vanda shatham uthirnatha, వందశాతం ఉత్తీర్ణత

వందశాతం ఉత్తీర్ణత

నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం మల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులు మొట్టమొదటిసారిగా వందశాతం ఉత్తీర్ణత సాధించి రికార్డును సష్టించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. దుగ్గొండి మండలం మల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 36మంది విద్యార్థినులు విద్యాభ్యాసం అభ్యసించి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల మాట్లాడుతూ 36మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారని, అందులో వందశాతం ఉత్తీర్ణత సాధించారని, జెట్టీ నిహారిక అనే విద్యార్థిని 9.3 జిపిఎ సాధించి మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు, సహకరించిన అధ్యాపక బందానికి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *