spandana, ‘నేటిధాత్రి’కి స్పందన

‘నేటిధాత్రి’కి స్పందన

‘స్మశనమే తనదంటున్నాడు’ శీర్షికతో ‘నేటిధాత్రి’లో ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. సర్వే నెంబర్‌ 700లోని పెద్దమ్మగడ్డ స్మశన స్థలం కబ్జాకు గురైందని విషయాన్ని వెలుగులోకి ‘నేటిధాత్రి’ తీసుకురావడంతో కథనానికి స్పందించిన వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ఇటీవల ఏర్పాటు చేసిన భూబాదితుల ప్రత్యేక సెల్‌ అధికారి అయిన బోనాల కిషన్‌ విచారణ నిమిత్తం శనివారం పెద్దమ్మగడ్డ స్మశనవాటిక స్థల పరిశీలనకు పంపించారు. విచారణకు వెళ్లిన సీఐ ఇరువర్గాలతో మాట్లాడి తమ వద్ద ఉన్న ఆధారాలను తీసుకురావాలని వారికి చెప్పానని సీఐ బోనాల కిషన్‌ తెలిపారు. ఇరువర్గాలు తీసుకువచ్చే ఆధారాల ఆధారంగా నిజనిజాలను నిగ్గుతేల్చుతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *