ప్రగతి రాజ్యం…సంక్షేమ భారతం!

`దేశమంతా సస్యశ్యామలం చేద్దాం!

`దేశంలో సాగు విప్లవం తీసుకొద్దాం.

`వ్యవసాయ రంగంలో తిరుగులేని శక్తిగా మారుద్దాం!

`దేశమంతా సాగుకు ఉచిత విద్యుత్‌ అమలు చేద్దాం.

`నదుల నీళ్లను పొలాలకు మళ్లిద్దాం.

`ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిద్దాం.

`దళితుల జీవితాలలో వెలుగులు నింపదాం.

`అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ఐక్యంగా సాగుదాం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సంకల్ప సాధకుడు దేశంలో సాగు విప్లవ శంఖం పూరిస్తున్నాడు. బిజేపిపై రాజకీయ సమర నాదం మొదలుపెట్టాడు. దేశంలో ప్రగతి శీల భావనలు నిండాలి. నాయకులలో అంకిత భావం పెంపొందింప బడాలి. మత పరమైన రాజకీయాలు కాదు,మానవత్వం నిండిన రాజకీయాలు కావాలి అన్నదే భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ లక్యం. బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటన తర్వాత తొలిగా మరో తెలుగు రాష్ట్రంలో పార్టీ కార్యవర్గం ప్రకటన జరిగింది. ఆంద్రప్రదేశ్‌ నుంచి వందలాది మంది నాయకులు, వేలాది మంది కేసిఆర్‌, బిఆర్‌ఎస్‌ అభిమానులు హైదరాబాదు వచ్చారు. తెలంగాణ భవన్‌ లో బిఆర్‌ఎస్‌ పార్టీ లో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి జరగాలన్నా అది కేసిఆర్‌ తోనే సాధ్యమౌతుందని ప్రజలు నమ్ముతున్నారనేది ఆ నాయకుల చేరికతో తేలిపోయింది. తోట చంద్రశేఖర్‌ అధ్యక్షుడు గా, మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు, పార్థసారథి లాంటి వాళ్లు బిఆర్‌ఎస్‌ లో చేరారు. దేశంలోని 4123 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయడానికి ఇప్పుటి నుంచే అడుగులు పడాలి. బిఆర్‌ఎస్‌ దేశమంతా విస్తరించాలి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ గెలవాలి. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడాలి. కేసిఆర్‌ నేతృత్వంలో దేశ పాలనలో సుభిక్షం కావాలి. లక్ష కిలోమీటర్ల పయనమైనా ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి. ఎంతటి లక్ష్యమైనా సాధించే పట్టుదల కావాలి. బిఆర్‌ఎస్‌ దేశ పురోగతికి కొత్త మార్గం కావాలి. ఒకనాడు ప్రజలు కలుగన్న తెలంగాణ ను ఎలా ఆవిష్కరించాడో…దేశాన్ని కూడా కేసిఆర్‌ అలాగే సంక్షేమ, ప్రగతి విప్లవాలు ఆవిష్కరించాలి. 

ప్రగతి రాజ్యం…సంక్షేమ భారతం! 

నిర్మాణం జరగాలి. అందుకు ప్రజల మద్దతు కావాలి. నాయకుల ప్రోద్బలం వుండాలి. దేశ సమైక్యత, సమగ్రత ఎంత ముఖ్యమో దేశ ప్రగతి కూడా అంతే ముఖ్యం. పైకి మేకిన్‌ ఇండియా అని గొప్పలు చెప్పుకొని ఎల్ల కాలం రాజకీయాలు చేయాలని చూసే నాయకులు వుండడం దౌర్భాగ్యం. ఓ వైపు దేశంలో ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్భనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచం మాంద్యం బారిన పడే అవకాశాలున్నాయి. ఇవన్నీ వదిలేసి మతపరమైన అంశాలతో దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న బిజేపిని అధికారం నుంచి తొలగించితే తప్ప ముక్తి లేదు. మన దేశంలో అనేక వనరులున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో వున్నారు. మానవ వనరులకు కొదువ లేదు. అయినా ఇప్పటికీ చైనా లాంటి దేశాల మీద ఆధారపడి జాతీయ జెండాలు కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏమిటని కేసిఆర్‌ ప్రశ్నించారు. ఎనభైవ దశకంలో మన దేశం కన్నా చాలా వెనుకబడిన దేశం చైనా. మరి ఇప్పుడు ప్రపంచమంతా చైనా ఆధారపడే స్థితి చేరుకున్నది. మనం మాత్రం ఎదుగూ, బొదుగూ లేకుండా అక్కడే వున్నాము. మేకిన్‌ ఇండియా పేరు మాత్రమే. వచ్చే వస్తువులు అన్నీ చైనా నుంచే..! ఈ పరిస్థితి మారాలి. దేశమంతా ఒకే పన్ను అని పన్నుల మీద పన్నులు వడ్డిస్తున్నారు. సామాన్యుల నడ్డీ విరుస్తున్నారు. జిఎస్టీ పేరు చెప్పి కొన్ని లక్షల చిన్న తరహా పరిశ్రమలు మూత పడేలా చేశారు. కొన్ని కోట్ల మందికి ఉపాధి లేకుండా చేశారు. చైనా నుంచి సరుకులు దిగుమతి చేసుకొని, మన పొట్ట మనమే కొట్టుకునేలా? చేయడమేనా పాలన అని కేసిఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు మూలంగా ఒరిగింది లేదు. దేశం కోసం, ధర్మం కోసం అని బిజేపి చెప్పే మాటల్లో నిజం లేదన్నది ప్రజలు అర్థం చేసుకునేలా చేయడానికి కేసిఆర్‌ తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లనున్నారు. పాలకులకు సంక్షేమ రాజ్య భావన వుండాలి. అది కేసిఆర్‌ నాయకత్వంలా వుండాలని ఇప్పటికే అనేక రాష్ట్రాల నాయకులు కేసిఆర్‌ ను కొనియాడుతున్నారు. 

దేశమంతా సస్యశ్యామలం చేద్దాం!

 తెలంగాణ సస్యశ్యామలం చేసి చూపించాడు. కేసిఆర్‌ ఎప్పుడూ మాటలు చెప్పడు. పట్టు పడితే సాధించే వరకు వదలడు. అసలు తెలంగాణ రావడమే గగనమని అనుకున్నాం. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటయ్యాక అనేక ఉద్యమాలు జరిగాయి. చప్పున చల్లారిపోయాయి. కారణాలు ఏవైనా కావొచ్చు. లక్ష్యం కోసం అన్నీ త్వజించిన నాయకులు లేరు. పదవులకు లొంగిపోయారు. కానీ కేసిఆర్‌ పదవులను గడ్డిపోచలుగా వదులుకున్నాడు. తెలుగు దేశం పార్టీ మీద గెలిచిన పదవి వదిలేశాడు. ఇండిపెండెంట్‌ గా సిద్దిపేట నుంచి గెలిచి, తెలంగాణ సత్తా చాటాడు. తెలంగాణ సాధించాడు. కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడుగా వున్నప్పుడు అప్పటి మంత్రి సత్యనారాయణ సవాలును స్వీకరించి రాజీనామా చేశాడు. కేంద్ర క్యాబినెట్‌ మంత్రి పదవి వదులుకున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఇవన్నీ గతంలో ఎవరూ చేయలేదు. కొంతవరకు చేసినా జీవిత పర్యంతం కొట్లాడడానికి ఎవరూ సిద్ధ పడలేదు. అందుకే చరిత్రలో కేసిఆర్‌ ఒక్కడే తెలంగాణ కోసం కనిపిస్తాడు. పదవులకు రాజీ పడలేదు. బెదిరింపులకు అదరలేదు. తెలంగాణ సాధించాడు. తెలంగాణ గోస తీర్చాడు. అందులో సాగు రంగాన్ని పండగ చేశాడు. రైతుకు సంతోషం నింపాడు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులే కట్టడం కుదరదన్న చోట నీటి పరవళ్ల సయ్యాటలు చూపించాడు. ఎండిన పొలాల గొంతు తడిపాడు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ చేశాడు. ఇప్పుడు దేశంలో సాగుకు అనువైన ప్రతి ఎకరాన్ని పంటలకు అనుకూలంగా మార్చుతానంటున్నాడు. దేశంలో సాగు విప్లవం తీసుకొద్దామని ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. తెలంగాణ లో సాగుతున్న సాగు విప్లవం దేశమంతా విస్తరించేందుకే బిఆర్‌ఎస్‌ అడుగులేస్తుంది. మన దేశాన్ని వ్యవసాయ రంగంలో తిరుగులేని శక్తిగా మారుద్దాం! అనేదే కేసిఆర్‌ నినాదం. టిఆర్‌ఎస్‌ విధానం. 

దేశమంతా సాగుకు ఉచిత విద్యుత్‌ అమలు చేద్దాం.

 ఎనిమిదేళ్ళ క్రితం వరకు తెలంగాణలో విద్యుత్‌ ఒక మిధ్య. ఒక కల. కరంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తెలంగాణ రైతాంగం కరంటు కోసం నిత్యం ఎదురుచూపులే…నిద్రలేని రాత్రులు గడపడమే…బావుల దగ్గర నిద్రలు చేయడమే…ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకడమే….తెలుగు దేశం ప్రభుత్వం పాలన సాగినంత కాలం బిల్లులు వసూలు చేసినా సరిగ్గా కరంటు ఇచ్చింది లేదు. పంటలు పండిరది లేదు. ఏటా పంటలు ఎండిపోవడమే…ఆరు గాలం కష్టం ఆవిరి కావడమే…అప్పులు పెరిగి, వాటిని తీర్చడానికి వలసలు వెళ్లడమే…తెలంగాణ బతుకును చిన్నాభిన్నం చేశారు. రైతును చిద్రం చేశారు. ఇక ఉచిత విద్యుత్‌ పేరుతో తెలంగాణ రైతులను మోసం చేసి, కాంగ్రెస్‌ ఇచ్చిందేమీ లేదు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాడు. ఒకనాడు వ్యవసాయ కరంటు కనెక్షన్‌ అంటే గగనం. ఒకప్పుడు పొలాలలో బోర్లు వేయాలంటే వాల్టా చట్టం అడ్డం. ఇప్పుడు రైతు ఎన్ని బోర్లు వేసుకున్నా, ఎన్ని మోటార్లు పెట్టుకున్నా అంతా ఉచితమే…ఇదే దేశమంతా అమలు చేయాలని కేసిఆర్‌ చూస్తున్నాడు. 

నదుల నీళ్లను పొలాలకు మళ్లిద్దాం.

 దేశంలో అనేక నదుల నీళ్లు లక్షల టిఎంసిలు వృధాగా సముద్రం పాలౌతున్నాయి. వాటిని పొలాలకు మళ్లించాలి. దేశంలో అవసరమైన అన్ని ప్రాంతాలలో ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం జరగాలి. దేశంలోని ప్రతి ఎకరానికి సాగునీరందాలి. అంతే కాదు. దేశంలోని అన్ని గ్రామాలు, నగరాలలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందాలి. తమిళ నాడు మొత్తం సముద్రం ఆవహించి వుంది. చెన్నై నగరంలో మంచినీటి కరువు. దేశ రాజధానిలో నీటి కటకట. మనం ఎంతో గొప్పగా చెప్పుకునే సింగపూర్‌ చుట్టూ సముద్రమే…ఆ దేశం మంచి నీటిని మలేషియా కు అమ్ముతుంది. తెలంగాణ లోని హైదరాబాదు చుట్టూ వున్నా ఔటర్‌ రింగ్‌ రోడ్డు విస్తరణ అంత దేశం సింగపూర్‌. ప్రపంచంలో అత్యంత ధనిక దేశం. ఇలా ఏమీ లేని చోట అధ్భుతాలు సృష్టించారు. కానీ దేశమంతా నదీ జలాలున్నా మంచినీటి కొరత మనం ఎదుర్కొంటున్నాము. ప్రజల దాహార్తి తీరాలి. అంటే బిఆర్‌ఎస్‌ రావాలి. ఇదే ఇప్పుడు దేశం కోరుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *