రైతును బతకనివ్వరా? సాగును చిదిమేస్తారా?

`అప్పులతో, అర్థాకలితో బతుకుతున్న రైతులు బిజేపి కళ్లకు సంపన్నులుగా కనిపిస్తున్నారా?

` ప్రపంచంలోనే సంపన్న రైతులు మన దేశంలోనే వున్నారా?

` అందుకే వ్యవసాయం మీద పన్నా!?

`వ్యవసాయం రాష్ట్ర జాబితాలో అంశం…దాని మీద కేంద్రం పెత్తనమేమిటి?

` బిజేపిపై మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ధ్వజం.

`రైతులపై బలవంతంగా పన్నులు వేసేకా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తారా?

`ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం!

`రైతు సంక్షేమమే బిజేపికి గిట్టదా?

`అంబానీ, ఆదానీల మీద వున్న ప్రేమ బిజేపికి రైతుల మీద లేదు!

`దేశ రైతు అత్యంత దయనీయమైన పరిస్థితిలో వున్నాడు.

`ప్రకృతిని నమ్ముకొని బతుకుతున్నాడు.

` దేశానికి అన్నం పెడుతున్నాడు.

` 1860లో బ్రిటిష్‌ ప్రభుత్వం చేసిన చట్టం అమలు చేస్తారా?

`అప్పుడు భూస్వాములు, జమిందారులు, జాగీర్థారులున్నారు. రైతులు లేరు!

` బిజేపి నేతలకు చరిత్ర కూడా సరిగ్గా తెలియదు!

`భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాలు బిజేపికి తెలియవా?

` అదే నిజమైతే దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్లు?

`ఇప్పుడిప్పుడే తెలంగాణలో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

`వారిని మళ్ళీ నిప్పుల్లోకి తోస్తారా?

`ఇప్పటికే మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు.

`రైతులకు ఉచిత విద్యుత్‌ అందకుండా కుట్ర చేస్తున్నారు.

నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ కేంద్రంపై ధ్వజమెత్తారు.

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బిజేపి పార్టీకి రైతులంటే ఎందుకంత పగ? రైతు పచ్చగా వుంటే చూడలేరా? రైతులు బాగుపడుతుంటే భరించలేరా? తెల్లారిలేస్తే దేశంకోసం…ధర్మం కోసం అని నీతులు చెబుతారు…దేశం కోసం కోసం అంటే అందులో రైతులు లేరా? ధర్మం కోసం చెప్పే మాటల్లో రైతులుండరా? ఏమిటీ విపరీతమైన పోకడ. కడుపు కట్టుకొని, అర్ధాకలితో పగలనక, రాత్రనక, ఎండనక,వాననక, చలనక కష్టపడి చెమట చుక్కలతో సాగు చేసే రైతుల మీదనా బిజేపి పార్టీ ప్రతాపాలు… ఇప్పటిదాకా రైతుల మీద ప్రకృతి ప్రకోపాలు చూశాం…ఇప్పుడు బిజేపి దుర్మార్గాలు చూస్తున్నాం… రైతులు పచ్చగా వుంటే చూడలేరా? రైతు సాగు చేయడం చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారా? రైతులు ఆ మాత్రం బతకొద్దా? ఎద్దేడిచి ఎవుసం…రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. అన్న సంగతి బిజేపి నేతలకు తెలియదా? ఉల్లిగడ్డ ధర ఎంతో తెలియదు…రైతులకు ఎంత గిట్టుబాటు అవుతుందో తెలియదు…ప్రజల వద్దకు చేరేవరకు ఎంత ఖరీదౌతుందో తెలియదు….మేం ఉల్లిపాయ తినం అని సమాధానం మాత్రం చెబుతారు…రైతుల మీద పన్నులేయాలన్న యోచన చేస్తారు…ఇంత దుర్మార్గమా? ప్రపంచంలో కూడా ఎక్కడా ఇలాంటి నీతి మాలిన పాలన కనిపించదేమో! రైతు కంట కన్నీరొలికించిన పాలకులు బాగుపడలేదు! పూర్వం రాజుల పాలనలో రైతులు అన్నమో రామచంద్రా! అనుకునేవారని విన్నాం…కాని ప్రజాస్వామ్య వ్యవస్ధలో మొదటిసారి కేంద్రం రైతులను గోసపెడుతుండగా చూస్తున్నామని ధ్వజమెత్తుతున్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌ నాయక్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో…సంబాషణ ఆయన మాటల్లోనే…

 రైతు మీద 2014 ఎన్నికల మందు మొసలి కన్నీరు కార్చి, అధికారంలోకి వచ్చి ఆ రైతుకు కన్నీరు తెప్పిస్తారా?

 రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తారా? దీనిని తల్లిపాలు తాగి విషం కక్కడమనకపోతే ఏమంటారు… మొన్నటి దాకా డిల్లీలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. పదమూడు నెలల పాటు దేశ రాజధానిలో బిజేపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఎదుర్కొన్నారు. వందలాది మంది రైతలు మరణించారు. అలాంటి రైతులను, కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆ కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించారు. కాని కేంద్ర బిజేపి ప్రభుత్వం మాత్రం వారి గురించి కూడా ఆలోచించలేదు. ఆఖరకు రైతులను నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతుందన్న ఆందోళనతో పంజాబ్‌ ఎన్నికల ముందు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. ప్రధాని మోడీ కన్నీళ్లు పెట్టుకొని క్షమాపణ వేడుకున్నాడు. కాని ఆ చట్టాలను రద్దు చేయలేదు. ఇప్పటికీ ఆ కత్తి రైతుల తలల మీద వేళాడుతూనే వుంది. రైతులు బిజేపి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ చట్టాలు అమలు చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే…అది మరువక ముందే మళ్లీ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సలహా మండలి చైర్మన్‌ ఓ దినపత్రికలో రాసిన వ్యాసం ఇప్పుడు దేశ రైతాంగాన్ని కలవరపెడుతుంది. ఎందుకంటే ఆ వ్యాసం రాసింది సాధాసీదా వ్యక్తి కాదు. ప్రధానమంత్రి మోడీకి తెలియకుండా ఇలాంటి వ్యాసం రాస్తాడని ఎవరూ ఊహించలేం. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచనే అన్నది స్పష్టమౌతోంది.  

అప్పులతో అర్ధాకలితో బతికే రైతును మరింత ఆదుకోవాలన్న ఆలోచన చేయాల్సిందిస పోయి, రైతు బాగా సంపాదించుకుంటున్నాడన్న దుర్మార్గమైన ఆలోచన ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలోనే వింటున్నాం…

గతంలో ఎప్పుడైనా రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వాలే ఎక్కువగా వుండేవి…కాని ఇప్పుడు మాత్రం రైతులు, సామాన్యులను ఇబ్బందులు పెట్టి, పెద్దవారికి పెట్టే కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం…రైతు గోస చెప్పుకుంటే తీరేది కాదు…రైతు బాధలు, వ్యధలు తెలిసిన ఏకైక నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌. అందుకే ఆయన తెలంగాణ ఉద్యమం చేశాడు…తెలంగాణ సాదించాడు. ఏడేళ్లులో తెలంగాణ రూపు రేఖలు మర్చాడు. తెలంగాణ సస్యశ్యామలం చేశాడు…ఎండిన పల్లెలను పచ్చగా మార్చాడు…ఎండిన బీళ్లుకు గోదావరి జలాలు మళ్లించాడు…చెరువులు బాగు చేయించాడు. ఒర్రెలు, వాగులల్లో కూడా నీళ్లు చూపిస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించాడు. అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టాడు. రైతుకు నిరంతరం కరంటు ఇస్తున్నాడు. కాలువల ద్వారా నీళ్లు అందిస్తున్నాడు. ఏటా రెండు పంటలకు సరిపడ సమృద్ధి కరమైన నీటిని సరఫర చేస్తున్నాడు. భూగర్భ జలాల మట్టాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా పెంచాడు. ఎక్క చూసినా ఎండాకాలంలో కూడా నీటి చెరువులు కూడా నిండుగా వుండేలా చేశాడు. రైతును రాజు చేశాడు….ఇది కేసిఆర్‌ విజన్‌…ఆయన కలలు గన్న తెలంగాణ. ఇది రైతు నాయకుడికి మాత్రమే సుసాధ్యం. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడికే సాధ్యం. ఇదే సాగు పండగ దేశమంతా కావాలని ఓ పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ కోరుకుంటుంటే, రైతులపై పన్ను వేయాలని దుష్టపన్నాగం కేంద్ర ప్రభుత్వం పన్నుతోంది…దీన్ని రైతులే కాదు…ప్రజలంతా వ్యతిరేకించాల్సిన అవసరం వుంది. 

దేశంలో రైతులంతా సంపన్నంగా వున్నారంటూ వ్యాసం రాసిన వ్యక్తికి అసలు పల్లె అంటే ఏమిటో తెలుసా? పల్లె జీవనం తెలుసా? 1860 చట్టం అమలు చేయాలా? చెప్పడానికి కనీసం ఇంగితం కూడా లేకుండా ఆర్ధిక నిపుణుడు అని చెప్పుకోవడం సిగ్గు చేటు. 

ఏ ప్రభుత్వమైనా దేశానికి అన్నం పెట్టే రైతు సుఖంగా వుండాలని కోరుకోవాలి. కాని రైతును ఏడిపించాలని చూడ చూడకూడదు. రైతును పీడిరచిన రాజులందరూ చరిత్ర హీనులుగానే మిగిలిపోయారు. బిజేపి కూడా ఆ పరిస్ధితి తెచ్చుకుంటోంది. మన దేశంలో బ్రిటీష్‌ పాలనకు ముందుగాని, బ్రిటీష్‌ పాలకుల కాలంలో గాని సాగు చేసింది మాత్రమే రైతులు…కాని అవి వారి భూములు కాదు..కేవలం రైతులు కూలీలు మాత్రమే. రాజులు, వారి సామాంత రాజులకు, ఆ తర్వాత జమిందారులకు మాత్రమే భూములు వుండేది. దాంతో వారు భూమి శిస్తు చెల్లించేవారు. అంతే కాని రైతులు చెల్లించే అవకాశం లేదు. రైతులు ఆరుగాలం కష్టపడి ఎంత పనిచేసినా, నాటి జమిందారులు ఇచ్చే కూలీ చాలక, తాము చేసిన కష్టం భూస్వాములు దోచుకుంటున్నారనే దున్నేవాడికే భూమి అన్న నినాదం తెచ్చారు. దేశంలో అనేక చోట్ల ఇలాంటి ఉద్యమాలు చేశారు..ముఖ్యంగా తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం…నిజాం వ్యతిరేక పోరాటం ఒక చరిత్ర. ఒక్క తెలంగాణలోనే కాదు…దేశమంతా ఈ పోరాటాలు సాగాయి. అప్పుడు రైతుల చేతుల్లోకి భూములు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చాక సాగు మీద సుంకం వసూలు చేయడం ఆగిపోయింది. ఇక రైతుల మీద పన్నులు వేయడం అంటే…పూర్వ కాలంలో హిందువులు కాని వారి మీద మొగలులు వేసినట్లు జిజియా పన్నులు తెలిసిందే…మహారాష్ట్రను ఏలిన శివాజీ లాంటి వారు దేశ్‌, సర్ధేశ్‌ ముఖ్‌ అనే పన్నులు వసూలు చేశారు…ఇక శ్రీకృష్ణ దేవరాయల లాంటి వారు గర్భిణీ పన్నులు వేశారు..ఆఖరుకు వ్యభిచారం మీద పన్నులేసి రాజ్య పాలన చేశారు..ఇది అప్పటి నియంతృత్వ పాలనలు…కాని ఇప్పుడు ప్రజాస్వామ్యం… దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిపోతున్నా, నదీ జలాలను పొలాలకు మళ్లించే ఆలోచన చేయడం లేదు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనమిదేళ్లవుతోంది. ఒక్కటంటే ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేసింది లేదు. రైతు గురించి ఆలోచించింది లేదు. రైతులకు చేసిన మేలు ఒక్కటి కూడా లేదు…ఎరువులు ధరలు పెంచారు…కరంటు మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు…వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. ఇప్పుడు ఆఖరుకు రైతులను నుంచి పన్నులు వసూలు చేద్దామనకుంటున్నారు. అసలు వ్యవసాయం అన్నది రాష్ట్ర జాబితాలోని అంశం…దీనిపై కేంద్ర పెత్తనం ఏమిటి? రాష్ట్రాల ఇష్టం లేకుండా ఎలాంటి చట్టాలు చేయడానికి వీలు లేదు. కాని రాష్ట్రాల భుజాల మీద తుపాకి పెట్టి, పన్నుల భారం వసూలు చేయాలని చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఊరుకుంటాడా…దేశమంతా ఒక్కటి చేస్తాడు..దేశ రైతాంగాన్ని కదిలిస్తాడు…ఉప్పెన సృష్టిస్తాడు…బిజేపిని ప్రజల్లో లేకుండా చేస్తాడు…ఇది తధ్యం…కనిపించే దేశ భవితవ్యం!! ఇదే…ఇదే! రైతుతో గోక్కొని ఆనాడు చంద్రబాబుకు పట్టిన గతే….ఈసారి బిజేపికి తప్పదు. ఇది శంకర్‌ నాయక్‌ ఒక రైతుగా చెబుతున్న మాట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *