శ్రీద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Hanumakonda

శ్రీద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి,శివ మార్కండేయ, సుబ్రహ్మణ్య స్వామి,పంచముఖ ఆంజనే యస్వామి,ఆదిత్యాది నవగ్రహ దేవాలయం సముదాయము సుందరముగా నిర్మాణము చెయ్యడం జరిగింది. స్వామి వారిని దర్శింప వచ్చిన భక్తుల పట్ల కోరిన కోర్కెలు కొంగు బంగారం అగుచూ ప్రముఖ క్షేత్రం నందు ఒకటిగా ఈ దేవాలయము పరిగణించ బడుతున్నది ప్రత్యేక తెలంగా ణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుట ద్వారా తెలంగాణ రాష్ట్రం నందు హనుమకొండ జిల్లాలోని శాయంపేట గ్రామం యొక్క విశిష్టతను చాటు తుంది. ప్రతిష్ట జరిగే ద్వాదశ సంవత్సరములు అగుచున్న సందర్భంలో స్వస్తిశ్రీ విశ్వవసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ బుధవారం తేదీ 30- 04- 2025 నుండి 3-05-2025 షష్టి శనివారం వరకు ద్వాదశ వార్షికోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడుచున్నవి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని ప్రజలను కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!