anni vidala adukuntam,  అన్ని విధాల ఆదుకుంటాం

అన్ని విధాల ఆదుకుంటాం

కిడ్ని వ్యాధితో మృతిచెందిన అనుముల రమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. వివరాల్లోకి వెళితే…మండలంలోని నాగపురానికి చెందిన అనుముల రమ కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం నగరంలోని మ్యాక్స్‌కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌, ఎంపిపి మార్నేని రవిందర్‌రావులు ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా రమ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉండి వారిని ఆదుకుంటామని అన్నారు. అనంతరం వారి కుటుంబానికి ఆయన ఆర్ధికసహాయం చేశారు. మృతురాలికి భర్త సంపత్‌, కుమార్తెలు శిరిష (25), అనూష(21)లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *