అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి

అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి. వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపుకు సంబందించిన డబ్బులను పనిచేయనివారికి పనిచేసినట్టుగా, రెగ్యులర్‌ ఉద్యోగలను క్యాంపులో భాయ్స్‌గా పనిచేసినట్టుగా తప్పుడు లెక్కలు రాసి వారి అకౌంట్లలో వేశారని, వీరిద్దరే కాకుండా బయట వారి అకౌంట్లను సేకరించి దొంగ పేర్లను రాసి అక్రమంగా చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేసుకున్న అవినీతి ఉద్యోగులను గుర్తించి వారిని సస్పెండ్‌ చేయాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సూరం రనీల్‌, రాజులు ఫ్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సీసీ కెమెరాలు ఎందుకు బంద్‌ చేశారో చెప్పాలి

డిఐఈవో కార్యాలయంలో ఏప్రిల్‌ నుండి మే వరకు కార్యాలయంలో ఎందుకు సీసీ కెమెరాలు బంద్‌ చేశారో డిఐఈవో ప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక వైపు సీసీ కెమెరాలను ప్రతి చోటా అమర్చుకోవాలని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, పోలాస్‌యంత్రాంగం చెబుతుంటే డిఐఈవో కార్యాలయంలో మాత్రం ఉన్న కెమెరాలను ఎందుకు బంద్‌ చేయాల్పి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం జిల్లా కమిటి డిఐఈవోను డిమాండ్‌ చేశారు. ప్రతి ఇంటర్మీడియట్‌ జూనియర్‌ కళాశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పే డిఐఈవో తాను తన కార్యాలయంలో ఎందుకు బంద్‌ చేయాల్సి వచ్చిందో అంతుచిక్కడం లేదని, పలు అనుమానాలకు తావునిస్తున్నదని వారు ఈ సందర్బంగా అన్నారు.

రాత్రి వేళలో ఆఫీస్‌లో ఉంటున్నదెవరు…?

ఇంటర్మీడియట్‌ ఆర్బన్‌ ప్రదానకార్యాలయంలో గత నాలుగు నెలల నుండి ఓ వ్యక్తి రాత్రి వేళలో కార్యాలయంలోనే ఉంటున్నాడని, అక్కడే నిద్రిస్తున్నాడని అతను నైట్‌వాచ్‌మెనా…? అపరిచిత వ్యక్తి ఏమైనా ఉంటున్నాడా…? అని అర్ధం కావడంలేదని రనీల్‌, రాజులు అంటున్నారు. ఆయన అధికారిక నైట్‌వాచ్‌మెనా…? ప్రైవేటు నైట్‌వాచ్‌మెనా? తెలియకుండా ఉన్నదని, అతను ఎవరో అధికారులే వెల్లడించాలని వారు కోరారు.

nadicheruvulo sedyapu kunta thavvakam, నడిచెరువులో సేద్యపు కుంట తవ్వకం

నడిచెరువులో సేద్యపు కుంట తవ్వకం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతుల వ్యవసాయ బావులు, బోర్లల్లో భూగర్భ జలాలు పెంపొందించడానికి వారి భూముల్లోనే పాంపౌండ్‌ (సేద్యపు కుంట)లను ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టి కొనసాగిస్తున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేయవలసిన పనులను రైతుల సొంత వ్యవసాయ భూముల్లో చేపట్టాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా నర్సంపేట డివిజన్‌లోని కొన్ని గ్రామాలల్లో పనులు చేపడుతున్నారు. గ్రామాల్లో సేద్యపు కుంటల నిర్మాణం చేపట్టడానికి సంబంధిత గ్రామ ఫీల్డ్‌ అసిస్టెంట్లు రైతుల వ్యవసాయ భూములతోపాటు పూర్తి వివరాలను పైఅధికారులకు వివరించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలోని కన్నెచెరువు వద్ద సేద్యపు కుంట పనులను జరుపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఫాంపాండ్‌ నిర్మాణ పనులను చెరువులోనే చేస్తున్నారని, దానివల్ల ఫలితం ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. చెరువులోనే పాంపౌండ్‌ నిర్మాణం చేయటం వలన వర్షాకాలంలో చెరువు పూర్తిగా నిండుతుందని తెలిపారు. చెరువులో తవ్వడం వలన లాభం ఏం జరుగుతుందని, చెరువులో నీరు ఉన్నా సేద్యపుకుంటలో నీరు ఉన్నా రెండు సమానమే అని తెలుపుతున్నారు. దీంతో ప్రభుత్వం వెచ్చిస్తున్న లక్షలాది రూపాయలు వథా అవుతున్నాయని, రైతుల భూముల్లో చేపట్టాల్సిన పనులను చెరువులో చేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

upadi hami panulu besh, ఉపాధిహామీ పనులు బేష్‌

ఉపాధిహామీ పనులు బేష్‌

హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బుర్ర శ్రీధర్‌, ఎపిఓ విజయలక్ష్మి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు పనులు చేస్తున్నారని, ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇంటి దగ్గరనే ఉండి గ్రామంలో ప్రతి ఒక్కరు పనులకు వస్తున్నారు. వందలమందికి పని దొరకడం వలన పనులకు వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు, ఎపిఓలు గుర్తించి ఇప్పటి వరకు సరిపడా పనిదినాలు పూర్తి చేస్తున్నారని అన్నారు. చెరువుల పూడికతీతలు, నర్సరీ పనులు జోరుగా సాగుతున్నాయని, కూలీలకు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు పనులు చేస్తున్నట్లు తెలిపారు.

drunk and drive thanikilu,  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా వరంగల్‌ సికేఎం హాస్పిటల్‌ ప్రాంతంలో మద్యం సేవించి, మైనర్లు వాహనాలు నడపడం ద్విచక్రవాహనాలకు వివిధరకాల శబ్దాలను చేసే సైలెన్సర్‌ వాహనాలకు లైసెన్సు ఇంకా ఇతర పత్రాలు లేని వాహనదారులకు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్‌ చేసిన వాహనదారులకు చాలాన్‌ వేసి కేసులు విధించడం జరిగిందని వరంగల్‌ ట్రాఫిక్‌ సిఐ టి.స్వామి తెలిపారు. ఇప్పటి వరకు 23వేల రూపాయలు జరిమానా విధించామన్నారు. ఇరుకుగా ఉండి ప్రధానంగా సికేఎం హాస్పిటల్‌లో ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చి వెళ్లే గర్భిణీ స్త్రీలకు ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వరంగల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ నుండి హాస్పిటల్‌ వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో పూల దుకాణాలు, ఇంకా వివిధ రకాల వ్యాపారస్తులు రోడ్లపై వస్తువులు ఉంచడం వల్ల వాహనదారులకు ఇబ్బంది అవుతుందని, అందులో మద్యం సేవించి, మైనర్లు ఇంకా త్రిబుల్‌ రైడింగ్‌ నివారించటానికి తనికీలు చేపట్టామని చెప్పారు. ఈ తనికీల్లో వరంగల్‌ ట్రాఫిక్‌ ఎస్సైలు, ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.

rjdga badyathalu swekarinchina jayapradabai, ఆర్జేడిగా బాధ్యతలు స్వీకరించిన జయప్రదబాయి

ఆర్జేడిగా బాధ్యతలు స్వీకరించిన జయప్రదబాయి

ఇంటర్మీడియట్‌ విద్య వరంగల్‌ నూతన ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడి)గా బి.జయప్రదబాయి గురువారం విధుల్లో చేరారు. హైదరాబాద్‌ డిఐఈఓగా పనిచేస్తున్న ఆమెను వరంగల్‌ ఆర్జేడి (పూర్తి అదనపు బాధ్యతలు)గా నియమిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఎ.అశోక్‌ జారీ చేసిన ఉత్తర్వులను అందుకుని వరంగల్‌ ఆర్జేడి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కార్యాలయ సూపరింటెండెంట్‌ కృష్ణమోహన్‌రెడ్డితోపాటు పలువురు సిబ్బంది ఉన్నారు.

gramala uvakule deshaniki pattukommalu, గ్రామాల యువకులే దేశానికి పట్టుకొమ్మలు

గ్రామాల యువకులే దేశానికి పట్టుకొమ్మలు

గ్రామాల్లో ప్రజలు స్నేహపూర్వకంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని డిసిపి నాగరాజు అన్నారు. గురువారం సాయంత్రం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో నర్సంపేట ఏసీపీ సునీతమోహన్‌ ఆధ్వర్యంలో కార్టన్‌సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిలో తనిఖీలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక ఆధార్‌కార్డులు పరిశీలన, గ్రామాల్లోని ద్విచక్రవాహనాలకు లైసెన్సులు, ఇన్సూరెన్సుతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలు లేని ద్విచక్రవాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా డిసిపి నాగరాజు మాట్లాడుతూ గ్రామాలల్లో రైతులు విత్తనాలు తీసుకొనేటప్పుడు కల్తీ విత్తనాలకు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఏసీపీ సునీతామోహన్‌ మాట్లాడుతూ వేసవికాలంలో ఆరుబయట నిద్రపోకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రతా సూచనలు పాటించాలని, చిన్న వయస్సులోనే మద్యానికి బానిసై అధిక వేగంతో ద్విచక్రవాహనాలు నడుపుతున్నారని యువతను ఉద్దేశించి మాట్లాడారు. నర్సంపేట టౌన్‌ సీఐ దేవేందర్‌రెడ్డి, నెక్కొండ సిఐ పెద్దన్నకుమార్‌, నర్సంపేట ఎస్సై నాగ్‌నాథ్‌, దుగ్గొండి ఎస్సై సాంబమూర్తి, చెన్నారావుపేట ఎస్సై జగదీష్‌, ఏఎసైలు, కానిస్టేబుల్స్‌, సిటీ గార్డ్‌ పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.

bamatho…boss, ‘భామ’తో…బాస్‌

‘భామ’తో…బాస్‌

‘గులాబి’ సినిమాలో హీరో హీరోయిన్‌తో బైక్‌పై చెక్కర్లు కొట్టే సన్నివేశం చూశాం. బైక్‌పైనే డ్యూయెట్‌ సాంగ్స్‌ పాడుకోవడం విన్నాం. అదంతా సినిమా మయం. సేమ్‌ అలాగే ప్రేమప్రయాణం సాగించాలనుకున్నాడో ఏమో..? మంచి బుద్దులు నేర్పాల్సిన ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా యువకుడై ప్రేమప్రయాణం చేస్తున్నాడు. పెళ్లీడుకొచ్చిన పిల్లలను పెట్టుకొని ఆ అధికారి ఓ మహిళతో ‘ప్రేమలీలలు’ సాగిస్తున్నాడు. వీరి ప్రేమ ఏకంగా ఆ అధికారి పనిచేసే కార్యాలయంలోనే కలుసుకునేంత వరకు వచ్చింది. హద్దులు మీరిన వీరి ప్రేమ సరసానికి కార్యాలయంలోని సీసీ కెమెరాలు సైతం సిగ్గుపడి తలదించుకునే పరిస్థితికి వచ్చింది.

( ‘భామ’తో…బాస్‌ లీలలు త్వరలో…)

rjdnyna…kammestham…,’ఆర్జేడి’నైనా…కమ్మేస్తాం…?

‘ఆర్జేడి’నైనా…కమ్మేస్తాం…?

నేను తలుచుకుంటే ఎవ్వరినైనా మేనేజ్‌ చేయగలను…నాకు ఇంటర్‌బోర్డులో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి..కమీషనర్‌ నాకు బాగా క్లోజ్‌..గతంలో ఓ ఆర్జేడిని సస్పెండ్‌ చేయించింది ఎవరో తెలుసా…కళ్లు మూసుకొని ఎన్నో ప్రైవేటు కాలేజీలకు చిటికెలో అనుమతులు ఇచ్చినోన్ని…గప్పుడే నన్ను ఏం చేయలేకపోయారు..గిప్పుడు ఎవరొస్తరు..ఏం చేత్తరు…ఇంతకంటే ఆఫీస్‌లో పెద్దమొత్తంలో అవినీతి జరిగిన దాఖలాలు లేవా..? మనం నొక్కింది ఏమన్నా కోట్ల రూపాయాలా..? కేవలం లక్షలే కదా..! దీనికి భయపడుడెందుకు..నేనున్నా..మీరు ధైర్యంగా ఉండండి… అన్ని నేను చూసుకుంటాను…నా వాటా నాకు ఇవ్వండి చాలు, మిగితావన్ని నేను మేనేజ్‌ చేస్తా…అంటున్నాడట ఓ అధికారి. ఇదంతా వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులకు ఆ అధికారి భరోసాను కల్పిస్తున్నాడని ఈయన అండదండలతోనే వారు అవినీతికి పాల్పడ్డారని పలువురు చర్చించుకుంటుండటంతో ఆ నోటా..ఈ నోటా విషయం మొత్తం జిల్లాను దాటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీరి అవినీతి భగోతాన్నే మాట్లాడుకుంటున్నారని సమాచారం.

ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు…

అవినీతి లీలలపై విచారణ కమిటి వేస్తే దొరికిపోవడం ఖాయం సార్‌..అంటున్న కొందరి ఉద్యోగులతో మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు..నాకు ఇంటర్‌బోర్డులో పెద్దసార్లు తెలుసు నేను ఎలాచెబితే అలా వింటారు..అసలు కమిటి వేయరు..వేసినా ఇక్కడి రాక ముందే మేనేజ్‌ చేస్తాను, మీరు ఏం భయపడవద్దని అవినీతికి పాల్పడిన దొంగలకు ధైర్యం చెబుతున్నాడని బయట ప్రచారం జరుగుతున్నది.

నా వాటా నాకు ఇస్తే చాలు

మీరెంతన్నా నొక్కండి..నొక్కేసిన దాంట్లో నాకు మాత్రం నా వాటా ఇస్తే చాలు మిగితావన్ని నేను చూసుకుంటాను, రిజిష్లర్లు మార్చుడు, బిల్లులు సృష్టించుడు, దొంగసంతకాలు చేసుడు, దొంగ పేర్లను ఎంట్రీ చేసుడు, లేని సంతకాలు పెట్టుడు, దొంగల అకౌంట్లు ఇక్కడ భాయ్స్‌గా పని చేసినవారేనని చెప్పుడు.. ఎంతసేపు పని మీరేమి భయపడకండి, నా వాటా నాకు ఇస్తే గివన్ని మేనేజ్‌చేసుడు పెద్ద సుతారమా..? అని ఓ అధికారి వీరికి కొండంత అండగా నిలుసున్నాడని, అతని పేరు చెప్పకుండా కొంతమంది గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

si vedipulaku yuvakudu bali, ఎస్సై వేధింపులకు యువకుడు బలి

ఎస్సై వేధింపులకు యువకుడు బలి

సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల గొడవ విషయంలో తలదూర్చిన సంగెం ఎస్సై నాగరాజు ఇజ్జిగిరి కార్తీక్‌ను పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తన కుమారుడిని తీవ్రంగా కొట్టిన విషయంలో కార్తీక్‌ తండ్రి లక్ష్మిపతి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఎస్సైపై చర్యలు తీసుకోక ముందే కార్తీక్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఎస్సై నాగరాజు ఓవరాక్షన్‌ మూలంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడాని మృతుడి తండ్రి లక్ష్మిపతి ఆరోపించారు. శవాన్ని సైతం పోస్టుమార్టమ్‌ త్వరగా చేయకుండా అడ్డుకుంటున్నారని తన కోడలుపై తప్ప ఎస్సైపై ఎలాంటి ఫిర్యాదు చేయవద్దని సీఐ తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని లక్ష్మిపతి ఆరోపించారు. భార్యాభర్తల గొడవలు పరిష్కారం చేయమని కౌన్సిలింగ్‌ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళితే తన కుమారుడిని తీవ్రంగా చితకబాది ఆత్మహత్య చేసుకునేలా చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడి చావుకు కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

cini prashamsinchina cp, సీఐను ప్రశంసించిన సీపీ

సీఐను ప్రశంసించిన సీపీ

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ప్రశంసించారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డిని పోలీసుల సమక్షంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదేనని తెలిపారు. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసుశాఖకే గౌరవం తీసుకువస్తాయని ఉద్ఘాటించారు.

pds biyyam pattivetha, పిడిఎస్‌ బియ్యం పట్టివేత

పిడిఎస్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్‌ బియ్యాన్ని ఆర్‌పిఎఫ్‌ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఆర్‌పిఎఫ్‌ ఎస్సై కె. రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం…తాను, తన సిబ్బంది తమ విధినిర్వహణలో భాగంగా టిఎన్‌ 17201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో తనిఖీలు చేపట్టారు. తనికీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్‌ బియ్యం బస్తాలు కనిపించడంతో అవి ఎవరివి అని విచారించారు. వాటిని తరలిస్తున్న వారెవరు ఎవరు చెప్పకపోవడంతో ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది లైసెన్స్‌ పోర్టర్‌ల సహకారంతో అక్రమంగా తరలిస్తున్న 25బస్తాలు సుమారు 800కిలోల పిడిఎస్‌ బియ్యంపై తగు చర్య తీసుకునేందుకు రైల్వేస్టేషన్‌లోనే దించివేశామని తెలిపారు. అనంతరం వీటిని సివిల్‌ సప్లై అధికారులకు అప్పగించనున్నారు.

bakthajana sandramga kondagattu divyakshtram, భక్తజన సంద్రంగా కొండగట్టు దివ్యక్షేత్రం

భక్తజన సంద్రంగా కొండగట్టు దివ్యక్షేత్రం

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో అర్ధరాత్రి నుంచే ఆలయం కిక్కిరిసిపోయింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా కఠోరదీక్షతో ఇరుముడితో తరలివచ్చిన మాలదారులు అంజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించుకుని దీక్ష విరమణ చేస్తున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఏ వైపు చూసినా రామనామ జపంతో ఆలయం మారుమోగింది.

గట్టి భద్రతా ఏర్పాట్లు

జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో 450మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. ఎస్పీ సింధూశర్మ దగ్గర ఉండి భద్రతను పర్యవేక్షించారు.

gananga hanuman jayanthi vedukalu, ఘనంగా హనూమాన్‌ జయంతి వేడుకలు

ఘనంగా హనూమాన్‌ జయంతి వేడుకలు

వర్థన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ జయంతి, దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు బుధ, గురువారాలు రెండురోజులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ కౌడగాని కవితరాంబాబు, శివాని విద్యాసంస్థల చైర్మన్‌ తాళ్లపల్లి స్వామి, శుభనందిని సంస్థల చైర్మన్‌ కౌడగాని రాంబాబు, గ్రామ పాలకవర్గం, ఆలయ కమిటి సభ్యులు, గ్రామస్తులు పాల్గోన్నారు.

acb valalo vro, ఏసీబీ వలలో విఆర్వో

ఏసీబీ వలలో విఆర్వో

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని మద్దివంచ విఆర్వో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుధవారం మద్దివంచ గ్రామ విఆర్వో శివరావు 1.40లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

bahirangamga urithiyali, బహిరంగంగా ఉరితీయాలి..

బహిరంగంగా ఉరితీయాలి..

యాదాద్రి జిల్లా వలిగొండలో వికలాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను వెంటనే ఉరితీయాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం చిలుకూరు మండల రామాపురం గ్రామంలో అత్యాచారం చేసిన వ్యక్తి మహేందర్‌పై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా పోలిసులు వ్యవహరించిన తీరుపై వికలాంగుల సంఘాలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఐనవోలు మండలకేంద్రంలో సింగారం గ్రామంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశంలో జన్ను రాజు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర హోంమంత్రి వెంటనే స్పందించాలని, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగ మహిళలపై రోజుకు ఒక్కో ప్రాంతంలో ఏదో చోట అత్యాచారాలకు పాల్పడుతున్న సకలాంగులపై చర్యలు తీసుకోవడంలో, వికలాంగుల మహిళలకు రక్షణ కల్పించడంలో తెలంగాణా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. వికలాంగుల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపి స్థాయిలో సమీక్షా నిర్వహించి వికలాంగ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన 2016 వికలాంగుల చట్టాన్ని అమలుచేయాలని, తీసుకువచ్చేందుకు కషి వలిగోండలో వికలాంగురాలు బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోనీ పోలీసులను ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికీ న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వాలు వికలాంగులకు ఒక న్యాయం, సకలాంగులకు మరో న్యాయంలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సకలాంగుల మహిళపై అత్యాచారాలు జరిగితే నిర్భయ చట్జాలు తెచ్చిన ప్రభుత్వాలు, వికలాంగుల మహిళలపై అత్యాచారాలు జరిగితే అదే రీతిలో ఎందుకు స్పందించారని అన్నారు. గతంలో జానారెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో వరంగల్‌ జిల్లాలో ప్రణీత, స్వప్నిక అనే ఇద్దరు యువతులపై యాసిడ్‌ దాడీ జరిగితే అప్పటీ ప్రభుత్వం అత్యాచారం చేసిన వారిపై ఎన్‌కౌంటర్‌ చేసిందనీ, మరి ఇప్పుడు వికలాంగుల మహిళలపై రోజురోజూకు అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వాలు ఎన్‌కౌంటర్‌కు సహకరించడం లేదని, ప్రభుత్వాలు వికలాంగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్‌ వరంగల్‌ జిల్లా ఇంచార్జ్‌ మడిగె నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగారపు స్వామి, మండల అధ్యక్షుడు తాటికాయల రమేష్‌, సారయ్య, ఎల్లయ్య, హైమవతి, సతీష్‌, కుమార్‌, రమ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీర శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూపాటి ఆనంద్‌, బొందయ్య, దుగ్గొండి మండల తెలుగు యువత అధ్యక్షుడు పెంచాల సతీష్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.

దుగ్గొండిలో…

దుగ్గొండి మండలకేంద్రంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు, మల్లంపల్లి సర్పంచ్‌ చుక్క రమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హర్షం రాజయ్య, బూర్గు రవీందర్‌గౌడ్‌, రమేష్‌లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ధర్నాను విజయవంతం చేయాలి

ధర్నాను విజయవంతం చేయాలి

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో పోరాటకారులను విడిపించుట కోసం ఈనెల 31న చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సలేంద్ర వెంకటేశ్వర్లు, గుంటి ప్రకాష్‌, చింతకింది శ్రీను, నల్ల రవీందర్‌, గొడిశాల ప్రత్యుష, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇంచార్జ్‌ డ్యాగల శ్రీనివాస్‌, మన్నే రామ్మోహన్‌, సనవులుల స్వామి, మర్రి రాజు, కోమండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

illaku current cut, ఇళ్లకు కరెంట్‌ కట్‌

ఇళ్లకు కరెంట్‌ కట్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పథకం కార్యక్రమంలో మరుగుదొడ్లను నిర్మాణం పనులు పూర్తిచేయని లబ్ధిదారుల ఇళ్ల విద్యుత్తు కనెక్షన్‌లను గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు. ప్రభుత్వం గతం నుండే మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయని వారి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించినప్పటికీ కొందరు లబ్ధిదారులు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించడంతో వారు అన్నంత పని చేశారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయని లబ్ధిదారులను ఇటీవల గుర్తించి స్థానిక ఎంపిడిఓ కొద్ది రోజుల వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని తెలిపిన విషయం తెలిసిందే. మంగళవారం చంద్రయ్యపల్లి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి శతి ఆధ్వర్యంలో మరుగుదొడ్ల తనిఖీలను నిర్వహించారు. లబ్ధిదారులు నిర్మాణ పనులను ఏమాత్రం చేయకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడడంతో వారి ఇంటి విద్యుత్తు కనెక్షన్లను సిబ్బంది సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 31లోపు పూర్తిచేసుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బరిగెల లావణ్య కిషోర్‌, ఉపసర్పంచ్‌ బాషబోయిన శ్రీనివాస్‌, రాజేశ్వర్రావుపల్లి సర్పంచ్‌ యువరాజు, కారోబార్‌ కొల్లాపురం కోటిలింగం, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మాటేటి శ్రీను, సిబ్బంది రజనీకర్‌, ఎల్లయ్యలు పాల్గొన్నారు.

hanuman jayanthi utsavalu, హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

హసన్‌పర్తి మండలంలోని సూదన్‌పల్లి గ్రామంలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరు కొబ్బరికాయతో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. రామనామస్మరణతో గ్రామమంతా మార్మోగింది. గ్రామంలోని ఆలయానికి పెద్దఎత్తున హనుమాన్‌ దీక్షా స్వాములు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

prathyaka adhikariniki sanmanam, ప్రత్యేక అధికారిణికి సన్మానం

ప్రత్యేక అధికారిణికి సన్మానం

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పదవతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఆ పాఠశాల ప్రత్యేక అధికారిణి మంజులను జిల్లా కలెక్టర్‌ గుండ్రాతి హరిత, ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్‌లు హరిత ప్రసాదం (మొక్క), శాలువాతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిణి మంజుల మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో నిరుపేద విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని తెలిపారు. అందుకు గుర్తించిన ప్రభుత్వం అవార్డుతో పాటు పాఠశాల అభివద్ధి కోసం 50వేల నగదు పారితోషికాన్ని అందిస్తున్నదని అన్నారు. నగదు బహుమతిని జూన్‌ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కలెక్టర్‌ చేతుల మీదుగా అందుకోనున్నట్లు ప్రత్యేకాధికారిణి మంజుల తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకురాళ్లు సుభాషిని, స్రవంతిలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version