పసుపు అంచనాలు పటాపంచాలు

పసుపు అంచనాలు పటాపంచాలు

కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ చంద్రబాబు గెలుస్తాడని తమ అంచనాలు ప్రకటించగా నిన్న మొన్నటి వరకు పసుపు శిబిరంలో కొంత ఉత్సాహం నెలకొంది. ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి తన పార్టీ గెలుపుపై కాసింత అనుమానంతో ఉన్న చంద్రబాబుకు ఎగ్జిట్‌ పోల్స్‌ కొంత ఊరటనివ్వగా, బాబు గెలుస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు. ఆంధ్ర ప్రజలు మాత్రం అందుకు వ్యతిరేకంగా తీర్పునిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ 130 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుండగా టిడిపి కేవలం 29స్థానాల్లో తన అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కొంత మైర అయినా ప్రభావం చూపుతున్న జన సేన ఒకే ఒక స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం ఆంధ్రలో వైఎస్సార్‌సీపీ తన హావాను కొనసాగిస్తోంది. 13స్థానాల్లో అధిక్యాన్ని కనబరుచుతుండగా టిడిపి ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తానికి వైఎస్సార్‌సీపీ ఆంధ్రలో గెలుపు సునామీని సృష్టించబోతుందని స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *