మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు

నేటిధాత్రి చేర్యాల…

చేర్యాల :గత కొన్ని రోజుల క్రింద హైదరాబాద్ లో మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పుల్లని వేణు మాట్లాడుతూ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఒక పబ్బు నుండి తీసుకెళ్లి మైనర్ బాలిక పైన ఐదుగురు నిందితులు అత్యాచారానికి పాలుపడడం జరిగిందని వాళ్లని కఠినంగా శిక్షించాలని అత్యాచారం పాల్పడినటువంటి వ్యక్తులు ఎంత పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులైనా అందరిలాగానే శిక్షించాల్సిందే అని అదేవిధంగా నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏవిధంగా ఉందనేది మనకు అర్థం చేసుకోవచ్చు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు లేని యెడల ఏఐఎస్ఎఫ్ గా అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *