సామాజిక కార్యకర్త సతీమణి జన్మదినం సందర్బంగా నిరుపేదలకు అన్నదానం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త ముద్దం భాస్కర్ సతీమణి జన్మదినం సందర్బంగా పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు 40 కుటుంబాలకు అన్నదానం చేసి మానవత్వం చాటాడు. తను నివసిస్తున్న గ్రామంలో నిరుపేదలు అకలితో అలమటిస్తారని వారికి ఏదో విధంగా సహయం చేయాలని భావించిన ముద్దం భాస్కర్ తన సతీమణి జన్మదినం సందర్బంగా అన్నదానం చేసి వారి చిరునవ్వు లకు కారణం అయ్యాడు. అలాగే వారిని దాతలు వస్తు రూపేణా, ధన రూపేణా అదుకోని వారి జీవితానికి దారి చూపాలన్నారు. అన్నదానం చేసిన ముద్దం దంపతులకు మేలు జరిగాలని ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *