మండల ప్రధాన కార్యదర్శిగా వనపర్తి సతీష్ మర్రిగడ్డ
చందుర్తి, నేటిధాత్రి:
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యకల పరుశురాం సూచన మేరకు , చందుర్తి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ,మండలం ప్రధాన కార్యదర్శి గా వనపర్తి సతీష్ ని మండల ఉపాధ్యక్షునిగా హనుమయ చారి ని ,మండల అధికార ప్రతినిధిగా మటకం మల్లేశం ,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా చిగుర్ల మల్లేశం, కార్యదర్శిగా వట్టిమల్ల రవి, బొరిగే ప్రసాద్ లను, నియమిస్తూ జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం నియామక పత్రం అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బైరగోని గోపి గౌడ్, అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ ,వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ అరుణ్ తేజ చారి, చందుర్తి మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.