నేను మీ బిడ్డను..మీ సేవ కోసమే ఉన్నాను: గడల శ్రీనివాస్‌ రావు.

`డాక్టర్‌ జిఎస్‌ఆర్‌ ట్రస్టు ద్వారా జాబ్‌ మేళా నిర్వహణ

`సుమారు పది వేల మంది యువత హజరు.

`ఏడు వేల మంది నిరుద్యోగులు ట్రస్టులో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

`65 కంపనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 

`అక్కడిక్కడే ఎంపికైన వారికి ఉద్యోగాలు కల్పించారు.

`ఆ వెంటనే నియామక పత్రాలు అందజేశారు.

`ఒక్క రోజే కొన్ని వేల మందికి నియామకపత్రాలు అందజేయడం ఒక రికార్డు.

`ఇది ఆరంభం మాత్రమే… నిరంతర ప్రక్రియ..

`ఈ రోజు హజరు కాలేని వారు ట్రస్టులో రిజిస్టర్‌ చేసుకుంటే చాలు…

`ఉద్యోగం కల్పించే భాద్యత ట్రస్టే తీసుకుంటుంది.

`నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం ఎంతో సంతోషంగా వుంది.

`ఎంత ఎత్తుకు ఎదిగినా ఇలాంటి కార్యక్రమాల ద్వారా సేవ చేయడం ఎంతో ఆనందాన్నిస్తుంది.

 కొత్త గూడెం,నేటిధాత్రి:

నేను మీ కొత్త గూడెం బిడ్డను…మీకు సేవ చేయడానికి వచ్చాను. మీ అభ్యున్నతి కోసం నా శక్తి,యుక్తిని ధారపోస్తాను. నేను పుట్టిన గడ్డకు ఎంతో కొంత ఇవ్వాలన్నదే నా అభిమతం. మన ప్రాంతం ఇంకా ఎంతో ఎదగాల్సిన అవరసరం వుంది. ప్రగతి మార్గాన పయనించాల్సివుంది. మీ సేవ కోసం నేనున్నాను. ఇది ప్రారంభం మాత్రమే…ఇక నుంచి మీ సేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో వుంటా…మీకు తోడుగా వుంటా…అని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు, డాక్టర్‌. జిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్లు చైర్మన్‌ గడల శ్రీనివాస్‌రావు అన్నారు. ఎవరు ఎంత ఎదిగినా, ఎంతటి స్ధాయిలో వున్నా, తన తోటి సమాజానికి సేవ చేయడంలో వున్న తృప్తి ఎందులోనూ వుండదని చెప్పారు. డాక్టర్‌ జిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తగూడెంలో జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ జాబ్‌ మేళ ప్రారంభం మాత్రమే అన్నారు. భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతానికి ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని చెప్పారు. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి చదువుకొని ఎలాంటి అవకాశాలు లేని కాలంలో ఈ గడ్డనుంచి ఎదిగాను. నేను పట్టి పెరిగిన గడ్డ నాకు ఇంతటి జీవితాన్ని ఇచ్చింది. అందుకే నేను నా ప్రాంతానికి ఉపయోగపడాలి. కొత్తగూడెం ప్రాంతానికి నా శక్తి మేరకు ఎంత సేవ చేయాలో అంత చేస్తాను. అందుకు ఎంతో మంది శ్రేయోభిలాషులు సహకారం కూడా అందుతోంది. వారందరికీ నా కృతజ్ఞతలు అని శ్రీనివాస్‌ రావు అన్నారు. శనివారం కొత్త గూడెం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఆవరణలో డాక్టర్‌. జిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రసు ్ట ద్వారా జాబ్‌ మేళా కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. సుమారు 10 వేల మంది నిరుద్యోగులు ఈ మేళాకు హజరయ్యారు. దాదాపు 7వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. అదనంగా మరో మూడు వేల మంది ఈ రోజు స్పాట్‌లో అప్లికేషన్లు అందించారు. ఈ జాబ్‌ మేళాలో సుమారు 65 వివిధ కంపనీలు పాల్గొన్నాయి. ఆయా కంపనీలకు అవసరమైన యువతలో అర్హతలను ఆధారంగా అక్కడిక్కడే ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసి, కొన్ని వేల మందికి అప్పాయింటు మెంటు లెటర్లు ఇవ్వడం జరిగింది. సహజంగా ఇలా ఎక్కడా జరగదు. కాని డాక్టర్‌. జిఎస్‌ఆర్‌. ఫౌండేషన్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసిన మేళాలో అక్కడిక్కడే ఉద్యోగాలకు ఎంపిక చేయడం అన్నది వినూత్నమైన అడుగు అని చెప్పక తప్పదు. మొదటగా ఓ దివ్యాంగురాలకు అమెజాన్‌ కంపనీ ఎంపిక చేసిన ఉద్యోగానికి చెందిన అప్పాయింటు మెంటు లెటర్‌ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఈ జాబ్‌ మేళా ద్వారా నా జన్మధన్యమైందని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా తన శాయశక్తులా చేయాల్సినంత సామాజిక సేవ చేస్తూనే వున్నాను. ఈ జాబ్‌ మేళా కార్యక్రమం ఇక్కడితో ముగిసేది కాదని, ఇది ఆరంభం మాత్రమే అని ప్రకటించారు. ఈ జాబ్‌ మేళాల తమ నమోదు ప్రక్రియ జరగని వాళ్లు, జిఎస్‌ఆర్‌ సెంటర్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు. వాళ్ల అర్హతకు సంబంధించిన ఉద్యోగం అందించే బాధ్యత కూడా ట్రస్టే తీసుకుంటుందని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అంతే కాదు అభ్యర్ధి ఇంటర్వూకు వెళ్లేందుకు అవసరమైన ఖర్చులు కూడా ట్రస్టే అందిస్తుందని, వారికి ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తుందని శ్రీనివాస్‌ చెప్పారు. ఓ వైపు ఇక్కడ ఉద్యోగాల జాతర మొదలైనట్లే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల జాతర మొదలుపెట్టిందని చెప్పారు. నా ప్రాంత యువత కళ్లలో ఆనందం చూడడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నానని శ్రీనివాస్‌ రావు అన్నారు. నేను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎదిగిన జ్ఞాపకాల నుంచే సేవా భావం ఏర్పడిరదన్నారు. నన్ను ఇంత వాణ్ణి చేసిన గడ్డకు నేను కూడ ఎంతో కొంత చేయాలన్నదే నా తాపత్రయమని అన్నారు. ఎంతో మంది ఇబ్బందులకు గురి చేయాలని చూసినా…నన్ను ఇంత వాణ్ణి చేసిన పుట్టిన గడ్డకు సేవ చేస్తున్నానని అన్నారు. అనంతరం ధాత్రీ గ్రూప్‌ చైర్మన్‌, నేటిధాత్రి చీఫ్‌ ఎడిటర్‌. కట్టారాఘవేంద్రరావు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గడ్డమీద శ్రీనివాస్‌రావుకు అన్న మమకారం ఎంత గొప్పదో ఈ జాబ్‌ మేళాను చూస్తే అర్ధమౌతోంది. నేను ఎన్నో జాబ్‌ మేళాలను ప్రత్యక్ష్యంగా తిలకించాను. కాని ఇంతటి స్ధాయిలో జాబ్‌ మేళా నిర్వహన, స్పాట్‌లోనే ఉద్యోగ నియామక పత్రాలు అందించడం అన్నది గొప్ప విషయం. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి శ్రీనివాస్‌రావు గారికి ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఒక అధికారిగా వున్న ఆయన చేసే సేవ కార్యాక్రమాలే ఇంతటి స్ధాయిలో వుంటే, ప్రజల హృదయాలలో చెరగని ముద్రతో ఆయన మరింత చేసే చేసే అవకాశం వస్తే, ఈ ప్రాంతాన్ని ఎంతగా అభివృద్ధి చేయగలరో అర్ధమౌతోంది. ఇలాంటి వారికి ప్రజల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ వెనుకబడిన ప్రాంతానికి మేలు చేయడానికి, తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న శ్రీనివాస్‌రావు సంకల్పాని ప్రతి ఒక్కరూ కొనియాడాల్సిన అవసరం వుందన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇలా ప్రజా సేవ మీద మక్కువ వున్నవారు ముందుకొస్తే తెలంగాణ కూడా మరో కొత్త రూపును సంతరించుకుంటుందని చెప్పడంలో సందేహం లేదన్నారు. ఏది ఏమైనా శ్రీనివాస్‌రావు చేస్తున్న ఈ సేవ సామాన్యమైంది కాదని…ఎంతో అంకితభావం వుంటే తప్ప చేయలేరని అందుకు ఆయన ప్రశంసలు చెప్పాల్సిన అవసవరం వుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రీనివాస్‌రావు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *