హసన్‌పర్తి పీఎస్‌ను సందర్శించిన హోంమంత్రి

హసన్‌పర్తి పీఎస్‌ను సందర్శించిన హోంమంత్రి

హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ శనివారం సందర్శించారు. స్మార్ట్‌ సిటీ పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా శనివారం హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు హోంమంత్రి వచ్చారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, ఉద్యోగుల పనితీరును ఆయన పర్యవేక్షించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో క్రైం రేట్‌ 90శాతం మేర తగ్గినందుకు ఉద్యోగులను అభినందించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలను నాటారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని సీఐకు సూచించారు. సీఎం కేసిఆర్‌ ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పనితీరు బాగుందని ప్రశంసించారు. ఇంకా బాగా కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్‌ను పూర్తిగా తగ్గించాలని అన్నారు. నిత్యం 3.50లక్షల సీసీ కెమెరాల నిఘాలో హైదరాబాద్‌ నగరం ఉందని, దీంతో హైదరాబాద్‌లో కూడా క్రైం రేట్‌ చాలా తగ్గిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న సీసీ కెమెరాలు నిందితులను పట్టుకునేందుకు సహకరిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో 10500 పోలీసు నియామకాలు జరిగాయని, మరిన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌, వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ కె.ఆర్‌.నాగరాజు, కాజీపేట ఏసీపీ నర్సింగరావు, ఎంపీ పసునూరి దయాకర్‌, వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాష్‌, హసన్‌పర్తి సీఐ పుప్పాల తిరుమల్‌, ఎస్సైలు సుధాకర్‌, రవీందర్‌, రాహుల్‌ గైక్వార్‌, కానిస్టేబుళ్లు నర్సయ్య, నాగేశ్వర్‌రావు, భాస్కర్‌, రాజసమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version