సహకార సంఘం ద్వారా బీమా చెక్కు పంపిణీ..

సహకార సంఘం ద్వారా బీమా చెక్కు పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం ద్వారా బాధిత కుటుంబానికి భీమ చెక్కును డిసిఓ కార్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రారు రాజేశ్వరి చేతుల మీదుగా అందజేశారు.కుందారం గ్రామానికి చెందిన బొమ్మన మధుమోహన్ రెడ్డి ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందాడు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జైపూర్ లో మృతుడు పంట రుణం తీసుకున్నాడు.అతని పేరుతో భీమా కంపెనీకి సొసైటీ ద్వారా ఇన్సూరెన్స్ చేయించారు.దీనితో రూ2 లక్షల ఇన్సూరెన్స్ బీమా కంపెనీ ద్వారా మంజూరు కాగా మృతునికి నామినిగా ఉన్న అతని తండ్రి బాపురెడ్డికి శనివారం స్థానిక సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ అధికారులు ఏడిసిసి బ్యాంక్ సిబ్బంది చెక్కును అందించారు.ఈ కార్యక్రమంలో ఏడిసిసి బ్యాంక్ మేనేజర్ కోన శ్రీనివాస్,పిఏసిఎస్ సీఈవో డేటి అర్జున్ కుమార్,పిఎసిఎస్ వైస్ చైర్మన్ సంతోషం, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version