చెరువులో పడి వ్యక్తి మృతి
బాలానగర్ /నేటి ధాత్రి :
చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య (42), చిట్టెమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం.. కుమారుడు కార్తీక్ ను ఇంటికి పంపించి వెంకటయ్య గ్రామంలోని మైసమ్మ చెరువులో పడి మృతి చెందాడు. శనివారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.