పల్లెల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

పల్లెల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

పరిషత్‌ ఎన్నికల ప్రచారం మండలంలో జోరుగా సాగుతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని ల్యాబర్తి, బొక్కలగూడెం గ్రామాలలో టిఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి మార్గం బిక్షపతి, ఎంపిటిసి అభ్యర్థిని అన్నమనేని ఉమాదేవి గెలుపు కోసం ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ఇంచార్జీ ఇల్లందుల సుదర్శన్‌ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపిపి మార్నేనీ రవిందర్‌రావు హాజరై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కువ నిధులతో గ్రామాలలో అభివద్ధి పనులుచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌ నాయకత్వంలో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, గ్రామ ఇంచార్జ్‌ శ్యాంసుందర్‌రెడ్డి, అధ్యక్షులు మున్నురు సొము, చీకొండ యాకయ్య, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, నర్సింగరావు, మాజీ ఎంపిటిసిలు నిరంజన్‌, మండల నాయకులు తుమ్మల యాకయ్య, హరిప్రాసాద్‌, సుభాష్‌, గ్రామ ముఖ్యనాయకులు కోంరయ్య, సారంగం, ఉపసర్పంచ్‌ కళింగరావు, టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఉపాధి పనులు చేసి ప్రచారం

ఇల్లంద గ్రామంలో చెరువు గట్టు వద్ద ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలిల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి జడ్పిటిసి మార్గం భిక్షపతి, ఎంపిటిసి అభ్యర్థి పిట్టల జ్యోతిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుంకరి సాంబయ్య, మాజి సర్పంచ్‌ తూళ్ళ కుమారస్వామి, అధ్యక్షుడు ఎల్లస్వామి, ఇంచార్జులు, మోహన్‌రావు, పూజారి రఘు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *