కమిష్ నర్ కోట్ల కుంభకోణం పై నిశ్శబ్దంఎందుకు.!?

ఏ ఈ రాజేందర్ రెడ్డి లీలలు.

పని జరగలేదు కానీ లక్ష 30 వేలు ఫట్, మండలమంతా ఇది పరిస్థితి.!

ప్రజా దర్బార్ లో అవినీతి గుట్టురట్టు,నేటిధాత్రి మూడు నెలలు గా చెప్పుతున్న కమిషన్ మత్తులో పంచాయతీరాజ్.!?

ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణం డబ్బుతో అధికారులను కొనేశాడు, అందుకే చర్యలకు ధైర్యం రాక అధికారుల శబ్దం.!?

మహాదేవపూర్ కుంభకోణంపై కమిష్ నర్ దారి ఎది, కమీషన్ ఆ లేక చర్యలా.!?

మహాదేవపూర్-నేటిధాత్రి:

అభివృద్ధి నిధులకు సంబంధించి కోట్ల రూపాయల దుర్వినియోగంలో పలు సాక్షాలతో పాటు ప్రజలు కూడా అవినీతి భాగవతాలను నిధుల దుర్వినియోగాన్ని బయట పెట్టడం జరిగింది వంద రోజులు పూర్తి అయినప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారులు కమిషన్ కక్కుర్తి లో పడి ఇంజనీరింగ్ చీఫ్ వరకు అక్రమాలకు పాల్పడిన అధికారిని కాపాడుకుంటూ కుంభకోణ వ్యవహారాన్ని దారి మరణించే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగడం జరుగుతుంది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిష్ నర్ కోట్ల కుంభకోణ వ్యవహారంపై నేటి వరకు సి ఆర్ డి దృష్టిలో ఉందా ఉన్నప్పటికీ సి ఆర్ డి కిందిస్థాయి అధికారులకు చర్యలు సంబంధిత వ్యవహారంపై నివేదికను అందించాలని  ఆదేశించడం లాంటి కార్యాచరణ జరిగిందా లేకుంటే పంచాయతీరాజ్ జిల్లా స్థాయి అధికారులు కమిష్ నర్ ను అధికారులు కమిషన్ కక్కుర్తిలో పడి సి ఆర్ డి ని పక్కదారి పట్టించి ఎలాంటి అవినీతి జరగలేదని తెలుపడం జరిగిందా అందుకే నేటి వరకు సి ఆర్ డి మహాదేవపూర్ అభివృద్ధి నిధుల కోట్ల కుంభకోణంపై నిశ్శబ్ద వైఖరిని వ్యవహరిస్తున్నారేమో కానీ సి ఆర్ డి కి మండలంలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం సాక్షాలు బాధితులు తోపాటు ప్రజలు సైతం ఏ ఈ రాజేందర్ రెడ్డి అక్రమాలను స్వయానా జిల్లా కలెక్టర్ కు అందించడం జరిగింది అన్న వాస్తవాలు కమిష్ నర్ దృష్టికి పోకుండా పంచాయతీరాజ్ జిల్లా అధికారులు వాస్తవాలను కప్పిపుచ్చడం వలనే సి ఆర్ డి విచారణ విజిలెన్స్ ఇన్ఫోర్స్మెంట్ క్యూ సి లకు ఆదేశాలు ఇవ్వలేదు ఏమో అని చెప్పుకోవడం జరుగుతుంది.

 

 *కమిష్ నర్ కోట్ల కుంభకోణం పై నిశ్శబ్దంఎందుకు.!?* 

 

మహాదేవపూర్ మండలంలో అభివృద్ధి పనులకు సంబంధించి కోట్ల రూపాయల నిధుల కుంభకోణం గత 100 రోజులు గా అక్రమాలు సాక్షదారాలతో బాధితులు సైతం ఇటు మీడియా ముందు అటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండడం నేడు తెలంగాణ రాష్ట్రంలో నిధుల కుంభకోణ విషయంలో ఒక సాధారణ ఏఈ స్థాయి అధికారి కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడి పై అధికారుల వరకు తన చెప్పుచేతల్లో పెట్టుకొని నేటి వరకు ఏ ఈ రాజేందర్ రెడ్డి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు జిల్లా అధికారులతో పాటు ఇంజనీరింగ్ చీఫ్ ను సైతం కమిషన్ మాయలో పడేయడం జరిగిందని నేడు చర్చించుకోవడం జరుగుతుంది. మండలానికి సంబంధించిన కుంభకోణ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లో ఉన్నప్పటికీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ నేటి వరకు మహాదేవపూర్ కుంభకోణానికి సంబంధించి విచారణకు ఆదేశించకపోవడం ప్రజలకు అర్థం కావడం లేదు. మండలంలో నాలుగున్నర సంవత్సరాల నుండి అభివృద్ధి పనుల పేరుతో ఒకవైపు నాసిరకం పనులు బినామీ కాంట్రాక్టర్లకు కమిషన్ కొరకు ఎక్కువ మోతాదులో పనులు కేటాయించడం ఎక్కువ కమిషన్ అందించిన కాంట్రాక్ట్ పనులను పర్యవేక్షించకపోవడం కమిషన్ ఎక్కువ అర్చించే కొత్త పథకాలను ప్రజలు ఇబ్బందులకు గురైతున్నప్పటికీ వాటిని అమలు చేయడం ఏ ఈ రాజేందర్ రెడ్డి తను ఒక అధికారి అన్న విషయాన్ని మరిచిపోయి కాంట్రాక్టర్ రూపాన్ని బినామీలతో దాల్చడం ఇప్పటికీ మండలంలో పనులు చేయకపోయినప్పటికీ లక్షల రూపాయలు పనులు చేసినట్లు రికార్డు చేసి కోట్ల రూపాయలను దండుకోవడం జరిగింది. ఇలా నాలుగున్నర సంవత్సరాల్లో ఏఈ రాజేందర్ రెడ్డి మండల పరిషత్ అధికారి తోపాటు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ప్రజా ప్రతినిధులు అంతా ఒక్కటై భారీగా ఉన్న మండల నిధులను అభివృద్ధి పనుల పేరిట పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలను తమ జీవుల్లోకి మళ్లించుకోవడం జరిగింది. మండలంలో భారీ కుంభకోణానికి దారి తీసిన రాజేందర్ రెడ్డి మాత్రం సెలవు పెట్టి సెలవులలో సెలబ్రేట్ చేసుకుంటూ అధికారులను తలపై వస్తున్న వార్తలు బినామీల తో కమిషన్ల వ్యవహారాన్ని కొనసాగించడం జరుగుతున్నప్పటికీ సి ఆర్ డి మాత్రం స్పందించకపోవడం ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 *పని జరగలేదు కానీ లక్ష 30 వేలు ఫట్, మండలమంతా ఇది పరిస్థితి.!* 

 

అతని మేధస్సు వందనాలు అక్రమాలు సృష్టించడంలో యావత్ రాష్ట్రంలోని ఏ శాఖలో లేని అంత తెలివితేటలు ఏ ఈ రాజేందర్రెడ్డి లో చూడవచ్చు. ఎందుకంటే రాజేందర్ రెడ్డి కి కేవలం కమిషన్ ప్రభుత్వ ఖజానాలోని నిధులు తన జీబుల్లోకి రావాలని ఒక్కటే లక్ష్యం గా ముందుకు సాగే అధికారి ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖ లో నీ మహదేవ్పూర్ మండల పంచాయతీ రాజ్ ఇంజినీర్ రాజేందర్ రెడ్డి అని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అందుకు ప్రజలందరూ అక్రమాల సృష్టికర్తగా అతనికి వందనాలని చెప్పుకోక తప్పడం లేదు. ఏఈ హోదాలో ఉండి పలు అనామకులకు కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే క్రమంలో పెట్టుబడులు పెట్టి వారి పేరున వందల పనులను పూర్తిగా నాసిరకం పనులు నిర్వహించి బిల్లులను చేపట్టడం జరిగింది. అలాగే అంచనాలకు మించి అతని అక్రమాలకు సృష్టించడంలో తెలివి ఎవరికి సాటి కాదు అన్నది వాస్తవమే అన్నట్టుగా ప్రభుత్వ నిధుల పేరుతో ఎలాంటి పనులు చేపట్టకుండానే అక్కడ పెద్ద మొత్తంలో పని నిర్వహించినట్లు లక్షల రూపాయల బిల్లులను రికార్డ్ చేసి అటు బినామీలకు అందించి వారి దగ్గర నుండి ఏ ఈ రాజేందర్ రెడ్డి తీసుకోవడం ఇలా మండలంలో లెక్కలేని పనులను కోట్ల రూపాయల నిధులను పనులు చేసినట్లుగా నమోదు చేసి పెద్ద మొత్తంలో నిధులను దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. తాజాగా మండలంలోని సూరారం గ్రామంలో కాగితంలో మాత్రం పేరు పనిచేయడం జరిగిందని అక్కడ మాత్రం ఇలాంటి పని చేయలేదని అయినప్పటికీ ఒక లక్ష 30 వేల రూపాయల బిల్లును రికార్డ్ చేసి నిధులు బినామీల ద్వారా ఏ ఈ జేబుల్లోకి మళ్లించుకోవడం జరిగింది.

 

 

 *ప్రజా దర్బార్ లో అవినీతి గుట్టురట్టు,నేటిధాత్రి మూడు నెలలు గా చెప్పుతున్న కమిషన్ మత్తులో పంచాయతీరాజ్.!?* 

 

మండలంలో కోట్ల కుంభకోణం జరిగిందని నిధుల పేరుతో ఏ ఈ రాజేందర్ రెడ్డి మండల పరిషత్ అధికారి తో పాటు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై నాలుగున్నర సంవత్సరాల నుండి మండలానికి ప్రభుత్వం వెచ్చించిన కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని పలు సాక్షాలను సైతం నేటి ధాత్రి బయటపెట్టింది. కానీ కోట్ల కుంభకోణ వ్యవహారంలో మండల స్థాయి నుండి చీఫ్ ఇంజనీర్ వరకు అంతా ఏఈ రాజేందర్ రెడ్డి కమిషన్ మాయలో పడి ఉండడం నేటి వరకు అతనిపై చర్యలు తీసుకోకపోవడం సి ఆర్ డి తోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలా దృష్టిలో మహదేవ్పూర్ కుంభకోణ వ్యవహారం ఉన్నప్పటికీ మండలంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని తప్పుడు సమాచారం ఇస్తూ చర్యల కు ఆదేశించకుండా ఉండుటకు నేటికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తాజాగా నేటి ధాత్రి వరుస కథనాలను పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా స్పందించకుని క్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ రాజేందర్ రెడ్డి ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు సాక్షాలు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ పంచాయతీరాజ్ ఉన్నత అధికారులు సి ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీలు చర్యలకు ఆదేశిస్తే లేరని ప్రజలు వారి విధి నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక ప్రజా దర్బార్ లోనే ఏఈ అక్రమాలను తామే వెలిగితీస్తామని ఏకమై తమ గ్రామంలో ఏ ఈ చేసిన అరాచకాలను వెలికి తీసే క్రమంలో నీరుగా ప్రజలే రంగంలోకి దిగి పైపులు వేయకుండానే వేసినట్లు రికార్డు చేసి ఒక లక్ష 38 వేల రూపాయల బిల్లులు నమోదు చేయించి బినామీలతో డబ్బులను తీసుకోవడం జరిగింది అన్న విషయాన్ని ప్రజలు బహిర్గతం చేయడం జరిగింది. తన అక్రమాలు తెలుసుకున్న రాజేందర్రెడ్డి హటావోటిగా పైపులను అమర్చించే కార్యక్రమం చేపట్టడంతో ప్రజలు వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం పైపులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో మహాదేవపూర్ గ్రామ పంచాయతీకి పైపులను పంపించడం జరిగింది. నేటి ధాత్రి గత 100 రోజుల నుండి ఏ ఈ రాజేందర్ రెడ్డి మండలంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డాడని పలు ప్రదేశాల్లో అవసరం లేనప్పటికీ నాసిరకం పనులు అలాగే పనులు చేయకుండానే బిల్లులను రికార్డు చేయడం జరుగుతుందని వరుస కథనాలు వ్రాస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ జిల్లా అధికారులు తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడం జరిగింది. చివరికి నేటి ధాత్రి కథనాలు సాక్ష్యాలుగా ప్రజల దర్బార్ లోనే అక్రమాలకు ప్రజలే అధికారులుగా మారి వెలికి తీయడం జరుగుతుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత కమిషన్ మత్తులో ఉందో దీన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది.

 

 

 *ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణం డబ్బుతో అధికారులను కొనేశాడు, అందుకే చర్యలకు ధైర్యం రాక అధికారుల శబ్దం.!?* 

 

పి ఆర్ రాజేందర్ రెడ్డి అంటేనే ఒక అక్రమ బ్రాండ్ గా కమిషన్ కలెక్షన్ కింగ్ గా యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లా తో పాటు పంచాయతీరాజ్ శాఖలో ఒక మారు మోగుతున్న పేరు. మండలంలో కుంభకోణ వ్యవహారం పుట్టను బహిర్గతం చేసి వంద రోజులు పూర్తి అయినప్పటికీ తాజాగా కమిషన్లలో లక్షలకు పైనే అమాయక కాంట్రాక్టర్ల దగ్గర నుంచి దోచుకున్న రాజేందర్ రెడ్డి చివరికి ఎలాంటి పని నిర్వహించకుండానే తనకు ఇష్టమొచ్చినంత బిల్లును రికార్డ్ చేసి నిధులను తన జీబుల్లోకి మళ్లించే సత్తా ఉన్న ఏ ఈ ప్రజలు తిరుగుబాటై అక్రమాల చిట్టాలు బయటపడుతున్న క్రమంలో అతనిపై వేలెత్తి చూపే అధికారి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పంచాయతీరాజ్ శాఖలో లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజేందర్ రెడ్డి అంటే పిఆర్ శాఖలోనే అక్రమాలకు కమిషన్లకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారడం ఏ అధికారి అయిన రాజేందర్ రెడ్డి కమిషన్ మాయలో పడాల్సిందే ఎందుకంటే అధికారిని బట్టి కమిషన్ రేటు కమిషన్ రేటును ఫిక్స్ చేసి వారికి అందించే సత్తా కేవలం రాజేందర్రెడ్డి లోనే ఉండడం ఇక జిల్లా అధికారులతో పాటు ఉన్నత అధికారులకు ప్రభుత్వం మహాదేవపూర్ మండలానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన విషయం తెలిసి ఉండడం తమకు ఊహించినంత కమిషన్ వస్తుందని తమకు రాజేందర్రెడ్డి ఉన్నాడని జిల్లా అధికారులతో పాటు ఉన్నత అధికారులు సైతం ఒక భరోసాతో ఉండడం రాజేందర్ రెడ్డి కుంభకోణ వ్యవహారం సాక్షాలు న్యాయస్థానాలను సైతం పనికిరాకుండా చేసింది కమిషన్ వ్యవహారం నేటికి రాజేందర్ రెడ్డి పై ఈ ఒక్క పంచాయతీరాజ్ అధికారి తన విధి నిర్వహణలో బాధ్యతగా అక్రమాలపై కన్నేసిన అధికారి కరువైపోవడం ఎందుకంటే రాజేందర్ రెడ్డి మండలంలో అక్రమాలకు పాల్పడిన డబ్బులు అధికారులకు పంచిపెట్టడం జరగడంతో నేటికీ ఏ ఒక్క అధికారి ముందుకు రావడం లేదు. గత వారం రోజుల క్రింద డి ఈ సాయిలు ఏ ఈ రాజేందర్ రెడ్డి తనకేమీ కాదని అధికారులంతా నా వైపే ఉన్నారని వారి చిత్త నా దగ్గర ఉందని నాపై చర్యలకు ఆదేశిస్తే వారు ఎవరు తోడిన గోతిలో వారు కూడా పడతారని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ బినామీలకు చెప్పుకున్నట్లు మండలమంతా ఒక చర్చనీయంగా మారింది. అలాగే డి ఈ సాయిలు కూడా పలు ప్రదేశాల్లో పలువురు వ్యక్తులతో రాజేందర్ రెడ్డి కి ఏమి కాదు పంచాయతీరాజ్ శాఖలో నాసిరకం కమిషన్ అనేది సరే మామూలే ఎవరు అధికారులు పట్టించుకోరు అని చెప్పుకోవడం కూడా చర్చనీయంగా మారింది దీన్నిబట్టి చూస్తే పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులకు రాజేందర్ రెడ్డి కమిషన్ వ్యవహారం ఇక్కడ వరకు దారితీసిందో అర్థమౌతుంది.

 

 *మహాదేవపూర్ కుంభకోణంపై కమిష్ నర్ దారి ఎది, కమీషన్ ఆ లేక చర్యలా.!?* 

 

మహదేవ్పూర్ మండలంలో నిధుల దుర్వినియోగం కుంభకోణ వ్యవహారం సత్వర చర్చల్లో ఉన్నప్పటికీ జిల్లా స్థాయి పంచాయతీ అధికారులు అలాగే ఇంజనీరింగ్ చీఫ్ సైతం కమిషన్ మాయలు పడి ఉన్నారని అందుకు నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శాఖ ఉన్నత అధికారి లో ఒకరైనప్పటికీ నేటి వరకు ఏ ఈ రాజేందర్ రెడ్డి భాగవతం సి ఆర్ డి దృష్టి కి పోలేదా కావాలని కమిషనర్ ను కమిషన్ కక్కుర్తి లో ఉన్న అధికారులు పక్కదారి పట్టించారా ఇలా ఎన్నో అనుమానాలు ప్రజల్లో వ్యక్తం కాక తప్పడం లేదు. ఏది ఏమైనప్పటికీ కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఇప్పటికైనా మహదేవ్పూర్ కుంభకోణంపై తక్షణమే విజిలెన్స్ ఇన్ఫోసిమెంట్స్ క్యూసీలకు విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడుతూ కోట్ల రూపాయల నిధులను వెచ్చించిన క్రమంలో ఒకవైపు ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా మరోవైపు శాఖను అప్రతిష్ట పాలు చేసేలా వ్యవహరిస్తున్న ఏఈ రాజేందర్ రెడ్డి తో పాటు జిల్లా స్థాయి అధికారులు అలాగే మండల పరిషత్ అధికారులతో పాటు పలు ప్రజాప్రతినిధులపై విచారణ జరిపి ఇప్పటికీ అక్రమాలకు పాల్పడిన నిధులను తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా చర్యలు చేపట్టి వారిపై శాఖ పరమైన చర్యలు చేపట్టి పంచాయతీరాజ్ శాఖ నుండి వారికి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని మండలం తో పాటు యావత్ జిల్లా ప్రజలు కమిష్ నర్ ను కోరుతున్నారు. ఇక కమిషనర్ దారి ఎటు ఇటు అన్నది ఏఈ రాజేందర్ రెడ్డి పై చర్యలు తీసుకుంటే తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *