వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ ఆధ్వర్యంలో వేడుకలు
దళిత జర్నలిస్టుల ఫోరమ్ ఆద్వర్యం లో పలువురికి సన్మానం
దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చట్టం అమలు చేయాలి
అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షలు దళిత జర్నలిస్టులకు అందజేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెంలో 09 డిసెంబర్ దళిత జర్నలిస్టుల ఫోరమ్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కాషాపోగు జాన్ ఆదేశాల మేరకు దళిత జర్నలిస్టు ఫోరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్న కుమార్ ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టుల ఫోరమ్ 10 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కొత్తగూడెం ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా కేకులు కట్ చేసి అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న దళిత నాయకులను నాయకురాళ్లను పలువురిని దళిత జర్నలిస్టు పోరం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టు ఫోరం ద్వారా దళిత జర్నలిస్టుల సమస్యల కొరకు గత పది సంవత్సరములుగా అలుపెరుగని పోరాటం చేస్తూ దళిత జర్నలిస్టులను చైతన్యం పరుస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దళితులు అంటేనే చులకనగా చేసే ఈ సమాజంలో దళిత జర్నలిస్టు సమస్యలను నిరంతరం పోరాటం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జాన్ సెక్రటరీ డేవిడ్ రాష్ట్రప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లడం జరిగింది. దళిత జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చట్టం అమలు చేయాలని దళిత బంధు లాగా అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షలు దళిత జర్నలిస్టులకు మొదటి విడతగా అందజేయాలని. డబల్ బెడ్ రూములు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో దళిత జర్నలిస్టులకు మొదటి విడుదల అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి యువజన మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ , అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, జర్నలిస్ట్ బరిగెల భూపేష్ కుమార్. మేదిని లక్ష్మి రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి మహిళా సమైక్య నాయకురాలు కరిష రత్నకుమారి నక్క సృజన కూరపాటి రవీందర్ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు బరిగెల సంపూర్ణ . దళిత జర్నలిస్టు ఫోరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ శెట్టి గోపి రవీందర్ బుపేష్ నాగయ్య వినోద్ వికాస్ తదితర నాయకులు పాల్గొన్నారు దళిత జర్నలిస్ట్ ఫోరం సభ్యులు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.