకోణంలో ఇలాంటి ఎన్నో పనులకు శ్రీకారం చుట్టి ఇప్పటికే కోట్ల రూపాయలను పనులు చేయకుండానే బిల్లులను తీసుకోవడం జరిగిందని మూడు నెలలుగా నేటి ధాత్రి యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ పంచాయతీరాజ్ అధికారులకు అమాయక ప్రజల సొమ్ము కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని చెపుతున్నప్పటికీ కూడా ఉన్నత అధికారులు సైతం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ ఈ ఎన్ సి దృష్టి సాధించకపోవడం నేటి ధాత్రి అక్రమాలపై చేస్తున్న పోరాటాన్ని ప్రజలు స్వాగతించి ఏ ఈ రాజేందర్ రెడ్డి చేసిన అరాచకాలను ప్రజలే బయటకు పెట్టి దుస్థితి రావడం నేడు ఏఈ కుంభకోణంలోని మరో అవినీతి బయటకు రావడం జరిగింది. దొంగతనంగా పైప్ లైన్ ను రెండు నెలల తర్వాత తిరిగి అమరుస్తున్న క్రమంలో గ్రామస్తులు పనులను ఆపి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం పైపులైను స్వాధీనం చేసుకొని పైప్లైన్ పనులు చేపడుతున్న ప్రదేశానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డి ఎల్ పి ఓ సుధీర్ విచారణ చేపట్టడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ఈ ఎం సి కి మండలంలో ఏ ఈ రాజేందర్ రెడ్డి కోట్ల రూపాయల కుంభకోణానికి శ్రీకారం చుట్టాడని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్షమని కండ్లకు కట్టినట్టుగా అర్థమవుతుంది.

 

 

 *ఫోన్ చేసి నాకు విసిగించకు ఏమి రాసుకుంటావు రాసుకో,* 

 *మరో గోదావరి రోడ్డు ప్రారంభిస్తున్న దమ్ముంటే ఆపుకో ఇంచార్జ్ ఏ ఈ రవీందర్.* 

 

మండలంలో రాజేందర్ రెడ్డి సెలవులో వెళ్లిన అనంతరం డివిజన్ కార్యాలయంలో స్పెషల్ ఇంజనీర్ గా ఉన్న రవీందర్ రెడ్డిని మహదేవ్పూర్ మండల ఇన్చార్జి ఏఈగా బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఏ ఈ రవీందర్ రెడ్డి కి నాసిరకంగా పడి ఉన్న పనుల ప్రారంభ విషయానికై నేటి రాత్రి ఫోన్ ద్వారా సంప్రదిస్తే నాకు ఫోన్ చేసి విసిగించకు నీకు దమ్మున్నట్లు రాసుకో నీవు ఎంత రాసుకుంటావో నీ ఇష్టం ఒరేయ్ బాబు నేను పనులు ప్రారంభిస్తా మరో గోదావరి రోడ్డును కూడా ప్రారంభించడం జరిగిందని నేటి ధాత్రి కి ఫోన్ ద్వారా ఇంచార్జ్ ఏ ఈ రాజేందర్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ముందుగా నేటి రాత్రి మహదేవ్పూర్ మండల కేంద్రంలో 300 ఫీట్లు 24 లక్షల రూపాయల నిధులతో టెండర్కు వేయాల్సిన పని బిట్లుగా విభజించి గత మూడు నెలల ముందే సైడ్ లు ఆరు ఇంచుల లోతు తోడి కంకిరను వేసి పలుమార్లు మిషన్ నుండి ప్రెస్సింగ్ చేస్తూ క్యూరింగ్ లాంటి పనులను చేపట్టకుండా ప్రారంభించడంతోనే పూర్తిగా నాసిరకం పనులు చేపడుతున్నారని మూడు నెలల ముందే ఆపివేయడం జరిగింది అలాంటి పనులను హటాహుటిగా నేటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా సీసీ రోడ్డుకు సైట్లో వేసిన కంకర పూర్తిగా బయటికి వెళ్లడం మట్టి గుంతలు లాగా కనపడడం జరిగింది. అలాంటి వాటిపై ఒకేసారి రోడ్డును నిర్మించడం జరుగుతుండడంతో నేటి ధాత్రి కుంభకోణ వ్యవహారంలో టెండర్ కు వెళ్లాల్సిన పని అలాగే పూర్తిగా నాసిరకంతో చేపట్టిన పనులను ఇలా ప్రారంభిస్తారు అని ప్రశ్నించడంతో ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ రెడ్డి ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది.

 

 *నిధుల కుంభకోణం వలన ఆగిన  పనులను ప్రారంభిస్తూ రెచ్చిపోతున్న ఇంచార్జి ఏ ఈ, ఈ ఎన్ సి నిర్లక్ష్యమే ఏ ఈ రవీందర్ రెచ్చిపోవడానికి కారణం.!* 

 

 

ఏ ఈ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బినామీ కాంట్రాక్టర్ల పేరుతో కోట్ల రూపాయల పనులు పెద్ద మొత్తంలో కమిషన్లు అర్చించి టెండర్ కు వెళ్లాల్సిన పనులను బిట్లుగా విభజించి చేపట్టిన పనులు కుంభకోణంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడడం జరిగిందన్న విషయం బహిర్గతం కావడంతో ఏ ఈ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన రాసి రకం పనులు గత మూడు నెలలుగా ఆగి ఉండడం జరిగింది. మొదలుపెట్టేటప్పుడే పనులన్నీ నాసిరకంగా ప్రారంభించడం మూడు నెలలుగా ఆగడంతో పనులు శిథిల అవస్థకు చేరడం జరిగినప్పటికీ అలాంటి పనులకు ఇన్చార్జి ఏఈ రవీందర్ ప్రారంభిస్తూ వివరాలకు సంప్రదిస్తే రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. కోట్ల రూపాయలకు కుంభకోణానికి దారి తీసిన నాసిరకం పనులకు విజిలెన్స్ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్న పనులన్నీ ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ పనులను ఎలా ప్రారంభిస్తున్నారు ఇప్పటికే ఈ అక్రమాలకు పాల్పడ్డాడడానికి రోజుకొక కుంభకోణం బయటపడుతున్న క్రమంలో మండలంలో కోట్ల నిధుల పనులను ఏ ఈ రాజేందర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై మండలంలో కోట్ల నిధులను దుర్వినియోగానికి పాల్పడి ఉన్న ఇటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి ముందస్తుగా విజిలెన్స్ విచారణ చేపట్టి ఇంత మొత్తంలో అవినీతి జరిగిందన్న విషయం పంచాయతీరాజ్ ఈ ఎన్ సి విచారణ చేపట్టి వరకు పనులను జరగనివ్వకుండా ఉంటే విచారణ సులువుగా చేపట్టుటకు వీలవుతుంది. కానీ విచారణ పక్కదారి పట్టించే క్రమంలో ఏ ఈ రాజేందర్ రెడ్డి ప్రజా ప్రతినిధుల జిల్లా అధికారుల కుట్ర పూరిత భాగంలోనే ఇంచార్జ్ ఏఈ రవీందర్ కోట్ల కుంభకోణానికి దారి తీసిన పనులను ప్రారంభించి త్వరలో పూర్తిచేస్తే విచారణలో ఎలాంటి ఆధారాలు ఉండవని ఉద్దేశంతో పనులను ప్రారంభించడం జరుగుతుంది. అక్రమాలకు దారితీస్తున్న అధికారులపై అలాగే ఇప్పటికీ కోట్ల రూపాయల కుంభకోణానికి శ్రీకారం చుట్టిన ఏ ఈ రాజేందర్ రెడ్డి తో పాటు జిల్లా అధికారులపై విజిలెన్స్ విచారణ చేపట్టకుంటే మరిన్ని కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడక తప్పదని పంచాయతీరాజ్ శాఖ ఈ ఎన్ సి నిధుల దుర్వినియోగానికి ప్రోత్సహించినట్లు అవుతుందని మండలంలో ఇన్చార్జిగా ఏ ఈ ఉన్న రవీందర్ రెడ్డిని తక్షణమే నిధుల కుంభకోణానికి దారి తీసిన అభివృద్ధి పనులకు ఏ అధికారి ఆదేశాలతో పనులను చేపడుతున్నాడు లేదా ఉన్నత అధికారులకు తప్పుదోవ పట్టించేందుకు పనులు ప్రారంభించడం జరుగుతుందన్నట్లుగా వ్యవహరించడం జరుగుతుంది. తక్షణమే ఏఈ రవీందర్ ను మండల ఇన్చార్జి బాధ్యతల నుండి తొలగించి ఇతర మండలాలకు సంబంధించిన ఏఈలకు మహదేవ్పూర్ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని రాజేందర్ రెడ్డి అవినీతిపై తక్షణమే ఈ ఎన్ సి విచారణ జరిపించాలని మండల ప్రజలు అలాగే జిల్లా ప్రజలు కోరుతున్నారు.

మీరివ్వరు..మాది మిగలనివ్వరు?

అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు?

ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు?

ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు?

అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు?

అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు?

వున్నవి ఊడ్చుకుపోవడం తప్ప, రుణం తీర్చుకున్నది లేదు?

ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు?

ఓట్ల కోసం ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు?

కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు?

బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన?

తెలంగాణ గడ్డ మీద అడ్డావెట్డిండ్రు…బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలంటూ దండు కదిలిండ్రు…దేశంలోని బిజెపి పెద్దలంతా హైదరాబాద్ చేరుతున్నరు…ఇచ్చేదేమీ లేకపోయినా, చెప్పేదేమీ లేకపోయినా, అంతంత ఎత్తు చెప్పుకునుడు బిజెపికి అలవాటే…ఆడేం లేకపోయినా అన్నీ వున్నాయంటారు? ఏమీ ఇయ్యకపోయినా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు…అభివృద్ధి గురించి అడిగితే హైందవ ధర్మం అంటారు…ఎనమిదేండ్ల సంది ఏం చేసిన్రంటే అంతా దేశం కోసమే అంటారు…? మీరు చెప్పేదాంట్లో దేశం కోసం ఏముందని అడిగితే, ఈ పాపమంతా కాంగ్రెస్ దే అంటారు..?అందుకే కొత్త రాజకీయం నేర్చుకున్నారు… చెప్పడం చేత కానప్పుడు అరవాలి. వినడం ఇష్టం లేనప్పుడు అల్లరి చేయాలి. పని చేయలేనప్పుడు పగటి కలలుగనాలి…చెప్పిందిడా అబద్దాలాడడం నేర్చుకోవాలి. ఇంతకు మించి ఏమీ చేయలేనప్పుడు…ఇతరుల మీద పడి ఏడవాలి….సరిగ్గా బిజెపి చేస్తున్నది ఇదే…తన మాట తనదే గాని ఇతరుల మాట వినిపించుకోదు.దానికి తోడు మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? అన్న సూత్రాన్ని పాటిస్తున్నట్లు చేస్తున్నారు. రాష్ట్రాల నుంచి చేయాల్సినంత వసూలు చేస్తున్నారు. జిఎస్టీ అని తెచ్చి, ఇతర పన్నులు అలాగే వుంచారు. ఆఖరుకు అప్పడాలు, మజ్జిగ ప్యాకెట్ల మీద కూడా జిఎస్టీ వసూలు చేస్తామంటున్నారు. ఆఖరుకు గడ్డం గీసుకునే బ్లేడును కూడా వదలడం…అయినా మమ్మల్ని మాత్రం ఏమీ అడగొద్దు…మాకిది కావాలి, అది కావాలని అడగొద్దు…ఇవ్వడానికేమీ లేదిక్కడ…ఇవ్వాలంటే మనసొప్పక…అయినా ఓట్లు మాకే ఎయ్యాలే…మమ్మల్నే గద్దెనెక్కించాలే! ఏమివ్వనూ…ఇంకేమివ్వనూ…నా మనసే నీదైతే ఏమివ్వను…నిన్నేమడగనూ, ఇంకేమడగనూ, నువ్వే నాదైతే ఏమడగను… పాట పాడుకుంటూ బిజెపి భజన చేయాలన్నట్లుంది. బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణకు ఇది కావాలి. ఈ ప్రాజెక్టు ఇవ్వాలని అడగరు…కేంద్ర పెద్దలు పెట్టరు…అడిగే వాళ్లను అడగనీయరు…ఎక్కవ తక్కువ అడిగితే ఉన్నయ్ గుంజుకపోతరు…ఇది రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్న చర్చలో భాగమైన మాట. అంటే బిజెపి గురించి చెప్పాలంటే ఇంకా చాలా వుందన్న మాట.  

మీరివ్వరు..మాది మాకు మిగలనివ్వరు. కేంద్ర ప్రభుత్వం అన్నాక దేశమంతా ఒకే రకమైన ప్రేమను కనబర్చాలి. ఒకే రకమైన అభివృద్ధిని అందించాలి. అందులో ఎలాంటి భేదాభిప్రాయాలకు చోటు లేకుండా చూసుకోవాలి. అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకోవాలి. అంతే కాని ఉత్తరాదికో రూలు, దక్షిణాదికో రూలు అన్నట్లు వుండకూడదు. వివక్ష మాత్రం ఎక్కడా చూపించకూడదు. కానీ తెలంగాణ ధనిక రాష్ట్రం, కేంద్రాన్నే సాదుతున్న రాష్ట్రానికి ఏం అవసరమని రాష్ట్ర బిజెపి నాయకులే నైతికత మరిచి మాట్లాడుతున్నారు. ఒక రకంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులే అవసరం లేదన్నట్లు వాదిస్తున్నారు. ఇలాంటి నాయకులు రేపటి రోజున తెలంగాణకు మేలు చేస్తారా? తెలంగాణకు కొత్తగా ఏమీ ఇవ్వకపోవడం అటుంచితే, గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సైతం తరలించుకుపోయారు…వాటి పైనా బిజెపి రాష్ట్ర నాయకులు స్పందించరు. కనీసం తరలించుకుపోకుండా ఆపిన సందర్భం లేదు. కేంద్రం కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం అడిగితే ఇవ్వలేదని బుకాయిస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో వుండి వరంగల్ లో ఈ మాట చెప్పారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నది చిరకాల కల. దానిని కూడా తరలించుకుపోయారు…? మరి అప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు ఆపలేదు? పోతే పోనీ అనుకున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో వున్నంత కాలం ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీని విజయవాడకు తరలించుకు పోవడానికి శత విధాలా? ఆనాడు ప్రయత్నించారు. కానీ కుదలేదు…ఆఖరుకు గుజరాత్ కు తరలిస్తే బిజెపి నేతలు చూస్తూ ఊరుకున్నారు? ఇంకేమిస్తారు? అవ్వ పెట్టాపెట్టదు…అడుక్కోనివ్వదని కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్స్ ఇవ్వదు…అప్పుకు అవకాశం లేదు. వ్యవసాయానికి మీటర్లు పెడితే తప్ప అప్పు లేమంటూ తిరకాసు తెలిసిందే…? ఇలా తెలంగాణను అడుగడుగునా వంచిస్తూ వస్తూ, తెలంగాణ మాదే… తెలంగాణలో పెత్తనం మాదే…అని పగటి కలలు నిజాలౌతాయన్న భ్రమల్లో బిజెపి శ్రేణులున్నారు.

తెలంగాణకు అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి ప్రత్యేకంగా ఇచ్చింది లేదు…విభజన హమీలలో పొందుపర్చిన వాటికే దిక్కు లేదు. సాగునీటి రంగంలో అద్భుతమైన ప్రగతిని కనబర్చినా కేంద్రం నుంచి సానుకూలత లేదు. ప్రశంస అంతకన్నా లేదు. కాళేశ్వరానికి పైసా సాయం చేసింది లేదు. మిషన్ కాకతీయకు నిధులిచ్చింది లేదు. ఇంటింటికీ మంచినీళ్లిచ్చే మిషన్ భగీరథ కు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా, కనికరించింది లేదు. ఇదంతా అపకారం కాక మరేమిటి? తెలంగాణకు కేంద్రం ఉపకారమని చెప్పుకోవడానికి ఏముందని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు.

ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బిజెపి తెలంగాణకు ఈ ఎనమిదేళ్లలో మాటలు తప్ప చేసిందేమీ లేదు. పైగా తెలంగాణ ఇవ్వడాన్ని సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకించాడు…వ్యంగ్యాస్రాలు విసిరాడు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నాడు. పార్లమెంటు తలుపులు మూసి, అప్రజాస్వామ్యంగా వ్యవహరించారని అన్నాడు. మరి మహారాష్ట్ర ను విడదీసి, గుజరాత్ ను కూడా అలాగే ఇచ్చారా? అన్న దానిని మోడీ ఎందుకు చెప్పరు. ఒక నాడు గుజరాత్ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎలా కొట్లాడిందో అలాగే తెలంగాణ కూడా కొట్లాడి సాధించుకున్నది. గుజరాత్ కోసం మోడీ కొట్లాడింది లేదు…కానీ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ కారుడు కేసిఆరే తెలంగాణ పాలిస్తున్నాడు.ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు. అదిగో పసుపు బోర్డు ఇదిగో పసుపు బోర్డు అన్నారు. వచ్చిందా? ఇచ్చారా? మోసం చేశారా? అన్నది తెలంగాణ ప్రజలకు తెలియదా? గెలిచిన వారం రోజుల్లో పసుబు బోర్డు తెప్పిస్తా? లేకుంటే రాజీనామా చేస్తానని చెప్పిన ఎంపి అరవింద్ అంతకన్నా ఎక్కువ చేసిన? అంటాడే గాని చేసిందేమిటో చెప్పింది లేదు. కేంద్రాన్ని అడిగి తెచ్చింది లేదు. పార్లమెంటులో ప్రశ్నించింది లేదు. ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తేవాలన్న చిత్తశుద్ధి లేదు. అడిగిన వాళ్లను ఎదురు ప్రశ్నించడం తప్ప తెచ్చి చూపిస్తా అన్న మాట రాదు.

అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు? అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు. ఇంటి పెరట్లో కట్టుకున్న మరుగుదొడ్డి మాదే, వీధిలో వెలుగుతున్న లైటు మాదే, ఊరూరికి కట్డిమ రైతు వేధిక పైసల్ మాయే…ఆఖరుకు వడ్లు కొనేది మేమే…ఆ పైసల్ మాయే….ఇవన్నీ నిజాలా కాదా? అని తెలంగాణ ప్రజలకు తెలియదా? దేశంలో ఏ రాష్ట్రంలో రైతు వేధికలు నిర్మాణం చేశారో చెప్పమంటే నోరెళ్లబెడతారు? తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఫించన్ల పైసల్ మాయే…అంటారు…గుజరాత్ లో ఐదువందలే కదా ఇచ్చేది అంటే సమాధానం దాట వేస్తారు. ఇరవై నాలుగు గంటల కరంటు పుణ్యం మాదే అంటరు…కర్ణాటక రైతులు కరంటు వస్తలేదని బండి సంజయ్ ముఖం మీద చెప్పంగనే జారుకున్నాడు. మహిళలతో కలిసి సమావేశం పెట్టి, అన్నీ కేంద్రమే ఇస్తుందంటే, గ్యాస్ ధరలేంది, నూనెల ధరలేంది? మేం తినేదెట్లా? బతికేదెట్లా? అనంగనే జారుకున్న బండి సంజయ్ అబద్దాలు చెప్పడం మానడు.ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు?. తెలంగాణకు ప్రత్యేకంగా పైది పైసల సొమ్ము ఇచ్చే ఉద్దేశ్యం బిజెపి పెద్దలకు లేదని తెలుసు. కేంద్రం ఏం ఖర్చు చేయాలన్నా ముందు ఉత్తరాధి వైపే తప్ప, దక్షిణాదివైపు చూడడం మర్చిపోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతూనేవుంది. ఓట్ల కోసం బిజెపి ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు? ఆకలౌతున్నప్పుడు బువ్వ పెట్టని వాళ్లు, బిర్యానీ వండుతున్నామంటే నమ్ముతారా? బిజెపి కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు? అందుకే తెలంగాణ గడ్డ మీద బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన? అంటున్నారు ఇతర రాజకీయ పార్టీలు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version