Manasa Enters International Wonder Book Record
ఇంటర్ నేషనల్ వండర్ బుక్ రికార్డ్ లో స్థానం పొందిన మానస
తాండూర్ (నేటి ధాత్రి):
బెల్లంపల్లి పట్టణం లోని వేముల మానస శ్రీనివాస్ 2800 (రెండు వేల ఎనిమిది వందల) శ్లోకాలను 150 నిమిషాలలో ఆగకుండా పాడి ఇంటర్ నేషనల్ వండర్ బుక్ రికార్డ్ లో స్థానం సంపాదించిన పొందారు.అలాగే శ్రీ సత్యమేవ జయతే సేవ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఆసం అశోక్ మాట్లాడుతూ
మన జిల్లా నుండి ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు లో స్థానం కలగడం అంటే స్ర్తీ శక్తి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే అని అన్నారు.మహిళలందరూ మన సంస్కృతి పట్ల అవగాహన కలిగి ఆధ్యాత్మికత కలిగిన జీవితం ఎంతో స్పూర్తిని ఇస్తుందని జీవన విధానంలో కూడా మంచి విలువలతో,సంప్రదాయాలతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్యమేవ జయతే జిల్లా కో ఆర్డినేటర్ ఆసం అశోక్,రెవెల్లి రాజలింగు,శనిగారపు స్వామి,సాయి,రజిత, మమత తదితరులు పాల్గొన్నారు.
