బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మూెత్సవాలు జరుగుతున్న సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నూతనంగా ఎంపికైన మహబూబాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితలు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఆలయ ధర్మకర్త వారికి ఘనంగా స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ జడ్పీటిసి అభ్యర్థి ఆకుల శ్రీనివాస్‌, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బీరం సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్‌ మురళి, హేమచందర్‌గౌడ్‌, కమలాకర్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *