పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు..

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు నని విగ్నేశ్వర్ అన్నారు.. బాల సముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ హై స్కూల్ శనివారం ప్రముఖ స్పీకర్, మోటివేటర్, సిలువేరు విఘ్నేశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని దానికి తోడు సాధన చేస్తే అన్నిటిని సాధించవచ్చని, ఉన్నదాని విలువ తెలుసుకోకుండా లేనిదాని కోసం పాకులాడుతూ ఉన్న దాన్ని కోల్పోతున్నారు అని అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు అని తెలిపారు.

తాను చిన్నప్పటి నుంచి ఉన్నత చదువులు చదివి సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ఉండేది కానీ ప్రమాదవశాత్తు రెండు చేతులు పోయినప్పటికీ లక్ష్యసాధన కోసం శ్రమిస్తున్నాను.

తల్లిదండ్రులను,గురువులను, గౌరవించాలని తెలిపారు.

మన హంగు ఆర్భాటాల కోసం ప్రకృతి వనరులను హాని కలిగించకూడదని విద్యార్థులకు తెలియజేశారు. వాటిని కాపాడే బాధ్యత ముందు తరాలుగా విద్యార్థుల భుజాలపై ఉందని గుర్తు చేశారు. చివరగా చిరునవ్వుతో ఎన్ని కష్టాలేనా సాధించవచ్చు అని పిల్లల్లో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిదురాల సోమరత్నం, ఉపాధ్యాయులు వినయ్, విజయ్, శ్రీనివాస్, యుగంధర్ ,రమేష్ ,ఉదయ్, రజనీకాంత్, అనిల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *