మళ్ళీ బావిలో పాకురు, నిండిన చెత్త

 

గతంలో తాత్కాలిక చర్యలు, తొంగి చూడాలి అధికారులు

నిర్లక్ష్యంపై గ్రామ ప్రజల అసహనం

కొడిమ్యాల, నేటిధాత్రి:జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మంచినీటి బావిలో పాకూరు, చెత్తతో నిండి ప్రజల పాలిట శాపంగా మారింది. కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డులకు మంచి తాగు నీరు అందించే మంచి నీళ్ల బావి పడువడ్డ బావిలా చెత్త, పాకురు నిండి భయంకరంగా అయింది. అ బావి నీళ్ళే నిత్యం ప్రజలు తాగడం, కనీసం బావిని శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీళ్లు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం పలు అయ్యే అవకాశం ఉన్నందున, గతంలో కూడ తాత్కాలిక చర్యలు చేపట్టారాని, సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *