అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 

కరీంనగర్:నేటిధాత్రి 

కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా నగర మేయర్ వై.సునీల్ రావు 3వ డివిజన్ లో పర్యటించారు.కిసాన్ నగర్ లో నూతనంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్,డ్రైనేజీ,సిసి రోడ్ల పనులను కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ తో కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు.అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అన్ని రంగాల్లోని ముందుకు తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడని మేయర్ సునీల్ రావ్ తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *