athmiya sanmanam, ఆత్మీయ సన్మానం

ఆత్మీయ సన్మానం

గ్రేటర్‌ వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌కు గురువారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మానం కార్యక్రమం వరంగల్‌ తూర్పు వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ చౌరస్తాలోని ఆర్యవైశ్య భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు వర్కింగ్‌ జర్నలిస్టు సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మేయర్‌ గుండా ప్రకాష్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని, వరంగల్‌ తూర్పు వర్కింగ్‌ జర్నలిస్టులు చేసిన సత్కారాన్ని తాను మర్చిపోలేనని అన్నారు. జర్నలిస్టుల ఇండ్ల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి జర్నలిస్టులకు గహాలను అందేలా కషి చేస్తానని తెలిపారు. ప్రజల సేవకే అంకితం కావాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, నగర అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *