కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డులో నమోదు చేయాలి…

హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్….

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)కమలాపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మంగళవారం పరిశీలించారు.కంటి పరీక్షకు వచ్చిన ప్రజలతో సరైన పద్ధతిలో చూస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డులో ఎక్కించాలని ఈ సందర్భంగా అన్నారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని గడపగడపకు చేరేలా ప్రజాప్రతినిధులు అంతా కృషి చేస్తున్నారని,

 ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తడక రాణి,జడ్పీటీసీ లాం డిగే కల్యాణి,ఎంపీడీఓ పల్లవి,ఎంపీఓ విమల,గ్రామ సర్పంచ్ కట్కూరి విజయ, వైద్యాధికారిణి హర్షిని ప్రియ,ఎంపీటీసీలు మాట్ల వెంకటేశ్వర్లు,రామస్వామి తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *