vithanthuvulaku samanastanam ivalli, వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి

వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి సమాజంలో వితంతువులకు సమానస్థానం ఇవ్వాలని మడిపల్లి సర్పంచ్‌ చీర సుమలత విజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మడిపల్లి వాటర్‌ప్లాంట్‌ ఆవరణలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్పంచ్‌ సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అందించాలని అన్నారు. అన్నిరంగాల్లో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈనెల 23వ తేదీన వితంతు దినోత్సవం సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. వీధులలో…

Read More